సమాజ హితం.. చైతన్య పథం!
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు.
స్వచ్ఛంద సేవలతో ఆదర్శం
నేడు వైద్యుల దినోత్సవం
అంధ విద్యార్థులతో డాక్టర్ యూవీ రమణరాజు, ఉపాధ్యాయులు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. వైద్య శిబిరాలు, పరీక్షలు, ఔషధాల పంపిణీ, వ్యాధుల నివారణకు చైతన్య కార్యక్రమాలతో పాటు బాధితులకు తమ పరిధిలో చేయూత అందించడం ద్వారా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి వారిపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
చీకటి జీవితాల్లో వెలుగురేఖ
భీమవరం పట్టణం, న్యూస్టుడే: భీమవరానికి చెందిన నేత్ర వైద్య నిపుణుడు యూవీ రమణరాజు వృత్తిని కొనసాగిస్తూనే సేవలతో ఎంతో మంది అంధుల జీవితాల్లో వెలుగులు నింపారు.Ë భీమవరం జువ్వలపాలెం రోడ్డులో ఉన్న తన నేత్ర వైద్యశాలలో ఓ గదిని పాఠశాలగా మార్చి ఉపాధ్యాయులను నియమించారు. యూవీ సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎంఎస్ఎం రాంప్రసాద్, అమర్లాల్, జీవీకే రాజు తదితరుల సహకారంతో 2004లో ప్రారంభమైన ఈ పాఠశాలలో అంధులకు బ్రెయిలీ లిపిలో బోధన మొదలుపెట్టారు. ప్రస్తుతం 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు 25 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇక్కడ విద్యనభ్యసించిన అంధ విద్యార్థులు 30 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉపాధ్యాయులుగా, వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులుగా సేవలôదిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు క్రీడలతో పాటు సంగీతం, మిమిక్రీ, పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు.
మరణానంతరం నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా 120 మంది దాతల నుంచి కార్నియాలు సేకరించారు. 240 మందికి ట్రస్టు ద్వారా కంటిచూపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు.
మహిళల కోసం..
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన మహిళా వైద్యులు సమాజ సేవల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఆబ్స్ట్రట్రిస్ గైనిక్ సొసైటీగా ఏర్పడి మహిళల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు కొవిడ్ ప్రభావిత రుగ్మతలు అధికమయ్యాయి. బాధితుల్లో కొందరు ఇలాంటి రుగ్మతలను బయటకు చెప్పేందుకు సిగ్గుపడతారు. వ్యాధి ముదిరాక వైద్యుల వద్దకు వెళ్లినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఈ సమస్యలను అధిగమించేలా ఈ బృందం సభ్యులు పట్టణాలు, గ్రామాలకు వెళ్లి మహిళలను సమావేశపరిచి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం 60 మంది మహిళా వైద్యులు ఈ బృందంలో ఉన్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో వీరు సేవలందిస్తున్నారు.
భీమవరం: అవగాహన కార్యక్రమంలో అధికారులు, సొసైటీ సభ్యులు (పాతచిత్రం)
15 ఏళ్లుగా.. భీమవరం, నరసాపురం పట్టణాల్లో గత 15 ఏళ్లుగా దాదాపు 150 వైద్య శిబిరాలు నిర్వహించారు. క్యాన్సర్పై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించారు. ప్రముఖ వైద్యుల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు వైద్యం అందిస్తున్నామని సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ గ్రంధి పద్మావతి పేర్కొన్నారు.
ఇళ్లకు వెళ్లి సేవలు..
తణుకు గ్రామీణం, న్యూస్టుడే: పేదలు, వృద్ధులకు సాధ్యమైనంత వరకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో తణుకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొందరు వైద్యులు సేవలందిస్తున్నారు. ఆరేళ్లుగా వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి కోసం సంచార వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఈ జన్మలో వైద్యులుగా తమకు గుర్తింపు ఇచ్చిన దేవుని కృప పొందాలంటే సమాజానికి, పేదలకు ఎంతో కొంత సేవ చేయాలనే యోచనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని.. దీనికి మరికొందరు వైద్యులు, దాతలు సహకారం అందిస్తున్నారని అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, నేత్ర వైద్య నిపుణుడు హుస్సేన్ చెబుతున్నారు. సీˆనియర్ సిటిజన్ అసోసియేషన్ ద్వారా అందిస్తున్న సంచార వైద్య సేవలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వృద్ధాశ్రమాల్లో వసతి పొందుతున్న వారికి కంటి, ఇతర చికిత్సలు అందిస్తున్నట్లు ప్రసూతి వైద్యురాలు అయేషా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’ కారులో ఎమ్మెల్యే రఘురామ సందడి!
[ 03-07-2024]
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు. -
ప్రేమ పేరుతో వల.. యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
[ 03-07-2024]
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. -
అక్రమాలకు గొడుగు పట్టారు
[ 03-07-2024]
ఉమ్మడి జిల్లాలో కొందరు తహసీల్దార్లు వైకాపాకు వీర విధేయులుగా వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీతో అంటకాగుతూ అక్రమాలకు గొడుగు పట్టారు. నేతల మాటలు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. వారు చెబితే నిబంధనలకు విరుద్ధమైనా అడ్డగోలుగా చేసేశారు. -
నేడు ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల : నిమ్మల
[ 03-07-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సాగు, తాగునీటి సమస్య తలెత్తకూడదన్న ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిపై ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
కరెంటు కష్టాలు రానివ్వం
[ 03-07-2024]
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో వ్యవసాయానికి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోనూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. -
నమ్మకంగా ముంచేస్తున్నారు!
[ 03-07-2024]
ఫిబ్రవరిలో భీమవరంలోని ఓ ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గడువు తీరిన పురుగు మందులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.3.63 లక్షల విలువైన 308 లీటర్ల గడువు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. -
చేప ధర పైపైకి
[ 03-07-2024]
చేపల ధరలు సంవత్సరం తర్వాత ఆశాజనకంగా మారాయి. పది రోజులుగా వరుసగా పెరుగుతూ సంవత్సరం తర్వాత గరిష్ఠానికి చేరుకున్నాయి. రోహూ, కట్లా జాతులకు టన్నుకు రూ.15వేలు పెరిగింది. -
దొంగలు ఎవరు.. సొత్తు ఎక్కడ..?
[ 03-07-2024]
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న భారీగా నగదు, బంగారం చోరీకి సంబంధించి నేటికీ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి బులియన్ వ్యాపార సంఘ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో స్థిరపడిన జైన్ కుటుంబానికి చెందిన బంగారు వ్యాపారి ఆ ప్రాంతంలో ఇటీవల జైన్ ఆలయం నిర్మించారు. -
కూటమి సర్కారుపైనే ఆశలు!
[ 03-07-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. వేలాది మంది సాగుకు దూరమయ్యారు. నూతన ప్రభుత్వం ఉదారంగా ఆదుకొని ఈ రంగానికి పూర్వ వైభవం తేవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
కుక్కునూరులో కదం తొక్కిన ఆదివాసీలు
[ 03-07-2024]
అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రయాణికుల ఇక్కట్లు!
[ 03-07-2024]
రైళ్ల రద్దు కారణంగా ఏలూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విదితమే. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
రెండేళ్ల తర్వాత బాలుడి ఆచూకీ లభ్యం
[ 03-07-2024]
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ