మరింత భరోసా..!
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నేడు పింఛన్ల పండగ
అధికారుల ఏర్పాట్లు
భీమవరం అర్బన్, పాలకొల్లు, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ నాగరాణి, సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నందున 5.30 గంటలకు కేటాయించిన ప్రాంతాలకు ఉద్యోగులు చేరుకోవాలని ఆదేశించారు.
4,248 ఉద్యోగులతో.. గతంలో పింఛన్ల పంపిణీలో వార్డు, గ్రామ వాలంటీర్లదే ప్రధాన పాత్ర. జులైలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజే పంపిణీ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు కలిపి మొత్తం 4,248 మంది ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. జిల్లా పరిధిలో లబ్ధిదారులకు అందించాల్సిన రూ.155.71 కోట్లను సంబంధిత అధికారులు శనివారం సాయంత్రానికి బ్యాంకుల నుంచి విత్డ్రా చేసి భద్రపరిచారు.
ముందుగానే ముఖ్యమంత్రి లేఖలు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలిరోజే పింఛన్లు పంపిణీ చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. లబ్ధిదారులు సమయానికి ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే మరుసటి రోజు ఉదయం అందజేస్తాం. పింఛన్లకు సంబంధించి ముఖ్యమంత్రి పేరిట ఉన్న లేఖను ప్రతి లబ్ధిదారుకు ముందుగానే అందిస్తున్నాం. ఆదివారం సాయంత్రానికి 12 మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది.
వేణుగోపాల్, డీఆర్డీఏ పీడీ, భీమవరం
బాధితులకు భారీ ఊరట
అవ్వాతాతలకు రూ. 3 వేలు ఉండే పింఛన్ రూ. 4 వేలకు పెంచగా.. దివ్యాంగులు, కుష్ఠు రోగులకు రెట్టింపు చేసి రూ.6 వేలకు పెంచారు. కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేయించుకున్నవారికి ఇచ్చే రూ.5 వేల పింఛను ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిలో పక్షవాతం బారిన పడిన బాధితులకు, నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి గతంలో ఇచ్చే రూ.5 వేలను ఒకేసారి రూ.15 వేలకు పెంచడం ఆయా కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది. ఆయా రోగులకు నెలవారీ వైద్యం నిమిత్తం, మందులకు ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో పెంపు అనేది ఊరటగా నిలవనుంది. బోదకాలుతో ఇబ్బందులు పడుతున్న రోగులకు రూ.5 వేలు ఉండే పింఛన్ ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు.
పింఛనుదారుల సంఖ్య: 2,32,885
అందించే సొమ్ము రూ.155.71 కోట్లు
వైకాపా ప్రభుత్వం గత నెల ఇచ్చింది రూ.69.05 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
[ 03-07-2024]
దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
‘కల్కి’ కారులో ఎమ్మెల్యే రఘురామ సందడి!
[ 03-07-2024]
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు. -
ప్రేమ పేరుతో వల.. యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
[ 03-07-2024]
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. -
అక్రమాలకు గొడుగు పట్టారు
[ 03-07-2024]
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. -
నేడు ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల : నిమ్మల
[ 03-07-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కరెంటు కష్టాలు రానివ్వం
[ 03-07-2024]
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. -
నమ్మకంగా ముంచేస్తున్నారు!
[ 03-07-2024]
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. -
చేప ధర పైపైకి
[ 03-07-2024]
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. పది రోజులుగా వరుసగా పెరుగుతూ సంవత్సరం తర్వాత గరిష్ఠానికి చేరుకున్నాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. -
దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?
[ 03-07-2024]
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు. -
కూటమి సర్కారుపైనే ఆశలు!
[ 03-07-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
కుక్కునూరులో కదం తొక్కిన ఆదివాసీలు
[ 03-07-2024]
అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రయాణికుల ఇక్కట్లు!
[ 03-07-2024]
రైళ్ల రద్దు కారణంగా ఏలూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విదితమే. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
రెండేళ్ల తర్వాత బాలుడి ఆచూకీ లభ్యం
[ 03-07-2024]
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ