పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
రొయ్యల సాగులోనిషేధిత యాంటీబయోటిక్స్ వాడకం
మండవల్లి, కైకలూరు, న్యూస్టుడే
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వాటిల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉండటంతో కంటైనర్లను ఆయా దేశాలు తిప్పి పంపుతున్నాయి. అధికారులు ఎంత మొత్తుకున్నా సాగుదారులు వాటి వినియోగాన్ని మానుకోవడం లేదు. ఇటీవల కైకలూరులో ఎంపెడా, మత్స్య శాఖ, విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో విస్తూ పోయే నిజాలు వెలుగుచూశాయి. కొందరు ఆక్వా దుకాణ దారులు లాభాల కోసం నిషేధించిన హానికర రసాయనాలను ఇష్టారీతిలో విక్రయిస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2.70 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. అందులో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. జిల్లా నుంచే ఏటా 3.5 లక్షల టన్నుల వరకు రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల మన ప్రాంతంలోనూ రొయ్యల సాగులో పెద్ద ఎత్తున యాంటీ బయోటిక్స్ వాడుతున్నారని ఎంపెడా అధికారులు చెబుతున్నారు. కాకినాడ, చెన్నై కేంద్రాలుగా రాష్ట్రం నుంచి విదేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్, అమెరికా దేశాలు మన ప్రాంతంలోని రొయ్యల్లో అవశేషాలను కనుగొని కంటైనర్లను వెనక్కు పంపుతున్నాయి. దీనివల్ల ట్రేడర్స్ నష్టపోవడంతో పాటు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. కొన్ని దేశాలు మన దేశ ఉత్పత్తులను ఇప్పటికే నిషేధించాయి. నీ మన దేశం నుంచి 2022-23లో 17.18 లక్షల టన్నులు, 2023-24లో 17.82 లక్షల టన్నుల రొయ్యలను ఎగుమతి చేసి రూ.60 వేల కోట్లకు పైగా విదేశీ ఆదాయం వచ్చింది. నీ 2022లో 9, 2023లో 13 కంటైనర్లు వెనక్కి పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
వీటి వాడకం ఎక్కువ
నిషేధిత జాబితాలో ఉన్న క్లోరాంఫెనికల్, నైట్రోఫ్యూఠాన్, నైట్రోఫ్యూటంటోయిన్, నియోమైసిన్ వంటి యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలిసింది. వీటితో పాటు నిషేధించిన పురుగు మందులు నువాన్, ఫార్మాలిన్ వంటి ప్రమాదకర మందులు సైతం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.
మోతాదుకు మించి..
రొయ్యలకు అనేక వైరస్లతో కూడిన వ్యాధులొస్తుంటాయి. వైట్స్పాట్, వైట్గట్ సమస్యలను అధిగమించేందుకు పశువులు, కోళ్ల పెంపకంలో ఉపయోగించే యాంటీ బయోటిక్స్ను చెరువుల్లో వినియోగిస్తున్నారు. మంచి ఫలితాలు రావడంతో వీటి వాడకం అలవాటుగా మారింది. ఇదే అదనుగా కొన్ని వినియోగంలో లేని రసాయనాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. వాటిని మోతాదుకు మించి వినియోగించడం అనేక అనర్థాలకు దారితీస్తోంది. దీంతో ఎంపెడా (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ) ఆక్వా సాగులో 20 రకాల యాంటీ బయోటిక్స్ వాడకాన్ని నిషేధించింది.
ఆక్వా మందుల దుకాణంలో వివరాలు సేకరిస్తున్న అధికారులు
తనిఖీలు అంతంత మాత్రమే
కొన్నింటిని నిషేధించినా రైతులకు అందుబాటులో ఉంటున్నాయంటే అధికారులు తనిఖీలు తీరును అర్థం చేసుకోవచ్చు. మత్స్య శాఖ, ఆహార భద్రత, ఎంపెడా అధికారులు వీటిని అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టాలి. అయితే దుకాణాల నిర్వాహకుల నుంచి ముడుపులు దండుకుని తనిఖీలు చేయడం లేదనే విమర్శలున్నాయి. కైకలూరు, గణపవరం, ఏలూరు ప్రాంతాల్లో అడపాదడపా విజిలెన్స్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. కైకలూరు ప్రాంతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు మత్స్య శాఖ, విజిలెన్స్, ఎంపెడా ఆధ్వర్యంలో 2021లో ఏడు కేసులు నమోదు చేశారు. ఇటీవల కైకలూరులోని దుకాణాల్లో నిషేధించిన యాంటీ బయోటిక్స్ దొరికినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వ్యాధుల తీవ్రత తగ్గించేందుకు..
రొయ్యల సాగులో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో వ్యాధుల తీవ్రత అధికమైంది. మూడు పంటలకు ఒకటి మాత్రమే రైతుల చేతికి వస్తోంది. రెండు పంటలు మందుల్లేని వైట్స్పాట్ వ్యాధికి దెబ్బతింటున్నాయి. రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. వైట్స్పాట్ వ్యాధి నుంచి ముందస్తు రక్షణకు ఎంపెడా నిషేధించిన 20 రకాల యాంటీ బయోటిక్స్ను పలువురు రైతులు అనధికారికంగా వినియోగిస్తున్నారు.
ఎగుమతులపై ప్రభావం
‘ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్ వాడకంతో రొయ్యల విదేశీ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. రైతులకు వీటి వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. అయితే కొందరు దుకాణదారులు పశువులు, కోళ్ల పెంపకంలో వినియోగించే నిషేధిత రసాయనాలను విక్రయిస్తున్నారు. ఎప్పటికప్పుడు దుకాణాలపై దాడులుచేసి అపరాధ రుసుములు విధిస్తున్నాం. అయినా పద్ధతి మార్చుకోకపోతే కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్ చేస్తాం’ అని కైకలూరు మత్స్య శాఖ ఏడీ చాంద్బాషా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.