ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు.
వారి పేర్ల మీద మస్తర్లు.. వేతనాల సొమ్ము కాజేత
ద్వారకాతిరుమల మండలంలో వెలుగుచూస్తున్న అక్రమాలు
ద్వారకాతిరుమల, న్యూస్టుడే
గోవింద కుంట చెరువులో పొక్లెయిన్తో తవ్వడంతో నిలిచిన నీరు
పొక్లెయిన్లతో తవ్వి.. ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు.
గుణ్ణంపల్లికి చెందిన వేములూరి విజయరాజు అనే ఔషధాల దుకాణం నిర్వాహకుడు ఉపాధి హామీ పనికి వచ్చినట్లు మస్తర్లు వేసి సొమ్ములు డ్రా చేశారు. అదే ఊరికి చెందిన కలపాల సుజాత ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో నర్సు. ఈమె పేరు మీద కూడా మస్తర్లు వేశారు.
ద్వారకాతిరుమలకు చెందిన గోరుముచ్చు వెంకన్న స్థానిక ఆలయంలో స్వీపర్గా పని చేస్తారు. ఎప్పుడూ ఉపాధి హామీ పనులకు వెళ్లలేదు. కానీ ఆయన పేరు మీద మస్తర్లు వేసి సుమారు రూ.40 వేలు కాజేశారు. కంచుం దుర్గారావు ఆలయంలో పొరుగు సేవల ఉద్యోగి. అతడి పేరు మీద కూడా మస్తర్లు వేసి డబ్బులు మింగేశారు. మరో వ్యక్తి మాదాస్ ఉపేంద్రకుమార్ శ్రీవారి ఆలయ కేశఖండనశాలలో పని చేస్తారు. అతడి పేరు మీద మస్తర్లు వేసి దోచుకున్నారు. మతిస్థిమితం లేని వృద్ధురాలి పేరు మీద మస్తర్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారు. స్థానిక వైకాపా నాయకులు సురేశ్, ఉక్కుర్తి వెంకట్రావు పేర్ల మీద కూడా మస్తర్లు వేసి సొమ్ములు కాజేశారు.
ద్వారకాతిరుమల మండలంలో 16874 జాబ్ కార్డులుండగా సుమారు 26800 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 9800 మంది పనులను ఉపయోగించుకుంటున్నారు. పథకంలో గత ప్రభుత్వ హయాంలో ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో భారీగా అక్రమాలు జరిగాయి. వైకాపా నాయకులు చొరవ, భరోసాతో కావాల్సిన వారి పేర్ల మీద మస్తర్లు వేసి రూ.లక్షలు నొక్కేశారు. అధికారులు, క్షేత్ర సహాయకులు, మేట్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారు. ద్వారకాతిరుమలలో క్షేత్ర సహాయకురాలు తన కుటుంబ సభ్యులు పనికిరాకపోయినా మస్తర్లు వేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం మిన్నకుండటంతో అడ్డగోలుగా దోచుకున్నారు. సుమారు రూ.30 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు అంచనా.
ఉపాధి హామీ అక్రమాల్లో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో వైకాపా నాయకుల అండదండలతో పనికి వచ్చిన వారికి కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా పలువురి పేర్ల మీద మస్తర్లు వేసి రూ.లక్షలు కాజేశారు.
విచారణ చేస్తాం.. ‘పథకంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేస్తాం. అవినీతి జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని ఎంపీడీవో తిరుపతిరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.