దొరికినంత.. దోచేశారు..!
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది.
పంచాయతీల్లో దారి తప్పిన ఆర్థిక లావాదేవీలు
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. ఫలితంగా పంచాయతీల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు మొక్కుబడిగా విచారణ తప్ప బాధ్యులపై చర్యలు లేవు. ఫలితంగా పంచాయతీల్లో అక్రమాల పరంపర పరిపాటిగా మారింది.
పెనుమంట్ర, న్యూస్టుడే: ‘గ్రామ పంచాయతీలను వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసింది. లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. పక్కదారి పట్టిన ప్రజా సొమ్ము విషయంలో మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదు.. కచ్చితంగా అవకతవకలను వెలికి తీస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాదు.. దోపిడీ చేసిన సొమ్మును రికవరీ చేస్తాం’.. అని ఆ శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మాటలు గ్రామాల్లో పలువురు అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గత అయిదేళ్లలో జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆర్థిక వ్యవహారాలు గాడి తప్పాయి. విచారణలతో కాలక్షేపం చేశారు తప్ప బాధ్యులపై చర్యలు లేవు.
అక్కడ అంతా అస్తవ్యస్తం.. పెనుమంట్ర మండలం పొలమూరు పంచాయతీలో నగదు లావాదేవీలు గాడితప్పాయి. ఆర్థిక అంశాలపై జరిగిన సమావేశాలకు సంబంధించి పలువురు సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటన 2021 అక్టోబరులో వెలుగు చూసింది. అనంతరం పలు ఆరోపణలపై పంచాయతీ రికార్డులను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలపై సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటికీ వాస్తవాలు తేలలేదు. ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసి బదిలీపై వెళ్లిన కార్యదర్శి ఇంటి పన్నుల సొమ్మును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా కొద్ది రోజులు తన వద్దే ఉంచుకున్న వ్యవహారం వెలుగు చూసింది. అయినా శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తదుపరి మరో కార్యదర్శి లక్షల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులకు బదిలీ చేశారు.
మింగేయడానికి అవకాశం ఇలా.. పంచాయతీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా సుమారు రెండేళ్లకు పైగా ప్రత్యేకాధికారుల పాలన సాగించడం.
- ఆ సమయంలో జరిగిన నగదు లావాదేవీలపై అడిగేవారు లేకపోవడం.
- కొందరు సర్పంచులు కేవలం సమావేశాలకు హాజరై, సంతకాలు పెట్టడం. మినహా ఆయా అంశాలపై ఆరా తీయకపోవడం.
- పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది విధులు, వారి పనితీరుపై సర్పంచులు దృష్టి పెట్టకపోవడం.
జిల్లా అంతటా ఎన్నో... పెనుగొండ పంచాయతీలో ఉద్యోగులు, సిబ్బంది చేసిన నిధుల దుర్వినియోగం ఎంతనేది ఇప్పటికీ నిర్ధారించలేకపోతున్నారు. కేవలం విచారణ, రికవరీలతో కాలం గడిపేస్తున్నారు. వేల్పూరు పంచాయతీలో కొద్దిరోజుల కిందట కార్యదర్శి సుమారు రూ.30 లక్షల మేర తన ఖాతాకు మళ్లించారు. దీనిపై పాలకవర్గం ఫిర్యాదు చేయడంతో సదరు కార్యదర్శిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. దువ్వలో పంచాయతీ సిబ్బంది గ్రామంలో వసూలు చేసిన పన్నుల సొమ్ము స్వాహా చేశారు. సొమ్ము రికవరీ చేసినా ఈ వ్యవహారంలో ఉన్నది ఎవరన్నది బయటకు రాలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి.
ఆడిట్ ఓ మాయాజాలం.. గ్రామ పంచాయతీల్లో ఆడిట్ ఒక మాయాజాలంగా మారింది. ఏటా ఆడిట్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా కొన్నింట్లో ఏళ్ల తరబడి పెండింగులో ఉంది. తీరా పూర్తి చేయించి లోపాలను గుర్తించినా బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగినా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొంత ఖర్చు పెడితే ఆడిట్ పూర్తవుతుందనే ధీమాలో ఉద్యోగులున్నారంటే ఈ తంతులో ఏ మేరకు సొమ్ములు చేతులు మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు.. పంచాయతీల్లో ఏవైనా అక్రమాలు, అవినీతి జరిగినట్లు ఎవరైనా ఫిర్యాదు చేసినా.. మా దృష్టికి వచ్చినా విచారించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలి. అలా కాకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవు.
విక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, భీమవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’ కారులో ఎమ్మెల్యే రఘురామ సందడి!
[ 03-07-2024]
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు. -
ప్రేమ పేరుతో వల.. యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
[ 03-07-2024]
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. -
అక్రమాలకు గొడుగు పట్టారు
[ 03-07-2024]
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. -
నేడు ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల : నిమ్మల
[ 03-07-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కరెంటు కష్టాలు రానివ్వం
[ 03-07-2024]
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. -
నమ్మకంగా ముంచేస్తున్నారు!
[ 03-07-2024]
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. -
చేప ధర పైపైకి
[ 03-07-2024]
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. పది రోజులుగా వరుసగా పెరుగుతూ సంవత్సరం తర్వాత గరిష్ఠానికి చేరుకున్నాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. -
దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?
[ 03-07-2024]
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు. -
కూటమి సర్కారుపైనే ఆశలు!
[ 03-07-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
కుక్కునూరులో కదం తొక్కిన ఆదివాసీలు
[ 03-07-2024]
అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రయాణికుల ఇక్కట్లు!
[ 03-07-2024]
రైళ్ల రద్దు కారణంగా ఏలూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విదితమే. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
రెండేళ్ల తర్వాత బాలుడి ఆచూకీ లభ్యం
[ 03-07-2024]
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు
-
అచ్యుతాపురం సెజ్లో కృతిమ మేధ పరిశ్రమ