ఉపాధి నిధులు ఊదేశారు!
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు.
వైకాపా పాలనలో అడ్డగోలు వ్యవహారాలు
పనులు చేయకుండానే బిల్లులు స్వాహా
ఈనాడు, ఏలూరు, న్యూస్టుడే, తణుకు
గుణ్ణంపల్లిలో పనులు చేస్తున్న కూలీలు
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. దీనిపై అప్పట్లో కొందరు ఫిర్యాదు చేయగా సామాజిక తనిఖీ చేశారు. స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి ద్వారా అధికారులపై ఒత్తిడి చేయించి ఈ అంశం అసలు విచారణకే రాకుండా చేశారు.
తణుకు మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై 2023 డిసెంబర్లో పీడీ సామాజిక తనిఖీ నిర్వహించారు. వేల్పూరులో క్షేత్ర సహాయకుడిగా ఉన్న చిన్నారావు పనులకు రాని వారి పేర్లు నమోదు చేసి మస్తర్లు వేయించి వారికి వచ్చే వేతనాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇంకా అనేక అభియోగాలున్నాయి. వైకాపాకు చెందిన వ్యక్తి కావడంతో సరైన చర్యలు తీసుకోలేదు.
ద్వారకాతిరుమల మండలం నారాయణపురం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెంలలో వైకాపాకు చెందిన మేట్లు ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. మస్తర్లు షీట్లలో వేయకుండా తెల్ల కాగితాలపై చేయించారు. పనికి రానివారి పేరు దగ్గర గైర్హాజరు అని చూపించకుండా ఖాళీ వదిలేశారు. తర్వాత పనికి రాని వారితో సంతకాలు చేయించి సొమ్ము చేసుకున్నారు.
ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని వైకాపా సర్కారు అక్రమాలతో మసకబార్చింది. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైకాపా నాయకులు రూ.కోట్ల ఉపాధి నిధులనూ ఊదేశారు. అనధికారికంగా తమ అనుచరులను క్షేత్ర సహాయకులుగా పెట్టుకోవడం.. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు చేసుకోవడం.. తప్పుడు మస్తర్లతో పని చేయని వైకాపా కార్యకర్తలకు వేతనాలు జమ చేయడం.. అధికార పార్టీ నాయకుల తోటలు, పొలాల్లో ఉపాధి కూలీలతో పని చేయించడం.. ఇలా లెక్కకు మించిన అక్రమాలకు పాల్పడ్డారు. అవకతవకలను నిగ్గు తేల్చే సామాజిక తనిఖీలనూ పక్కదారి పట్టించారు.
క్షేత్ర సహాయకులను తొలగించి
వైకాపా అధికారంలోకి రాగానే అప్పటివరకు ఉన్న క్షేత్ర సహాయకులను అడ్డగోలుగా తొలగించారు. పెదవేగి మండలం కన్నాపురం, వేగివాడ, తాళ్లగోకవరం, లక్ష్మీపురం, గార్లమడుగు, దెందులూరు మండలం జోగన్నపాలెం, సోమవరప్పాడు, చల్లచింతలపూడి.. ఇలా ఉమ్మడి జిల్లాలో వందల మంది క్షేత్ర సహాయకులను కారణం లేకుండా తొలగించారు. చాలా చోట్ల అధికారికంగా పాతవారే కొనసాగినా.. అనధికారికంగా వైకాపా కార్యకర్తలతోనే పనులు చేయించారు. పాత వారికి జీతాలు రాకుండా అవస్థలు పెట్టారు. రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేయించారు. చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించడంతో కొనసాగించాలని చెప్పినా పట్టించుకోకుండా దందా చేశారు.
మితిమీరిన నేతల పెత్తనం
పెదవేగి మండలం తాళ్లగోకవరంలో ఓ వైకాపా నాయకుడు ఏకంగా ఉపాధి కూలీలతో తన సొంత ఆయిల్పాం తోటలో పనులు చేయించారు. ఇక్కడ పనులు చేసిన వారిలో తెదేపా సానుభూతిపరులకు వేతనాలు వేయకుండా.. పనికి హాజరు కాని వైకాపా మద్దతుదారులకు జమ చేసి ఇబ్బందులకు గురిచేశారు. రహదారి పక్కన నాటిన మొక్కల పెంపకానికి ఇచ్చే నిధులను అసలు మొక్కలు లేని ప్రాంతాలను చూపి బిల్లులు చేసుకున్నారు. రైతులకు రాయితీపై ఇచ్చే అయిల్పాం, కొబ్బరి మొక్కల విషయంలోనూ భారీ కుంభకోణాలు చేశారు. తప్పుడు పేర్లతో దరఖాస్తు చేసుకుని మొక్కలు తీసుకుని బయట అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
మెరక పనుల్లోనూ దందా
జగనన్న కాలనీల్లో మెరక పనుల విషయంలోనూ వైకాపా నాయకులు భారీగా చేతివాటం చూపించారు. ఏలూరులో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అండతో గోరంత మెరక పనులు చేసి కొండంత బిల్లులు చేసుకున్నారు. తణుకులో వైకాపా నాయకుడి ఆశీస్సులతో ఓ మండల స్థాయి అధికారి అసలు మెరక పనులు చేయకుండానే రూ.30 లక్షల వరకు స్వాహా చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అండతో స్థానిక నాయకులు నియోజకవర్గంలోని లేఅవుట్లను సమీప ప్రాంతాల్లో ఉన్న మట్టితో మెరక చేసి దూర ప్రాంతాల నుంచి తరలించినట్లు బిల్లులు పెట్టి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. నరసాపురంలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అధ్వర్యంలో మట్టి తరలింపులో కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవంగా తరలించిన మట్టికి ఎన్నో రెట్లు ఎక్కువకు బిల్లులు చేసుకున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ మెరక పనుల్లో వైకాపా నేతలు చేతివాటం ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!