చెరువు.. కనుమరుగు!
తణుకు పురపాలక సంఘ పరిధిలో మత్స్యశాఖ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిరుపయోగంగా మారాయి
రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
ఆక్రమణకు గురవుతున్న మత్స్యశాఖ చెరువు
తణుకు, న్యూస్టుడే: తణుకు పురపాలక సంఘ పరిధిలో మత్స్యశాఖ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిరుపయోగంగా మారాయి. స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని ఆనుకొని 3.74 ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు ఉన్నాయి. పట్టణ నడిబొడ్డున వీటి విలువ సుమారు రూ.53 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే అక్రమార్కులు అర ఎకరానికి పైగా ఆక్రమించి, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
తూడుతో నిరుపయోగంగా.. తణుకు పురపాలక సంఘంగా ఏర్పడక ముందు పంచాయతీగా ఉన్నసమయంలో చెరువుల నిర్వహణ బాధ్యత మత్స్య శాఖకు అప్పగించారు. రొయ్య, చేప పిల్లలను ఉత్పత్తి చేసి రాయితీపై పరిసర ప్రాంతాల్లోని 70 గ్రామాల రైతులకు సరఫరా చేసేవారు. కాలక్రమేణా మత్స్య శాఖ నిర్వహణ పట్టించుకోకపోవడంతో చెరువు చుట్టూ ఆక్రమణలు వెలిశాయి. రెండేళ్ల కిందట సంబంధిత అధికారులను చెరువులను మళ్లీ తవ్వించి ఒక ఏడాది పాటు చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. అనంతరం నిరుపయోగంగా వదిలేేశారు. ప్రస్తుతం ఇవి గుర్రపు డెక్క, తూడుతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
- చెరువు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని శాశ్వత కట్టడాలు నిర్మించారు. ఈ భవనాల్లో వృథా జలాలను సైతం మత్స్యశాఖ చెరువులోకి విడుదల చేస్తుండటం గమనార్హం. సంతమార్కెట్ ఆనుకొని చెరువులు ఉండటంతో చెత్తకుప్పల్లా మారుతున్నాయి. దుర్గంధం వెదజల్లుతోంది.
మత్స్యశాఖ పరిధిలో ఉన్న రెండు చెరువులను ఆధునికీకరించి రూ.25 లక్షలతో శాఖ భవనాన్ని నిర్మించడానికి ప్రతిపాదించాం. సిమెంట్ ట్యాంకుల్లో చేప పిల్లలను పెంచి ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మత్స్య శాఖకు సంబంధించి 3.74 ఎకరాల భూమిలో 1.74 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ప్రస్తుతం ఉన్న రెండెకరాలు ఆక్రమణకు గురికాకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేశాం.’ అని తణుకు మత్స్య శాఖ ఇన్ఛార్జి సహాయ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం