నిర్మాణ రంగానికి ఊపిరొచ్చింది
కూటమి సర్కారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చ జెండా ఊపింది. తాజా నిర్ణయంతో గత అయిదేళ్లు వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడనుంది
ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం పచ్చజెండా
తెరుచుకోనున్న ర్యాంపులు
లక్షలాది కుటుంబాల జీవనోపాధికి బాటలు
వైకాపా పాలనలో ఏలూరులో నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ, అనుబంధ సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు (పాతచిత్రం)
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే-కలిదిండి, ఆచంట: కూటమి సర్కారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చ జెండా ఊపింది. తాజా నిర్ణయంతో గత అయిదేళ్లు వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. జగన్ సర్కారులో మాదిరిగా ఇసుక అందని ద్రాక్షలా కాక అందరికీ అందుబాటులో ఉండనుంది. ఫలితంగా అయిదేళ్లుగా కుదేలైన నిర్మాణ రంగానికి తాజా నిర్ణయం ఊతమవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉచిత విధానంపై కసరత్తు.. జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో లోడింగ్, రవాణా ఖర్చుల వసూలు అంశాలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వైకాపా అమలు చేసిన ఇసుక విధానంతో నాయకులకు తప్ప ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు. రీచ్ల్లో ఇసుకను అడ్డగోలుగా దోచుకుని నాయకులు, అనుచరులు సొమ్ము చేసుకున్నారు. ఎన్నికల్లో వైకాపాను దెబ్బకొట్టిన అంశాల్లో ఇసుక విధానం ఒకటి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఇసుక విధానం అమలుకు కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆచీతూచీ నిర్ణయం తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు.
అధికారిక రీచ్లు ఇవే.. ఏలూరు జిల్లాలో కుక్కనూరు మండలం ఇబ్రహీంపేట, వింజరం, దాచారం, బూరుగువాయి, వేలేరుపాడు మండలం రుద్రంకోట పోలవరం మండలం గుటాల, పశ్చిమలో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి, దొడ్డిపట్ల, నరసాపురంలో అధికారిక ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో ఇసుక తవ్వకాలకు అనుకూలంగా మార్గం ఏర్పాటు చేయాల్సి ఉంది. సిద్ధాంతం రేవు దారి ఇప్పటికే దెబ్బతింది. నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లిలో అవకాశం ఉంది. ఇసుక పనులు చేయడానికి 150 వరకూ బంటాలు ఉన్నాయి. 4వేల మందికి పైగా కార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలు ఉపయోగించి కార్మికుల పొట్టకొట్టారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
కార్మికలోకానికి ఊతం.. ఉమ్మడి జిల్లాలో వడ్రంగి, ఎలక్ట్రీషియన్, రాడ్ బెండింగ్, ప్లంబర్, పెయింటర్, తాపీ ఇలా అన్నీ కలిపి 62 కేటగిరీలకు చెందిన 1.50 లక్షల భవన నిర్మాణ కార్మికులున్నారు. వైకాపా అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ రంగంతో పరోక్షంగా సంబంధం ఉన్న 3 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా తీసుకున్న ఉచిత ఇసుక నిర్ణయమూ ఈ కోవలేనిదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం