అక్రమాలకు గొడుగు పట్టారు
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు.
రెవెన్యూ శాఖలో వైకాపా భక్తులు
అధికార పార్టీతో అంటకాగిన తహసీల్దార్లు
నేతల మాటలు నెత్తిన పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు
ఈనాడు, భీమవరం
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. జగనన్న కాలనీల్లో స్థల సేకరణ, మెరక పనుల నుంచి రెవెన్యూ రికార్డుల్లో మాయాజాలాల వరకు అన్ని రకాల అక్రమాలు యథేచ్ఛగా చేశారు. తెదేపా కార్యకర్తలను పలు విధాలా వేధించిన ఘనులున్నారు.
వైకాపాకు వినయ విధేయుడు.. ఇటీవల వరకు ముదినేపల్లి తహసీల్దార్గా పని చేసిన అధికారి వైకాపాకు వినయ విధేయుడిగా ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలే పరమావధిగా పని చేశారు. పాలసేకరణ కేంద్రాల ఎన్నికల్లో తెదేపా మద్దతుదారు విజయం సాధించారు. ప్రజాప్రతినిధి కుమారుడి ఆదేశాలతో తెదేపా నాయకుడి వాటర్ ప్లాంటును అడ్డగోలుగా ధ్వంసం చేయించారు. శ్రీహరిపురంలో రహదారికి ఇరువైపులా నిర్మాణాలున్నా ఒక్క తెదేపా కార్యకర్త రేకుల షెడ్డునే ధ్వంసం చేయించారు. జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో నేతలు చెప్పిన వారికే స్థలాలిచ్చారు. తెదేపా ముద్ర ఉంటే చాలు అర్హత ఉన్నా కొర్రీలు పెట్టి తప్పించారన్న విమర్శలున్నాయి.
మట్టిని మింగేశారు.. జంగారెడ్డిగూడెం తహసీల్దారు వైకాపాకు అపరభక్తుడు. అధికార పార్టీ నేతల అండతో ఎర్రకాలువకు గర్భశోకం మిగిల్చారు. స్థానిక ప్రజాప్రతినిధి తమ్ముడు ఆధ్వర్యంలో మట్టిమాఫియా సిండికేట్ ఏర్పాటు చేశారు. రోజుకు 150-200 లారీల మట్టి, గ్రావెల్ తరలించుకుపోతున్నా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో ఆయనకు భాగం ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో వైకాపా నేతల నుంచి నెలకు రూ.50 వేల ముడుపులు ఆయనకు ఖాతాకు వెళ్లేవి. రికార్డుల్లో లేని 28 ఎకరాల భూమిని ఆన్లైన్ చేసి రూ.30 లక్షలు తీసుకున్నారు. రీ సర్వేలో జరిగిన తప్పులను ఆసరాగా తీసుకుని వాటిని సరి చేసేందుకు భారీగా వసూళ్ల దందా చేశారు.
అంతా కృష్ణార్పణం.. ఎన్నికల ముందు వరకు ఉండి తహసీల్దార్గా పని చేసిన మహిళా అధికారి వైకాపా అంటే చెవి కోసుకుంటారు. జగనన్న ఇళ్ల స్థలాల భూసేకరణలో అప్పటి మంత్రి చెప్పిందే వేదంగా అమలు చేశారు. చాలా చోట్ల రూ.30 లక్షలు కూడా లేని స్థలాలను రూ.45 లక్షలకు కొనుగోలు చేయించారు. ఎన్ఆర్పీ అగ్రహారంలోని ప్రభుత్వ స్థలాన్ని పేదల ఇళ్ల పట్టాలకు కేటాయించాలని గ్రామస్థులు మొత్తుకున్నా వినలేదు. వైకాపా నాయకుల ఆదేశాలతో 72 సెంట్ల స్థలాన్ని వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించారు. పేదలకు మాత్రం అయిదు కిమీ దూరంలో ఎందుకూ పనికి రాని స్థలాలు కేటాయించారు. గ్రామంలో భూమి ఉన్నా కేటాయించకుండా కలిగొట్ల గ్రామస్థులకు 2 కిమీ దూరంలో ఆక్వా చెరువుల మధ్య ఇచ్చారు. మండలంలో సమస్యలపై తెదేపా ఎమ్మెల్యే ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకున్న దిక్కులేదు.
వారి మాటకు తలాడించడమే.. మొగల్తూరులో కొంతకాలం క్రితం వరకు పని చేసిన ఓ మహిళా తహసీల్దార్ వైకాపాకు భక్తురాలు. అధికార పార్టీ నేత చెప్పారని మండలంలోని 200 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను కొనుగోలుదారుల పేరు మీద మ్యుటేషన్ చేసేశారు. ఎకరానికి రూ.20వేల పైగా కమీషన్ తీసుకున్నారు. తెదేపా, జనసేన మద్దతుదారుల ఆర్థిక మూలాలు దెబ్బతీసి వారి పొట్టకొట్టాలన్న వైకాపా నాయకుల ఆలోచనను అమలు చేశారు. పేరుపాలెం తీరంలో ఎన్నో దుకాణాలున్నా..తెదేపా, జనసేనకు చెందిన మద్దతుదారుల దుకాణాలను అడ్డగోలుగా ధ్వంసం చేయించి వారిని రోడ్డుకీడ్చారు.
ఆ నేత మాటే వేదం.. నూజివీడు తహసీల్దారుగా పని చేసిన అధికారి వైకాపా నాయకుల మాటే శాసనం అన్నట్లు పని చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకుని వైకాపా నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి ఈ అధికారి పూర్తి సహకారం అందించారు. పాతరావిచర్ల పరిధిలోని కొండలను దాదాపు 20 ఎకరాలు.. వైకాపా నాయకులు చదును చేస్తే వాటికి డీ పట్టా ఇచ్చేశారు. ఇలా స్థలాలు పొందిన వారంతా వైకాపా అనుచరులే. ఈ వ్యవహారం చక్కబెట్టినందుకు ఎకరానికి రూ.20 వేల చొప్పున వసూలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్
[ 06-07-2024]
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకొంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు!
[ 06-07-2024]
మొగల్తూరులో పెన్మత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థులున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
[ 06-07-2024]
గత నెల 30న చేబ్రోల్-పూళ్ల స్టేషన్ల మధ్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది -
రేపటి నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
[ 06-07-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది -
రహదారుల వ్యవస్థ మెరుగుకు చర్యలు: కలెక్టర్
[ 06-07-2024]
జిల్లాలో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు -
పింఛను సొమ్ముతో పరారైన కార్యదర్శికి రిమాండ్
[ 06-07-2024]
అతనో సచివాలయ కార్యదర్శి. అత్యాశతో ఆన్లైన్ గేమ్లతో అధికంగా సొమ్ము సంపాదించాలనుకున్నాడు ఇందుకు బాధ్యతలు మరిచి పేదలకు పంపిణీ చేసే పింఛను సొమ్మును సైతం అందులో పెట్టడానికి వెనుకాడలేదు. -
చెలరేగుతున్న మందుల మాఫియా
[ 06-07-2024]
ఉమ్మడి పశ్చిమలో అనధికారిక మందుల విక్రయం, వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. వైద్యుల సలహా లేకుండా గర్భ విచ్ఛిత్తి, మత్తు, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. -
అందని చేయూత
[ 06-07-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చేయూత పథకం సాయం అందించేందుకు బటన్ నొక్కినా నేటికీ చాలా మంది బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదు. -
సమగ్రంగా నివేదికల సమర్పణ: కలెక్టర్
[ 06-07-2024]
ప్రధానమంత్రి పురస్కారాలు-2023కు సంబంధించి కేంద్ర బృందానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
నేడు ఉద్యోగ మేళా
[ 06-07-2024]
ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని సెట్వెల్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖల ఆధ్వర్యాన శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్పై ఇంటికి..
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం
-
హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు
-
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. విభజన అంశాలపై చర్చ
-
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్