సౌర వెలుగు.. ఆదరణ కరవు
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.
ప్రచారానికి నోచుకోని పీఎం సూర్యఘర్ పథకం
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ మేరకు ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పెద్ద ఎత్తున రాయితీ ఇస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల మోతతో వినియోగదారులు అల్లాడుతున్నారు. ఈ పథకం ద్వారా కరెంటు ఛార్జీల బాదుడు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. కానీ ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
40 మంది మాత్రమే.. సోలార్ విద్యుత్తు వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన విద్యుత్తు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 40 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
భారీ రాయితీ.. ఒక ఇంటి పైకప్పు మీద గరిష్ఠంగా రెండు నుంచి మూడు కిలోవాట్ల వరకు సోలార్ ఫలకాలను అమర్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సుమారు రూ.1.45 లక్షల వరకు ఖర్చవుతుంది. కిలోవాట్కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు పైబడి సౌరవిద్యుత్తు ప్ల్లాంటు ఏర్పాటు చేసుకుంటే రూ.78 వేల రాయితీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ప్లాంటు ఏర్పాటుకు అయ్యే ఖర్చును ముందుగా వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. ఆ తరువాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రాయితీ డబ్బులు జమ చేస్తారు.
అవగాహన కల్పిస్తున్నాం
‘సూర్యఘర్ పథకం గురించి విద్యుత్తు వినియోగదారులకు వివరిస్తున్నాం. భవిష్యత్తులో అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరింత అవగాహన కల్పిస్తాం. ఎన్నికల కారణంగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పథకానికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తాం’ అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
పీఎం సూర్యఘర్ పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడీ, విద్యుత్తు కనెక్షన్, చరవాణి నంబర్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం సర్వీసు నంబరు, మొబైల్ నంబరుతో లాగిన్ అయ్యి రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆరు నెలలకు సంబంధించిన విద్యుత్తు బిల్లుల కాపీలను జత చేయాలి. అనుమతులు వచ్చాక ఏజెన్సీల ద్వారా ఇంటిమీద సోలార్ ఫలకాలను అమర్చుకోవాలి. ఆపై నెట్ మీటరుకు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మీటరును మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన నెల రోజులకు రాయితీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డయేరియాపై అవగాహన కార్యక్రమం
[ 03-07-2024]
బయ్యన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ప్రధాని మోదీ పిలుపుతో ‘అమ్మ పేరిట మొక్క’ కార్యక్రమం
[ 03-07-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో భాజపా నాయకులు ' అమ్మ పేరిట మొక్క' కార్యక్రమం నిర్వహించారు. -
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
[ 03-07-2024]
దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
‘కల్కి’ కారులో ఎమ్మెల్యే రఘురామ సందడి!
[ 03-07-2024]
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు. -
ప్రేమ పేరుతో వల.. యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
[ 03-07-2024]
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. -
అక్రమాలకు గొడుగు పట్టారు
[ 03-07-2024]
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. -
నేడు ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల : నిమ్మల
[ 03-07-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కరెంటు కష్టాలు రానివ్వం
[ 03-07-2024]
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. -
నమ్మకంగా ముంచేస్తున్నారు!
[ 03-07-2024]
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. -
చేప ధర పైపైకి
[ 03-07-2024]
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. పది రోజులుగా వరుసగా పెరుగుతూ సంవత్సరం తర్వాత గరిష్ఠానికి చేరుకున్నాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. -
దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?
[ 03-07-2024]
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు. -
కూటమి సర్కారుపైనే ఆశలు!
[ 03-07-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
కుక్కునూరులో కదం తొక్కిన ఆదివాసీలు
[ 03-07-2024]
అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రయాణికుల ఇక్కట్లు!
[ 03-07-2024]
రైళ్ల రద్దు కారణంగా ఏలూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విదితమే. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
రెండేళ్ల తర్వాత బాలుడి ఆచూకీ లభ్యం
[ 03-07-2024]
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే