నిధులు మళ్లించడంతో పనులు చేయలేకపోయాం!
వైకాపా పాలనలో 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులు పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు
రాష్ట్ర ఆర్థిక సంఘం కమిషన్ సమావేశంలో సర్పంచుల ఆందోళన
మాట్లాడుతున్న కమిషన్ ఛైర్పర్సన్ రత్నకుమారి
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే : వైకాపా పాలనలో 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులు పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల ఆర్థిక వనరులపై రాష్ట్ర ఆర్థిక సంఘం కమిషన్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సర్పంచులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. పలువురు సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో సీనరేజీ, రిజిస్ట్రేషన్శాఖ ద్వారా వచ్చే సర్ఛార్జ్ సొమ్ములు, ఇతర సెస్లు సంబంధించి కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటిని కూడా ఇవ్వలేదని కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర అయిదో ఆర్థిక సంఘం కమిషన్ ఛైౖర్పర్సన్ రత్నకుమారి మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీల పరిస్థితులను, సర్పంచుల అభిప్రాయాలను, నిధుల విషయంలో.. జరిగిన అన్యాయం తదితర విషయాలపై ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని తెలిపారు. అనంతరం డీపీవో తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ పట్టిసీమ, బలివే, ద్వారకాతిరుమల వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పంచాయతీల్లో ఏటా ఉత్సవాలకు సంబంధించి సౌకర్యాల కల్పనకు పంచాయతీల నిధులే వెచ్చించాల్సి వస్తోందని తద్వారా ఆ పంచాయతీలకు మరింత భారం అవుతోందన్నారు. దేవాదాయశాఖ అధికారులు కొంత నిధులు ఆ పంచాయతీలకు అందిస్తే కొంత వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ప్రసాదరావు, పద్మారావు, కృపారావు, జడ్పీ సీఈవో కె.సుబ్బారావు, డీఎల్పీవోలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు