వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యలతో బడులు వెలవెల
ఇది యలమంచిలి మండల కేంద్రం శివారు గొలేపరచెరువు ప్రాథమిక పాఠశాల. గతంలో 15 మంది వరకు విద్యార్థులుండగా..ఈ ఏడాది ఒక్కరే మిగిలారు.
ఇది యలమంచిలి మండల కేంద్రం శివారు గొలేపరచెరువు ప్రాథమిక పాఠశాల. గతంలో 15 మంది వరకు విద్యార్థులుండగా..ఈ ఏడాది ఒక్కరే మిగిలారు. ఉన్న ఆ ఒక్క విద్యార్థికి పాఠాలు బోధిస్తూ ఏకైక ఉపాధ్యాయుడు కాలం వెళ్లదీస్తున్నారు.
- పెనుగొండ మండలం ఇలపర్రు పరిధిలోని ఆంబోతులదిబ్బలో గత ఏడాది ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఒక్కరంటే ఒక్కరే చేరడంతో సంఖ్య 8తో సరిపెట్టుకున్నారు.
- ...ఇలా ఒకటో రెండో కాదు జిల్లాలో ఏ మండలం తీసుకున్నా పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో వెలవెలబోతున్నాయి. జిల్లాలో మొత్తం 1374 ప్రభుత్వ పాఠశాలలుండగా 71,383 మంది విద్యార్థులున్నారు.
ఆచంట, పాలకొల్లు, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలలకు ఇంతటి దుస్థితి పట్టడానికి గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. ఆయా నిర్ణయాలను విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతించలేక ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపడం శాపంగా పరిణమించింది. పాఠశాలల విలీనం దగ్గర ప్రారంభమైన ఆలోచన లేని నిర్ణయం ఒకటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో తరగతుల నిర్వహణ వరకు తీవ్ర ప్రభావాన్ని చూపింది. నాణ్యత లేని విద్యా కానుకలు, అమ్మఒడిలో నిర్వహణ ఛార్జీల పేరిట కోతలు వంటివి విసుగు పుట్టించాయి. వాటి ఫలితమే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ప్రభుత్వ బడులకు రానీయకుండా చేశాయని చెప్పడంలో సందేహం లేదు.
- ఆచంట మండలం పెనుమంచిలి పరిధిలోని జార్జిపేట ప్రాథమిక పాఠశాలలో ముగ్గురే విద్యార్థులున్నారు. స్థానికంగా ఉండేవారి పిల్లలను ఇక్కడ చేర్చకపోవడంతో సంచార జీవులుగా వచ్చిన కుటుంబం నుంచి ముగ్గురు విద్యార్థులను బతిమలాడి పాఠశాలకు తీసుకొచ్చిన దుస్థితి ఉపాధ్యాయులది. వారు మరో ప్రాంతానికి వలసపోతే ఇక్కడ పాఠశాల మూతపడాల్సిందే.
చేతులెత్తేసిన ఉపాధ్యాయులు.. బోధనేతర పనులతో వెట్టిచాకిరి చేయించడం వల్ల విసిగిపోయిన ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయలేని పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యతిరేక నిర్ణయాలతో ఉపాధ్యాయులను తరచూ వేధించడం వల్ల వారు కూడా చేతులెత్తేసే పరిస్థితికి పాఠశాలలను తీసుకొచ్చారు. ఒక వైఫల్యానికి సవాలక్ష కారణాలు అన్నట్లు అన్నీ కూడి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే రోజులను తీసుకొచ్చాయి. దీనిపై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ‘న్యూస్టుడే’ ఆరాదీయగా ఇంకా ప్రవేశాలు పూర్తిగానందున ఈ నెలాఖరుకు గాని ఏక విద్యార్థి లేక పదిలోపు విద్యార్థులున్న పాఠశాలల సంఖ్యపై స్పష్టత రాదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
-
‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్ హాసన్ క్లారిటీ
-
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలిన బాయిలర్.. 20 మందికి గాయాలు
-
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
-
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: సీఎం రేవంత్రెడ్డి