నమ్మకంగా ముంచేస్తున్నారు!
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ, నిషేధిత పురుగు మందుల విక్రయాలు
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే
వేలేరుపాడు: పురుగు మందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న విజిలెన్సు అధికారులు
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
మూడు నెలల కిందట వేలేరుపాడు మండలం వసంతవాడలో ఓ ట్రేడర్స్కు చెందిన పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్సు అధికారులు తనిఖీ చేశారు. అక్కడ ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్ (గడ్డి మందు) పురుగు మందు విక్రయిస్తున్నట్లు.. స్టాక్కు, రిజిస్టర్లో ఉన్న లెక్కలకు వ్యత్యాసమున్నట్లు గుర్తించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
నకిలీ, నిషేధిత, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించి దుకాణదారులు రైతులను ముంచేస్తున్నారు. అదునుకు పురుగు మందు వేస్తే పంటకు ఢోకా ఉండదని, చక్కగా చేతికి వస్తుందని నమ్మకంగా ఏమారుస్తున్నారు. వాటిని వాడిన కర్షకులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
రైతులకు నష్టం జరగకూడదని, నకిలీ, నిషేధిత పురుగు మందులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు విజిలెన్సు అధికారులు నడుం బిగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పురుగు మందుల దుకాణాలపై కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్ గడ్డి మందు ఎక్కువగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇది క్యాన్సర్కు కారణం అవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. చేపల చెరువుల్లో నీరు తీశాక శుద్ధి చేసేందుకు, చెలకలు, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల నివారణకు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గిరాకీ ఉండటంతో దుకాణ దారులు దొంగచాటుగా విక్రయిస్తున్నారు. అలాగే నాసిరకం, కాలం చెల్లిన పురుగు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిబంధనలు మీరితే చర్యలు తప్పవు.. దుకాణదారులు నిబంధనలు మీరితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్ చేస్తాం. నాణ్యమైన పురుగు మందులనే విక్రయించాలి. నాసిరకం, నిషేధిత మందులు అమ్మి రైతులను నష్టపరిస్తే సహించేది లేదు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నాం.
కరణం కుమార్, విజిలెన్స్ ఎస్పీ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు గొప్పలు.. నేడు తిప్పలు!
[ 06-07-2024]
మొగల్తూరులో పెన్మత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థులున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
[ 06-07-2024]
గత నెల 30న చేబ్రోల్-పూళ్ల స్టేషన్ల మధ్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది -
రేపటి నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
[ 06-07-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది -
రహదారుల వ్యవస్థ మెరుగుకు చర్యలు: కలెక్టర్
[ 06-07-2024]
జిల్లాలో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు -
పింఛను సొమ్ముతో పరారైన కార్యదర్శికి రిమాండ్
[ 06-07-2024]
అతనో సచివాలయ కార్యదర్శి. అత్యాశతో ఆన్లైన్ గేమ్లతో అధికంగా సొమ్ము సంపాదించాలనుకున్నాడు ఇందుకు బాధ్యతలు మరిచి పేదలకు పంపిణీ చేసే పింఛను సొమ్మును సైతం అందులో పెట్టడానికి వెనుకాడలేదు. -
ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్
[ 06-07-2024]
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకొంది. -
చెలరేగుతున్న మందుల మాఫియా
[ 06-07-2024]
ఉమ్మడి పశ్చిమలో అనధికారిక మందుల విక్రయం, వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. వైద్యుల సలహా లేకుండా గర్భ విచ్ఛిత్తి, మత్తు, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. -
అందని చేయూత
[ 06-07-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చేయూత పథకం సాయం అందించేందుకు బటన్ నొక్కినా నేటికీ చాలా మంది బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదు. -
సమగ్రంగా నివేదికల సమర్పణ: కలెక్టర్
[ 06-07-2024]
ప్రధానమంత్రి పురస్కారాలు-2023కు సంబంధించి కేంద్ర బృందానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
నేడు ఉద్యోగ మేళా
[ 06-07-2024]
ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని సెట్వెల్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖల ఆధ్వర్యాన శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది.