కరెంటు కష్టాలు రానివ్వం
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం.
నాణ్యమైన సరఫరా లక్ష్యం
సమస్యలుంటే 1912కు తెలియజేయండి
విద్యుత్తు ఎస్ఈ సాల్మన్ రాజు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ముందస్తు ఏర్పాట్లు చేశాం. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా 1912 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే తక్షణం స్పందిస్తాం అని విద్యుత్తు జిల్లా ఎస్ఈ పి.సాల్మన్ రాజు తెలిపారు. మంగళవారం ఆయన ‘న్యూస్టుడే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..
ప్రశ్న: జిల్లాలోని పలు ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు?
ఎస్ఈ : సాధారణంగా వేసవిలో లోవోల్టేజీ సమస్య ఉంటుంది. ఎండల తీవ్రతను బట్టి విద్యుత్తు వినియోగం పెరుగుతుంది. ఆయా ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో కెపాసిటీకి మించి వినియోగం ఉంటే లోవోల్టేజీ సమస్య తలెత్తుతుంది. వర్షాకాలంలోనూ ఎక్కడైనా సమస్య వచ్చిందంటే అక్కడి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిందని అర్థం. ఇప్పుడు కూడా సమస్య ఉంటే ఆయా ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం.
ట్రాన్స్ఫార్మర్లు చోరీలకు గురవుతున్నాయి. దీనివల్ల సరఫరాలో ఇబ్బంది ఉంటుంది కదా.. ఎలా అధిగమిస్తున్నారు?
ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైన ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా వెంటనే కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం 66 చోరీకి గురయ్యాయి. కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.6 కోట్లు ఖర్చు పెట్టాం.
వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రకృతివైపరీత్యాలతో సరఫరాలో ఇబ్బంది, లైన్లు దెబ్బతినడం జరుగుతుంది కదా. ముందస్తు ఏర్పాట్లు చేశారా?
వరదలు, తుపాన్ల కారణంగా స్తంభాలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది లేకుండా విద్యుత్తు పునరుద్ధరణకు ముందస్తుగా ఏర్పాట్లు చేశాం. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం.. తీరంలోని నరసాపురం, పాలకొల్లు మండలాలకు స్తంభాలు, తీగలు, ఇతర సామగ్రిని తరలించాం. ఇబ్బంది తలెత్తినప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేపడతాం.
విద్యుదాఘాతాలకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం అందించడం లేదని ఆరోపణలున్నాయి?
విద్యుదాఘాతానికి గురై మృతి చెందితే రూ.5 లక్షలు, పశువులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇస్తున్నాం. ఘటన జరిగాక బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు సమర్పిస్తే ఒకట్రెండు నెలల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమవుతుంది. ఆలస్యం అనేది అవాస్తవం. గత సంవత్సర కాలంలో 26 మందికి గాను 22 మందికి నష్టపరిహారం అందింది.
విద్యుదాఘాతాలకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం అందించడం లేదని ఆరోపణలున్నాయి?ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్తు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారా?
వ్యవసాయ వినియోగానికి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్తు అందిస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఎక్కడైనా లైన్లు మరమ్మతులకు గురైతే వెంటనే పునరుద్ధరిస్తాం.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్తు ప్రమాదాలు పెరిగాయి. ఇటీవల జిల్లాలో పలువురు మృతి చెందారు. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. వీటిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు?
విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా సబ్స్టేషన్ల పరిధిలో సిబ్బంది రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పొలాలకు వెళ్లేటప్పుడు విద్యుత్తు తీగలు తెగిపడ్డాయేమో చూసుకోవాలి. తడి చేతులతో మోటార్లు వేయకూడదు. స్విచ్ బోర్డులు తాకకూడదు. గ్లౌజులు పెట్టుకొని, ఎండిన కర్రలతో స్విచ్లు వేయాలి. డాబాలపై దుస్తులు ఆరేసేటప్పుడు విద్యుత్తు తీగలు దగ్గరగా ఉన్నచోట జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నింటిపై అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్
[ 06-07-2024]
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకొంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు!
[ 06-07-2024]
మొగల్తూరులో పెన్మత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థులున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
[ 06-07-2024]
గత నెల 30న చేబ్రోల్-పూళ్ల స్టేషన్ల మధ్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది -
రేపటి నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
[ 06-07-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది -
రహదారుల వ్యవస్థ మెరుగుకు చర్యలు: కలెక్టర్
[ 06-07-2024]
జిల్లాలో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు -
పింఛను సొమ్ముతో పరారైన కార్యదర్శికి రిమాండ్
[ 06-07-2024]
అతనో సచివాలయ కార్యదర్శి. అత్యాశతో ఆన్లైన్ గేమ్లతో అధికంగా సొమ్ము సంపాదించాలనుకున్నాడు ఇందుకు బాధ్యతలు మరిచి పేదలకు పంపిణీ చేసే పింఛను సొమ్మును సైతం అందులో పెట్టడానికి వెనుకాడలేదు. -
చెలరేగుతున్న మందుల మాఫియా
[ 06-07-2024]
ఉమ్మడి పశ్చిమలో అనధికారిక మందుల విక్రయం, వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. వైద్యుల సలహా లేకుండా గర్భ విచ్ఛిత్తి, మత్తు, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. -
అందని చేయూత
[ 06-07-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చేయూత పథకం సాయం అందించేందుకు బటన్ నొక్కినా నేటికీ చాలా మంది బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదు. -
సమగ్రంగా నివేదికల సమర్పణ: కలెక్టర్
[ 06-07-2024]
ప్రధానమంత్రి పురస్కారాలు-2023కు సంబంధించి కేంద్ర బృందానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
నేడు ఉద్యోగ మేళా
[ 06-07-2024]
ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని సెట్వెల్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖల ఆధ్వర్యాన శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!