దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు.
భారీ చోరీపై నమోదు కాని కేసు
నరసాపురం, న్యూస్టుడే: నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు. ఆ ఆలయ ప్రారంభ హడావుడిలో ఉన్న వ్యాపారి నరసాపురంలో వ్యాపారుల ఆర్డర్ల మేరకు సింగ్ యువకుడికి ఆభరణాలు ఇచ్చి పంపించారు. ఆభరణాలను ఆయా దుకాణాలకు సరఫరా చేశారు. అనంతరం వ్యాపారుల వద్ద నూతన ఆర్డర్లు తీసుకుని వాటికి సంబంధించి సుమారు అర కిలో బంగారం తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి ఈ ప్రాంత బంగారు వ్యాపారులు సుమారు రూ.7 లక్షలు విరాళం అందించారు. దానితోపాటు వ్యాపారానికి సంబంధించి మరో రూ.4 లక్షలు వసూలు చేసి మొత్తం బంగారం, నగదు బ్యాగులో సర్దుకున్న దానితో భీమవరం వెళ్లే క్రమంలో బస్సులో ఆ బ్యాగు పోగొట్టుకున్నారు. గుంటూరుకు చెందిన యజమాని ఇక్కడికి రావాల్సి ఉంది. దీనిపై ఇంకా ఫిర్యాదు అందలేదని అందుకే కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
నిఘా కెమెరాలు కరవు.. ప్రతి వ్యాపార సంస్థలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. కార్గో కార్యాలయం వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉంది. దీంతో పట్టణంలోని ముఖ్యకూడళ్లు, ఇతర దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాల్సి ఉంది.
పోలీసుల తీరు విస్మయం.. చోరీ, నేరం జరిగిన సమయంలో పోలీసులు వేగంగా స్పందిస్తే ప్రయోజనం ఉంటుంది. నేరగాళ్లను వెంటనే పట్టుకుంటే అపహరణకు గురైన సొత్తు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అటువంటిది భారీ చోరీ జరిగినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో నేర తీవ్రత తక్కువగా ఉండేలా బాధితుల వద్ద నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్
[ 06-07-2024]
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకొంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు!
[ 06-07-2024]
మొగల్తూరులో పెన్మత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థులున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
[ 06-07-2024]
గత నెల 30న చేబ్రోల్-పూళ్ల స్టేషన్ల మధ్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది -
రేపటి నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
[ 06-07-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది -
రహదారుల వ్యవస్థ మెరుగుకు చర్యలు: కలెక్టర్
[ 06-07-2024]
జిల్లాలో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు -
పింఛను సొమ్ముతో పరారైన కార్యదర్శికి రిమాండ్
[ 06-07-2024]
అతనో సచివాలయ కార్యదర్శి. అత్యాశతో ఆన్లైన్ గేమ్లతో అధికంగా సొమ్ము సంపాదించాలనుకున్నాడు ఇందుకు బాధ్యతలు మరిచి పేదలకు పంపిణీ చేసే పింఛను సొమ్మును సైతం అందులో పెట్టడానికి వెనుకాడలేదు. -
చెలరేగుతున్న మందుల మాఫియా
[ 06-07-2024]
ఉమ్మడి పశ్చిమలో అనధికారిక మందుల విక్రయం, వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. వైద్యుల సలహా లేకుండా గర్భ విచ్ఛిత్తి, మత్తు, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. -
అందని చేయూత
[ 06-07-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చేయూత పథకం సాయం అందించేందుకు బటన్ నొక్కినా నేటికీ చాలా మంది బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదు. -
సమగ్రంగా నివేదికల సమర్పణ: కలెక్టర్
[ 06-07-2024]
ప్రధానమంత్రి పురస్కారాలు-2023కు సంబంధించి కేంద్ర బృందానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
నేడు ఉద్యోగ మేళా
[ 06-07-2024]
ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని సెట్వెల్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖల ఆధ్వర్యాన శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది