ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దందా
వింజరంలో అడ్డుకున్న గ్రామస్థులు
వింజరంలో నిల్వ ఉంచిన ఇసుక
కుక్కునూరు, న్యూస్టుడే: భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. అనుమానం వచ్చిన గ్రామస్థులు వారికి తెలిసిన వారి ద్వారా ఆ ప్రజాప్రతినిధిని సంప్రదించే ప్రయత్నం చేశారు. సదరు వ్యక్తులు శాసనసభ్యుడు కాదంటూ అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరు చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చిన వారు అక్రమార్కులుగా భావించి ఇసుక తరలించేందుకు తెచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు తమకు తెలియదన్నారు. చివరకు నియోజకవర్గ నాయకులు జోక్యం చేసుకుని ఆదివారం ఉదయం ఆ వాహనాలను విడిపించడంతో వాటిని తీసుకుని వెళ్లిపోయారు.
నిల్వలపై కన్ను
వైకాపా ప్రభుత్వ హయాంలో వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట, వింజరం ఇసుక రేవుల వద్ద లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశారు. అప్పట్లో ఆ ఇసుకను తరలించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ఇంతలోనే ఎన్నికలు రావడం, అధికార మార్పిడి జరగడంతో ఇప్పుడు ఆ నిల్వలపై ఇసుక వ్యాపారంలో ఆరితేరిన బడాబాబుల కళ్లు పడ్డాయి. ప్రముఖులతో చెప్పించుకుని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజా ఘటన కూడా ఆ తరహాలో జరిగిందే. గ్రామస్థులు ఎంత చెప్పినా వారు ఏ మాత్రం తడబడకుండా ఇసుకను తరలించుకుపోయే యత్నాలు చేయడం గమనార్హం. మీరు ఎంత మంది అడ్డు చెప్పినా.. అధికారులు వచ్చి దగ్గరుండి వాహనాలు పంపిస్తారంటూ బీరాలు పలికారు. అయితే గ్రామస్థులు ఆ బెదిరింపులకు లొంగకపోవడం, వాహనాలను కదలనీయకపోవడంతో చివరకు చేసేది లేక వదిలేయమని కోరారు. దానికి కూడా గ్రామస్థులు అంగీకరించలేదు. చివరకు నియోజకవర్గంలోని ఓ ప్రముఖ వ్యక్తితో ఫోన్ చేయించుకుని వాహనాలను తీసుకెళ్లాల్సి వచ్చింది.
జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేక..
ఈ స్థాయిలో జిల్లాలో ఎక్కడా ఇసుక అందుబాటులో లేదు. తూర్పుగోదావరి జిల్లాలో రేవులు ఉన్నా అక్కడ డ్రెడ్జింగ్ (నీళ్లలోంచి ఇసుక తీయడం) ద్వారానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో అంత కష్టపడకుండా సులభంగా తరలించుకునే వీలున్న ఇక్కడి నిల్వలపై ఇసుకాసురుల కళ్లు పడ్డాయి. రాజకీయ నాయకుల సహకారం ఎంత ఉందో తెలియదు గానీ, వచ్చిన వ్యక్తులు మంత్రి, ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’ కారులో ఎమ్మెల్యే రఘురామ సందడి!
[ 03-07-2024]
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు. -
ప్రేమ పేరుతో వల.. యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
[ 03-07-2024]
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. -
అక్రమాలకు గొడుగు పట్టారు
[ 03-07-2024]
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. -
నేడు ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల : నిమ్మల
[ 03-07-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కరెంటు కష్టాలు రానివ్వం
[ 03-07-2024]
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. -
నమ్మకంగా ముంచేస్తున్నారు!
[ 03-07-2024]
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. -
చేప ధర పైపైకి
[ 03-07-2024]
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. పది రోజులుగా వరుసగా పెరుగుతూ సంవత్సరం తర్వాత గరిష్ఠానికి చేరుకున్నాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. -
దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?
[ 03-07-2024]
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు. -
కూటమి సర్కారుపైనే ఆశలు!
[ 03-07-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
కుక్కునూరులో కదం తొక్కిన ఆదివాసీలు
[ 03-07-2024]
అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రయాణికుల ఇక్కట్లు!
[ 03-07-2024]
రైళ్ల రద్దు కారణంగా ఏలూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విదితమే. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
రెండేళ్ల తర్వాత బాలుడి ఆచూకీ లభ్యం
[ 03-07-2024]
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు.