కూటమి సర్కారుపైనే ఆశలు!
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
నేడు పాలకొల్లులో ఆక్వా రైతుల మహాసభ
ఉండి, న్యూస్టుడే
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రత్యేక అజెండాతో పాలకొల్లులో బుధవారం నిర్వహించనున్న మహాసభకు ఆక్వా సాగుదారులంతా తరలిరావాలని కోరుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రొయ్యలు, చేపల చెరువులు విస్తరించిన ప్రాంతాల్లో దీనిపై గత కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి.
కీలక రంగం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.40 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించింది. ఏటా రూ.18 వేల కోట్ల టర్నోవర్ జరిగే ఈ రంగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కరోనా వ్యాప్తి కాలం, ఆ తరువాత వైకాపా సర్కారు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఈ రంగంపై ఆధారపడిన రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కిలో రొయ్యల (100 కౌంటు) ఉత్పత్తికి రూ.210 వరకు ఖర్చవుతోందని సాగుదారులు చెబుతున్నారు. మార్కెట్లో కనీసం నాలుగు టన్నులకు మించి రొయ్యలు విక్రయించిన రైతుకు ప్రస్తుతం కిలోకు ఇచ్చే ధర రూ.205 మాత్రమే. పరిస్థితులన్నీ అనుకూలించిన సందర్భాల్లోనూ పెట్టుబడులు రావడం లేదని సాగుదారులు వాపోతున్నారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
జోన్లు, విద్యుత్తు రాయితీలో కోత, ఫీడ్, రసాయనాలు, విద్యుత్తు పరివర్తకాల ధరలు పెరిగిపోవడంతో ఈ రంగాన్ని గట్టి దెబ్బతీశాయి. సమస్యపై మూడేళ్ల నుంచి రైతులు పోరుబాట పట్టినా వైకాపా సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో వేలాది మంది సాగుకు దూరమయ్యారు. 2021 ముందు పశ్చిమలో 1.52 లక్షల ఎకరాల్లో విస్తరించిన రొయ్యల చెరువులు నేడు 90 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. సాగుదారుల సంఖ్య 1.05 లక్షల నుంచి 75 వేలకు తగ్గింది.
ఎజెండా ఇదీ..
పాలకొల్లులో బుధవారం నిర్వహించే మహా సభలో గత అయిదేళ్లలో ఆక్వా రంగం ఎదుర్కొన్న ఒడుదొడుకులకు కారణాలు, రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్, ఫీడ్లలో నాణ్యత ప్రమాణాలు, ఎన్ఎఫ్డీబీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రాయితీలపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు.
నివేదిక అందిస్తాం
ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై పాలకొల్లు మహాసభలో చర్చించి తీర్మానాలను నూతన ప్రభుత్వానికి నివేదిస్తాం. సాగుదారులందరికీ విద్యుత్తు రాయితీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా, రొయ్యల ధరల స్థిరీకరణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
రుద్రరాజు యువరాజు, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్
[ 06-07-2024]
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకొంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు!
[ 06-07-2024]
మొగల్తూరులో పెన్మత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇలా అసంపూర్తిగా మిగిలింది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థులున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
[ 06-07-2024]
గత నెల 30న చేబ్రోల్-పూళ్ల స్టేషన్ల మధ్య 45 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది -
రేపటి నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
[ 06-07-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది -
రహదారుల వ్యవస్థ మెరుగుకు చర్యలు: కలెక్టర్
[ 06-07-2024]
జిల్లాలో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు -
పింఛను సొమ్ముతో పరారైన కార్యదర్శికి రిమాండ్
[ 06-07-2024]
అతనో సచివాలయ కార్యదర్శి. అత్యాశతో ఆన్లైన్ గేమ్లతో అధికంగా సొమ్ము సంపాదించాలనుకున్నాడు ఇందుకు బాధ్యతలు మరిచి పేదలకు పంపిణీ చేసే పింఛను సొమ్మును సైతం అందులో పెట్టడానికి వెనుకాడలేదు. -
చెలరేగుతున్న మందుల మాఫియా
[ 06-07-2024]
ఉమ్మడి పశ్చిమలో అనధికారిక మందుల విక్రయం, వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. వైద్యుల సలహా లేకుండా గర్భ విచ్ఛిత్తి, మత్తు, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. -
అందని చేయూత
[ 06-07-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చేయూత పథకం సాయం అందించేందుకు బటన్ నొక్కినా నేటికీ చాలా మంది బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదు. -
సమగ్రంగా నివేదికల సమర్పణ: కలెక్టర్
[ 06-07-2024]
ప్రధానమంత్రి పురస్కారాలు-2023కు సంబంధించి కేంద్ర బృందానికి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. -
నేడు ఉద్యోగ మేళా
[ 06-07-2024]
ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని సెట్వెల్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖల ఆధ్వర్యాన శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు -
అక్రమ కేసులపై తేల్చండి!
[ 06-07-2024]
గత వైకాపా పాలనలో తెదేపా, జనసేన శ్రేణులపై అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్ల మేరకు నమోదు చేసిన కేసులపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది.