ఐక్యంగా పోరాడదాం ఆక్వాను రక్షిద్దాం!
వేల కోట్ల విదేశీ మారకం తెచ్చి పెడుతున్న ఆక్వా రంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో రైతులంతా ఐక్యంగా పనిచేసి సమస్యలను సాధించుకుందామని జైభారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు.
రాష్ట్రస్థాయి మహాసభలో రైతుల తీర్మానం
వివిధ జిల్లాల నుంచి హాజరైన సాగుదారులు
మాట్లాడుతున్న గాంధీ
పాలకొల్లు, న్యూస్టుడే: వేల కోట్ల విదేశీ మారకం తెచ్చి పెడుతున్న ఆక్వా రంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో రైతులంతా ఐక్యంగా పనిచేసి సమస్యలను సాధించుకుందామని జైభారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. పాలకొల్లు - భీమవరం బైపాస్కు సమీపంలో ఉన్న ఎస్.ఎస్.ఎస్.కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మహాసభలో ఆయన మాట్లాడారు. సంఘ నాయకుడు బోనం చినబాబు మాట్లాడుతూ రైతులు కొనేవి ధరలు పెరిగి అమ్మేవి మాత్రం తగ్గుతున్న దుస్థితి ఆక్వా రంగంలోనే కొనసాగుతుందన్నారు. గడిచిన అయిదేళ్లలో మేత ధర కిలో రూ.95 పెరగగా రొయ్యల ధరలు మాత్రం అప్పటికంటే క్షీణించాయని పలువురు యువ రైతులు చెప్పారు. దళారులు, ఏజెంట్లు విపరీతంగా పెరిగిపోయి ఆక్వా రైతులను దోచుకుంటున్నందున వారిని కూడా సంఘంలోకి సభ్యులుగా చేర్చి న్యాయంగా పనిచేస్తేనే అమ్మకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రుద్రరాజు సత్యనారాయణరాజు సూచించారు. హేచరీల్లో రొయ్యపిల్లల నాణ్యత పెరిగేలా చూడాలని, ప్రోసెసింగ్ యూనిట్లు గొలుసుగా ఏర్పడి రైతులను దోచుకునే విధానాన్ని అరికట్టాలని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు.
హాజరైన సాగుదారులు
ఎకరాకు రూ.లక్షల్లో సీడ్ వేయకుండా సంఖ్యను తగ్గించి నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటే నష్టాలను ఎవరికివారే అరికట్టవచ్చని కొందరు రైతులు సభలో సూచించారు. రైతులంతా చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఒక తీర్మానాన్ని సంఘం తయారు చేసింది. తీర్మానం ప్రకారం రొయ్యల చెరువుల్లో సగటున ఒక సంఖ్య ప్రకారం ఎకరాకు రొయ్యలు పెంచేలా పద్ధతిని ఆచరించడం, హేచరీల్లో ఎంపెడా తనిఖీలు చేసి నాణ్యత లేకపోతే చర్యలు చేపట్టేలా చూడటం వంటి విషయాలను ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు ద్వారా ఆక్వా మంత్రికి, సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్తామని సంఘం తెలిపింది. అవసరమైతే 3 నుంచి 4 నెలలు పంట విరామం ప్రకటించేలా సంఘం నిర్ణయం తీసుకున్నా రైతులంతా కట్టుబడి విరామానికి సమ్మతించాలని పేర్కొన్నారు. దీనికి రైతులంతా మద్దతు పలికారు. రైతు నాయకులు సజ్జా బుజ్జి, కోడి విజయభాస్కర్, గౌరునాయుడు పాల్గొన్నారు.
రవాణా పన్ను తగ్గించాల్సి ఉంది..
మొదట్లో రొయ్యమేతల కట్టపై ఉన్న ధరకు 5 శాతం ట్రాన్పోర్టు ఛార్జీ విధించేవారు. తర్వాత దానికి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 2023లో ఆ ఛార్జీని 8 శాతానికి తగ్గించింది. కాని పరిశ్రమలు మాత్రం నేటికీ 15 శాతాన్నే వసూలు చేయడం దారుణం. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలి.
- సుబ్బరాజు, ఆక్వా రైతు, భీమవరం
పరిశ్రమను ప్రక్షాళన చేయాలి
చెరువులకు రొయ్య పిల్లనందించే ఇన్లాండ్ హేచరీలను సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేయాలి. ఆక్వా పరిశ్రమను ప్రక్షాళన చేయాలి. రాష్ట్రంలో 64 వేల విద్యుత్తు కనెక్షన్లు ఉంటే వైకాపా వాటిని 54 వేలకు తగ్గించేసింది. విద్యుత్తు ధరలు పెంచేసింది. పరివర్తకాలు ఏర్పాటు చేసుకుంటే రాయితీలను తెగ్గోసింది. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం గాడిలో పెడితేనే రైతు నిలదొక్కుకుంటాడు.
- నాగభూషణం, అమలాపురం, కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి