నిర్వహణ లేక.. నీరు పారక!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది.
దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు స్లూయిజ్లు, కాలువలు
నష్టపోతున్న విలీన మండలాల రైతులువేలేరుపాడు, న్యూస్టుడే
అడవిని తలపిస్తున్న రెడ్డిగూడెం సమీప కాలువ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో 16 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు 1979లో నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, స్లూయిజ్లు దశాబ్దకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా వివిధ రకాల పంటలు సాగు చేసే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల రైతులు ఏటా వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
చిట్టడవిని తలపిస్తూ.. ప్రాజెక్టు కాలువల్లో ప్రస్తుతం చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పూడిక పేరుకుపోయింది. డిస్ట్రిబ్యూటర్లు, స్లూయిజ్, అక్విడక్ట్లు మరమ్మతులకు గురయ్యాయి. చేసేది లేక... దిగువన ఉన్న మేడేపల్లి, కమ్మరిగూడెం, కోయమాదారం, రెడ్డిగూడెం, రామవరం, విప్పలగుంపు, రాళ్లపూడి, ఒంటిబండ, బండ్లబోరు రైతులు ఏటా కొంత నగదు పోగు చేసి కాలువల్లో పూడిక తీయిస్తున్నారు. అయినా పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పొగాకు, సెనగ పంటలు సాగు చేస్తున్న వారు ఏటా నష్టపోతున్నారు.
శిథిలావస్థకు చేరుకున్న స్లూయిజ్ తలుపులు
పలుమార్లు విన్నవించాం
కాలువలు, స్లూయిజ్లు, అక్విడక్టుల మరమ్మతుల కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.43 లక్షల అంచనాతో పలుమార్లు నివేదించాం. స్పందన లేదు. ప్రభుత్వం మారినందున మరోసారి ఉన్నతాధికారులకు వివరించి సాగు నీరందించేందుకు చర్యలు చేపడతాం’ అని కేఆర్పురం ఐటీడీఏ జలవనరుల శాఖ ఏఈ సురేశ్ తెలిపారు.
రూ.3 లక్షలు నష్టపోయా..
‘గతేడాది నేను 12 ఎకరాల్లో పత్తి, మినుము, వరి సాగు చేశా. అప్పులు చేసి పెట్టుబడి పెట్టా. పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో ఎండిపోయాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయా. అప్పులు తీరలేదు. ఈ ఏడాది పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది’ అని పాతరెడ్డిగూడేనికి చెందిన గిరిజన రైతు సోయం సీతయ్య తెలిపారు.
మరమ్మతులు చేయించాలి
‘పెదవాగు ప్రాజెక్టు కాలువలు, స్లూయిజ్ల దుస్థితిపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ సీజన్లోనైనా పంటలకు ఉపయోగపడేలా కాలువల్లో పూడిక తీయించాలి. రెండు మండలాల పరిధిలో శిథిలావస్థకు చేరిన స్లూయిజ్లు, అక్విడక్ట్లకు మరమ్మతు చేయించాలి’ అని రామవరం ఎంపీటీసీ మాజీ సభ్యుడు గడ్డాల ముత్యాలరావు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.