వైకాపాకు అనుకూలంగా రెవెన్యూ సిబ్బంది ఎలా పనిచేశారు?
ఆగిరిపల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఆర్అండ్బీ రహదారిని ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసుకున్న నివాసాలకు గత ప్రభుత్వంలో వైకాపాకు అనుకూలమైన వారికి మాత్రమే అప్పటి తహసీల్దారు ఎం.ఉదయ భాస్కరరావు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు
పార్థసారథిని కలిసిన బాధితులు
ఆగిరిపల్లి, న్యూస్టుడే: ఆగిరిపల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఆర్అండ్బీ రహదారిని ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసుకున్న నివాసాలకు గత ప్రభుత్వంలో వైకాపాకు అనుకూలమైన వారికి మాత్రమే అప్పటి తహసీల్దారు ఎం.ఉదయ భాస్కరరావు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు మాత్రం పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాధితులు బుధవారం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి సమస్యను వివరించారు. స్పందించిన మంత్రి అక్కడ కొందరికే ఎలా పట్టాలు ఇచ్చారని, వైకాపాకు అనుకూలంగా రెవెన్యూ సిబ్బంది ఎలా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారు బి.మృత్యుంజయరావును ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశన స్థలాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆందోళన చెందవద్దని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్