రీసర్వే చిక్కు.. దక్కని భూహక్కు!
వైకాపా ప్రభుత్వం వచ్చాక చేపట్టిన రీసర్వే ద్వారా అంతకాదు ఇంతకాదన్న పాలకులు చివరికి చేతులెత్తేసి రైతులను అష్టకష్టాల పాల్జేశారు. మొదట్లో స్థానిక గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిపేస్తామని గొప్పలు చెప్పి చతికిలపడ్డారు
రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి రైతుల గగ్గోలు
పెట్టుబడి సొమ్ములందక తీవ్ర ఆవేదన
పాలకొల్లు, నరసాపురం గ్రామీణ, పెంటపాడు, ఆకివీడు, న్యూస్టుడే : వైకాపా ప్రభుత్వం వచ్చాక చేపట్టిన రీసర్వే ద్వారా అంతకాదు ఇంతకాదన్న పాలకులు చివరికి చేతులెత్తేసి రైతులను అష్టకష్టాల పాల్జేశారు. మొదట్లో స్థానిక గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిపేస్తామని గొప్పలు చెప్పి చతికిలపడ్డారు. గ్రామ సచివాలయాలు కాదు కదా రిజిస్ట్రారు కార్యాలయాల్లో సైతం నేడు రిజిస్ట్రేషన్లు జరగకుండా చేసిన ఘనతను మూటగట్టుకున్నారు. జిల్లాలోని ఏ మండలంలోనూ నూరుశాతం రీసర్వే చేసిన పరిస్థితికి చేరలేకపోయారు. ఎక్కువగా అంటే మండలానికి వచ్చి నాలుగైదు గ్రామాల్లో మాత్రమే సర్వే చేసి ముగించడంతో కొన్ని గ్రామాల రైతులైనా ఈ సమస్యల నుంచి బయటపడ్డారు.
- యలమంచిలి మండలం బూరుగుపల్లికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు బోనం నానికి 1.30 సెంట్ల కొబ్బరితోట ఉంది. రీసర్వే చేసి బలంగా పునాది రాళ్లు వేస్తామని వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఆయన తోటను సర్వేచేసి రాళ్లు పాతేశారు. తీరాచూస్తే మొత్తం భూమిలో 5.50 సెంట్లు మాయం చేశారు. ఇదెక్కడి దారుణమని గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం కరవు. దీనిపై అప్పటి కలెక్టర్ ప్రశాంతికి స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నాని వాపోయారు. పాత దస్తావేజు ప్రకారం భూమిని కొలిచి ఇవ్వాలంటే కుదరదని.. పోనీ తన మొత్తం భూమిని చూపించాలంటే తమవల్ల కాదని రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసిందని నాని ఆవేదన చెందారు.్చ
- అజ్జమూరు గ్రామానికి చెందిన తోట బాబురావుకు ఉన్న 1.13 ఎకరాల భూమిలో రీసర్వే అనంతరం మూడు సెంట్లు తగ్గిపోయింది. దీనికి నిరసనగా ఆయన పట్టాదారు పాస్పుస్తకం తీసుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదే మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన భూపతిరాజు తిమ్మరాజు కుటుంబ సభ్యులకు ఉన్న భూములకు సంబంధించిన వివరాలలోనూ గందరగోళం ఏర్పడటంతో గ్రామ సభలోనే సిద్దాపురం గ్రామస్థులు వ్యతిరేకించారు. వారంతా నెత్తీనోరు బాదుకున్నా గత ప్రభుత్వంలో అధికారులు వారిష్టానుసారం రీసర్వే చేసేశారని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో రీసర్వే జరిగిన తీరు రైతులు ఎదుర్కుంటున్న ఇక్కట్లకు అద్దంపట్టే ఇటువంటి ఉదాహరణలు వందల్లో ఉన్నాయంటే నమ్మక తప్పదు.
అదునొచ్చినా అందని సాయం.. తొలకరి మొదలైన తరుణంలో ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సమాయత్తమయ్యారు. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకులు, సహకార సంఘాల్లో రైతులు వారి ఆస్తులకు చెందిన పుస్తకాలను తనఖా పెడతారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లోని భూముల వివరాలు రీసర్వే పుణ్యమా అని ఆన్లైన్లో లేకపోవడం వారికి శాపంగా పరిణమించింది. ఏటా గ్రామాల్లోని వందలాది మందికి రుణాలిచ్చే సొసైటీలు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి నిర్ణయం తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
అంతా లోపభూయిష్టం.. పూర్వం నుంచి ఉన్న ఆర్.ఎస్.నంబర్లను తప్పించి కొత్తగా ఎల్.ఎస్.నంబర్లను అమల్లోకి తెచ్చి రీసర్వేలో అంటగట్టడం ఇబ్బందులకు ప్రధాన కారణంగా నిలిచింది. రెవెన్యూ రికార్డుల నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల వరకు ఆర్.ఎస్.నంబర్లు అందుబాటులో ఉంటే ఎటూ తేలని రీసర్వేలో ఎల్.ఎస్. నంబర్లు ఇచ్చి తద్వారా రైతులకు కావాల్సిన అన్ని పనులు అయ్యిపోవాలంటే ఎలాగని రెవెన్యూలో సీనియర్ డీటీ ఒకరు వాపోయారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే లోపభూయిష్టంగా ఉన్న రీసర్వే నిబంధనలు తనతోపాటు చాలామంది రెవెన్యూ అధికారులకు కూడా అర్థం కాలేదని ‘న్యూస్టుడే’తో చెప్పారు. గ్రామాల్లోని రైతులకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వకుండా సర్వే ప్రక్రియ హడావిడిగా ఉరుకులు పరుగులతో ముగించేశారు. తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం అన్లైన్లో వెబ్ల్యాండ్లో పరిశీలించుకుంటూ పూర్వం నుంచి వస్తున్న రైతుల దస్తావేజులు, పాత రెవెన్యూ దస్త్రాలను పరిగణలోకి తీసుకోకుండా డ్రోన్ సర్వే కొనసాగించడం అన్ని ఇబ్బందులకు మూల కారణమైంది.
- నరసాపురం మండలం సీతారామపురం సౌత్లో పెండ్ర శ్రీనుకు ఉన్న అరెకరం భూమిని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రయించారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే రీసర్వేలోని సాంకేతిక లోపాల వల్ల పనిపూర్తికాలేదు. కుటుంబ అవసరాలు తీరక నానా యాతన పడుతున్నట్లు శ్రీను దిగులు చెందుతున్నారు.
ఎనిమిది నెలలుగా ఎన్నో ఇబ్బందులు.. పెంటపాడు మండలం దర్శిపర్రులో నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. గత వైకాపా ప్రభుత్వం చేపట్టిన పొలాల రీసర్వేలో ఆ నాలుగు ఎకరాల భూమి సర్వే నంబర్లు తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెం పరిధిలో కలిసిపోయాయి. అప్పట్నుంచి రెవెన్యూ అధికారులు హోల్డ్లో ఉంచారు. 1బి అడంగల్, పాస్ పుస్తకాలు కూడా ఇవ్వలేదు. భూమిని అమ్ముదామన్నా రిజిస్ట్రేషన్ కూడా అవ్వడం లేదు. ఇంట్లో త్వరలో శుభకార్యం జరగనుంది. చేతిలో చిల్లి గవ్వ లేదు. పొలాల రీసర్వేతో మా గ్రామంలోని 277 మంది రైతులు నా లాగే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలి.
- రుద్రా గంగాదామోదరరావు. రైతు, దర్శిపర్రు, పెంటపాడు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు
-
ఇక టెట్ ఏటా రెండుసార్లు
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు