లేదు.. ఓ ప్రణాళిక.. పద్ధతి
పల్లెలు కరుగుతున్నాయి.. పట్టణాలు విస్తరిస్తున్నాయి..ఏటా పట్టణాలకు వలసలు పెరుగుతుండటంతో దీనికనుగుణంగా ప్రణాళికలు మాత్రం పట్టాలెక్కడం లేదు. దశాబ్దాల నాటి మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలు చేస్తుండటంతో పట్టణవాసులకు ఇక్కట్లు తీరడం లేదు.
పట్టించుకోని పట్టణ ప్రణాళిక విభాగం !
గత పాలనలో పూర్తి నిర్లక్ష్యం
చక్రబంధంలో పట్టణ జీవనం
తణుకు, భీమవరం పట్టణం, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: పల్లెలు కరుగుతున్నాయి.. పట్టణాలు విస్తరిస్తున్నాయి..ఏటా పట్టణాలకు వలసలు పెరుగుతుండటంతో దీనికనుగుణంగా ప్రణాళికలు మాత్రం పట్టాలెక్కడం లేదు. దశాబ్దాల నాటి మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలు చేస్తుండటంతో పట్టణవాసులకు ఇక్కట్లు తీరడం లేదు. భవిష్యత్ అవసరాల రీత్యా మాస్టర్ ప్లాన్ను ఆయా పట్టణాల్లో రూపొందిస్తారు. పట్టణ నైసర్గిక స్వరూపం, జనాభా, ట్రాఫిక్ వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని ఇరవై ఏళ్ల తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను ముందుగా అంచనా వేస్తారు. కానీ గత 40 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్నే ఇప్పటికీ జిల్లాలోని పట్టణాల్లో అమలు చేస్తుండటం గమనార్హం. దీంతో కొత్తగా భవన నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం నివాసాలు ఉన్న ఏరియాను వాణిజ్య ప్రాంతాలుగా చూపుతూ అనుమతులు ఇవ్వడం లేదు.
విస్తరణకు నోచుకోని మార్గాలు
భీమవరం పట్టణంలో 1987 నాటి బృహత్ ప్రణాళిక ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్తగా ప్రణాళిక ఇటీవల ఆమోదించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రహదారులు ఇరుకుగా ఉన్నాయి. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో రహదారుల విస్తరణపై దృష్టిసారించ లేదు. నరసాపురం- భీమవరం రోడ్డు, జాతీయ రహదారి ఇలా ప్రధానరోడ్లు మినహా పట్టణంలోని మిగిలిన మార్గాలు విస్తరణకు నోచుకోలేదు.
రాబోయే రెండు దశాబ్దాల్లో పెరిగే జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. దీని ప్రకారం రహదారుల విస్తరణ చేపడతారు. మరో వైపు వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజా అవసరాలు గుర్తించి సమస్యలు లేకుండా చేయాలంటే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. ఇంత కీలకంగా ఉన్న ఈ ప్రణాళికను యంత్రాంగం విస్మరించింది. ముఖ్యంగా ఇది చేయకపోవడంతో రహదారులు విస్తరణకు నోచుకోవడం లేదు.
జిల్లాలోని చాలా పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ కాల పరిమితి ముగిసింది. 44 ఏళ్ల నాటి ప్రణాళికతో రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో ఏలూరు ద్వితీయ స్థానంలో ఉండగా, మున్సిపాలిటీల్లో భీమవరం నాలుగో స్థానంలో ఉంది.
పుట్టగొడుగుల్లా కొత్త కాలనీలు.. పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిన తణుకు పట్టణం 2001లో ప్రణాళిక రూపొందించారు. కొన్ని రహదారులు ఇప్పటికీ ఇరుగ్గానే ఉన్నాయి. అధికారులు ఇష్టానుసారంగా షెల్లార్లకు అనుమతులు మంజూరు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాన్ని ఆనుకుని కొత్తగా కాలనీలు వెలిశాయి. రాష్ట్రపతి రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.్చ
నీట మునుగుతున్న రోడ్లు..నరసాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రం. సముద్ర తీర ప్రాంతం ఇక్కడే ఉంది. 2002 మార్చిలో ప్రణాళిక తయారు చేశారు. ప్రధాన కూడళ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. కొద్ది పాటి వర్షానికే రహదారులు నీట మునుగుతున్నాయి.
గూడెం.. ట్రాఫిక్ దిగ్బంధం
జిల్లాకు వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో ఏళ్ల నాటి ప్లానే ఇప్పటికీ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం 1958 లో ఏర్పడింది. అప్పటి పరిస్థితులకనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు పాత ప్రణాళికనే అనుసరిస్తూ వచ్చారు. ప్రస్తుతం పట్టణ పరిధిలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కే.ఎన్ రోడ్డు, శేషమహాల్ రోడ్డు, భీమవరం రోడ్డు, జూబ్లీరోడ్డులలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. 2023 ఆగస్టు నెలలో నూతన మాస్టర్ ప్లాన్ను తెరపైకి తెచ్చినా పకడ్బందీగా అమలు చేయలేదు. ప్రధాన కూడల్లో వంద అడుగుల రోడ్లు ఉండేలా దీనిని రూపొందించారు.
ప్రయాణానికి ఆటంకాలే
వ్యాపార కేంద్రంగా ఉన్న పాలకొల్లులో 2002లో తెరపైకి తెచ్చిన ప్లాన్ను అమలు చేస్తున్నారు. పెనుగొండ, నరసాపురం, భీమవరం వెళ్లాలంటే రహదారులు ఇరుకుగా ఉండి ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
‘‘జీఐఎస్ విధానం ద్వారా కొన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను స్కై గ్రూపు ఏజెన్సీకి అప్పగించారు. ఈ గ్రూపు సభ్యులు ప్రస్తుతం ఆయా పట్టణాల్లో గతంలో వివరాలు సేకరించారు. త్వరలో ప్రణాళికను అమలు చేస్తాం.’’ అని పట్టణ ప్రాంతీయ సంచాలకులు అరుణవల్లి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి నిధులు ఊదేశారు!
[ 29-06-2024]
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. -
ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
[ 29-06-2024]
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు. -
అమ్మకు ఆవేదన
[ 29-06-2024]
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగర హోదా దిశగా అడుగులు!
[ 29-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
ప్రాంతీయ హా..సుపత్రి
[ 29-06-2024]
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. -
నిర్వహణ లేక.. నీరు పారక!
[ 29-06-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. -
పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
[ 29-06-2024]
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. -
నిఘా నేత్రం.. నామమాత్రం..!
[ 29-06-2024]
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. -
ఆన్లైన్ యాప్లతో రూ. లక్షల్లో నష్టపోయాం
[ 29-06-2024]
జీఎంఆర్ ఆన్లైన్ యాప్ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. -
సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్ సాధనాలు!
[ 29-06-2024]
నేడు ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. -
వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ
[ 29-06-2024]
ఖరీఫ్ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.