నిఘా నేత్రం.. నామమాత్రం..!
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం.
కొరవడిన పర్యవేక్షణ
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే
పట్టణ పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. పలు కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. వీటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. పలు చోట్ల ధ్వంసమై స్తంభాలకు వేలాడుతున్నాయి. వైకాపా అయిదేళ్ల పాలనలో వీటి నిర్వహణను పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
రూ.లక్షలు వెచ్చించి..
నిఘా నేత్ర వ్యవస్థను పట్టణ పోలీసులు రెండున్నరేళ్ల కిందట ఆధునికీకరించారు. రూ.24 లక్షల విరాళాలు సేకరించి పట్టణ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, సమస్యాత్మక ప్రాంతాల్లో 84 సీసీ కెమెరాలు అమర్చారు. వీటిలో 59 కెమెరాలు కొత్తవే. మిగిలిన వాటికి మరమ్మతులు నిర్వహించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించడానికి వీలుగా పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కొంత కాలం వరకు ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేశాయి. కాలక్రమేణా నిర్వహణ లేకపోవడంతో పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం కేవలం అయిదు కెమెరాలు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. తిరిగి ఈ వ్యవస్థ పునరుద్ధరించాలంటే రూ.6 లక్షల వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.మున్సిపల్ సాధారణ నిధుల నుంచైనా మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా...
నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరాలకు రెక్కీ నిర్వహిస్తున్నా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నా, రాత్రులు అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను నిఘా వ్యవస్థ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. రహదారి ప్రమాదాలకు కారణాలను తెలుసుకోవచ్చు. వీటి వల్ల విస్తృత ప్రయోజనాలు ఉన్నా...వీటిని యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు.
‘‘కొన్ని నెలల కిందట రూ.లక్ష వెచ్చించి కెమెరాలకు మరమ్మతులు చేయించాం. వర్షాలు, గాలులకు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నిఘా వ్యవస్థ ఆధునికీకరణపై దృష్టి సారిస్తాం.’’ అని సీఐ సుబ్రహ్మణ్యం అన్నారు.
పట్టణంలోని కడగట్ల వంతెనపై ఏర్పాటు చేసిన నిఘా నేత్రం ఇది. రెండేళ్ల కిందట దీనిని ఏర్పాటు చేశారు. ఆరు నెలల నుంచి ఈ విధంగా నేలచూపులు చూస్తూ దర్శనమిస్తోంది. కొన్నాళ్ల కిందట ఈ ప్రాంతంలో రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. కెమెరా పని చేయకపోవడంతో ప్రమాదానికి గల కారణాలను పోలీసులు గుర్తించడం కష్టమైంది. స్థానికులు చెప్పిన సమాచారం మేరకే దర్యాప్తు కొనసాగించారు.
పట్టణంలోని కోడె వెంకట్రావు పురపాలక ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కెమెరా ఇది. దీని చుట్టూ చెట్లు ఉండటంతో ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల
[ 01-07-2024]
ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
మరింత భరోసా..!
[ 01-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
దొరికినంత.. దోచేశారు..!
[ 01-07-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో 404 పంచాయతీలుండగా వీటిపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో వివిధ రకాల పని ఒత్తిడి, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటితో క్షేత్రస్థాయి సందర్శన తక్కువైంది. -
వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్ ప్రైవేటు కేంద్రాల్లో!
[ 01-07-2024]
‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్ మాత్రం బయట సెంటర్కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!
[ 01-07-2024]
భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. -
సౌర వెలుగు.. ఆదరణ కరవు
[ 01-07-2024]
వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. -
సమాజ హితం.. చైతన్య పథం!
[ 01-07-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. -
సీఎస్ఈపైనే మక్కువ!
[ 01-07-2024]
ఏపీఈఏపీ సెట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. -
రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత
[ 01-07-2024]
మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ హెచ్సీ జి.విజయబాబు తెలిపారు. -
పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. -
రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!
[ 01-07-2024]
ఖరీఫ్ సీజన్ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?