ప్రాంతీయ హా..సుపత్రి
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు.
ప్రతి కేసూ రిఫర్ చేయడమే
ఓపీ వద్ద నిత్యం నిరీక్షణే
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు ఏలూరు సర్వజన ఆసుపత్రి పంపేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రమాద సమయాల్లో గాయాలకు కట్లుకట్టి పంపేస్తున్నారు. ప్రసూతి సేవలతో పాటు పలు విభాగాల్లో రోగులకు అంతంత మాత్రంగా సేవలందుతున్నాయి. రక్త పరీక్షలు, స్కానింగ్ కోసం బయటకు పంపుతున్నారు. రేడియాలజిస్టు లేరు. చిన్నారులకు ఎన్బీఎస్యూ యూనిట్ ఉన్నా ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఎక్స్రే యూనిట్లో రేడియోగ్రాఫర్ లేరు. చివరకు రోగులకు సరఫరా అవుతున్న భోజనం నాణ్యత కూడా అంతంత మాత్రమే.
ఏలూరు వెళ్లమన్నారు..
‘కింద పడిపోవడంతో నాకు గాయాలయ్యాయి. మా అమ్మ లక్ష్మి సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చా. వైద్యం అందించకుండానే ఏలూరు కు సిఫార్సు చేశారు. వెళ్లడానికి కనీస ఖర్చులు కూడా లేని స్థితి మాది’అని కనకాద్రిపురానికి చెందిన సంపంగి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
స్కానింగ్ బయటకు రాశారు
‘గర్భిణి అయిన నా భార్యను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చా. స్కానింగ్ కోసం బయటకు రాశారు. మేము పేదలం. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో కూడా స్కానింగ్ లేదు. ఏం చేయాలో తెలియడం లేదు’అని పంగిడిగూడేనికి చెందిన గంటా బేబీ మానస భర్త బాబూ భుజంగరావు వాపోయారు.
అలంకార ప్రాయంగా..
ఆసుపత్రిలో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎన్బీఎస్యూ యూనిట్ అలంకారప్రాయంగా ఉంది. ఇక్కడ 80 శాతం మంది పిల్లలను బయటి ఆసుపత్రులకు పంపుతున్నారు. అక్కడ వారు ఆరోగ్యశ్రీలో సొమ్ము చేసుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సిఫార్సు చేసిన డాక్టరే ప్రైవేటుగా వైద్యం అందిస్తుండటం గమనార్హం.
ఫిజియో థెరపిస్టులతో సరిపెడుతున్నారు
ఎముకల వైద్యుడు ఉన్నా ఉపయోగం లేదు. ఫిజియో థెరపిస్టులతోనే సరిపెడుతున్నారు. ఈ విభాగంలో శస్త్ర చికిత్సలు లేవు. ఆర్థో అసిస్టెంట్ అవసరం ఉంది. ఎక్స్రేలో రేడియాలజిస్టు లేరు. డిప్యుటేషన్లపై నెట్టుకొస్తున్నారు.
రక్తానికి కొరత
ప్రత్యేక రక్త నిధి కేంద్రం ఉన్నా ప్రజలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉండటం లేదు. ఆయా నిల్వలు పెరిగేలా చూడాల్సిన అవసరం ఉంది.
అన్ని చోట్లా నిరీక్షణే..
‘ఓపీ చీటీ రాసే వద్ద గంటకుపైనే సమయం పడుతోంది. ఇక్కడ ఆధార్ చూపిస్తున్నాం. మళ్లీ రక్త పరీక్షల వద్ద అడుగుతున్నారు. ప్రైవేటుకు వెళ్లలేక ఇక్కడికొస్తే గంటల తరబడి పడిగాపులు తప్పట్లేదు’అని ఆరిపాటిదిబ్బలుకు చెందిన రామ్ వెంకటలక్ష్మి తెలిపారు.
ఎమ్మెల్యే దృష్టికి.. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్కుమార్ ఇటీవల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వద్ద పలువురు రోగులు తమ ఇబ్బందులను ఏకరవు పెట్టారు. వీటిపై వైద్యులతో సమీక్ష చేశారు. ‘ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగు పరుస్తున్నా’ అని సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!