అమ్మకు ఆవేదన
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిజేరియన్ ద్వారానే అధిక శాతం కాన్పులు
‘ప్రైవేటు’లో 80 శాతం పైనే..
భీమవరం పట్టణం, ఆకివీడు, పెనుమంట్ర, వీరవాసరం, న్యూస్టుడే: కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో భీమవరం, తణుకు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలో సాధారణ ప్రసవాలు తక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన వైద్య శాఖ అధికారులు ఇటీవల విచారణ నిర్వహించగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 20 శాతం లోపే జరుగుతున్నట్లు గుర్తించారు. పలు పీహెచ్సీల్లో సాధారణ ప్రసవాలు జరగకపోవడంపై వైద్యులకు తాకీదులు ఇచ్చారు.
భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రసవాలు 260. వీటిలో సాధారణం 58 కాగా శస్త్ర చికిత్స నిర్వహించినవి 202.
పెనుగొండ సీహెచ్సీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 16 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. శస్త్ర చికిత్స ద్వారా 118 కాన్పులు చేశారు.
వీరవాసరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మార్చి నుంచి ఇప్పటి వరకు 2 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. అయిదు కేసులను ఇతర ఆసుపత్రులకు పంపారు.
పశ్చిమగోదావరిలో తణుకులో జిల్లా ఆసుపత్రి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురంలలో ప్రాంతీయ ఆసుపత్రులున్నాయి. పెనుగొండ, ఆచంటలలో సీహెచ్సీలున్నాయి. 2023-24లో జరిగిన ప్రసవాల్లో సింహభాగం సిజేరియన్లే. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 80 శాతానికి పైగా సిజేరియన్లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అధిక శాతం సిజేరియన్లు నమోదు కావడంపై పట్టణాల్లోని ఆరు ఆసుపత్రుల నిర్వాహకులకు వైద్యశాఖ అధికారులు ఇటీవల తాకీదులిచ్చారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.
ఎప్పుడు అవసరం.. బిడ్డ అడ్డం తిరిగినా, గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పు అయ్యే అవకాశం లేనప్పుడు మాత్రమే శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయాలి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదో ఒక సాకుతో శస్త్రచికిత్స చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. మంచి ముహూర్తానికి ప్రసవం చేయాలంటూ భీమవరంలో ఓ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణి నుంచి రూ. 80 వేలు వసూలు చేశారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని ఆసుపత్రుల్లో సిజేరియన్లకు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు
దుష్ప్రభావాలు ఎన్నో..
శస్త్ర చికిత్స ద్వారా కాన్పు జరిగిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. శస్త్ర చికిత్స సమయంలో ఇచ్చే మత్తుతో వెన్ను, తలనొప్పి వస్తుంది. కొందరికి తీవ్ర రక్తస్రావమవుతుంది. ప్రసవం తర్వాత బలహీనపడతారు. మొదటిసారి సిజేరియన్ చేస్తే రెండో కాన్పును కూడా శస్త్ర చికిత్స ద్వారా నిర్వహించాలి.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు తక్కువే..
వీరవాసరం, న్యూస్టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు రోజు రోజుకు తగ్గుతోంది. వీరవాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు మహిళలకు సాధారణ ప్రసవాలు చేశారు. ఇక్కడికి వచ్చిన అయిదుగురు మహిళలను భీమవరం, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయగా ఆపరేషన్ చేసి ప్రసవాలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఈ పీహెచ్సీ పరిధిలో 53 మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగినట్లు తెలిపారు.
అవగాహన కల్పిస్తున్నాం.. శస్త్ర చికిత్స ద్వారా కాన్పులు చేస్తున్న ఆసుపత్రులను తనిఖీ చేసి కారణాలు తెలుసుకుంటున్నాం. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు గర్భిణుల ఇళ్లకు వెళ్లినప్పుడు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించేలా ఆదేశాలిచ్చాం. ఐఎంఏ సమావేశాల్లోనూ ప్రైవేటు వైద్యులకు తగు సూచనలు ఇస్తున్నాం.
డి.మహేశ్వరరావు, డీఎంహెచ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.