మీరెలా చెబితే అలా సార్
వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో విధుల్లోకి చేరిన అధికారులు ఇప్పటి వరకు వాళ్ల వెంట అంటకాగారు. వాళ్లు చెప్పినట్లే నడుచుకున్నారు
నాడు వైకాపా నేతలతో అంటకాగి.. నేడు కొత్త భజన
పోస్టింగుల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
భీమవరం పట్టణం, పాలకొల్లు పట్టణం, తణుకు, న్యూస్టుడే : వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో విధుల్లోకి చేరిన అధికారులు ఇప్పటి వరకు వాళ్ల వెంట అంటకాగారు. వాళ్లు చెప్పినట్లే నడుచుకున్నారు. ప్రజలు గగ్గోలు పెట్టినా, ప్రతిపక్షాలు తప్పు అన్నా పట్టించుకోకుండా ఆ ప్రజాప్రతినిధుల మెప్పు కోసం పనులు చేశారు. ఇప్పుడా పరిస్థితి మారింది. అధికారుల్లో కొందరు అప్పట్లో మళ్లీ ఆ ప్రభుత్వమే వస్తుంది..మా హోదాకు ఢోకా ఉండదంటూ అప్పటి నాయకుల మాదిరే చెప్పుకొచ్చారు. ఎన్నికల నిబంధనావళిని సైతం లెక్క చేయకుండా వాళ్లకోసం కష్టపడ్డారు. ఎన్నికల ఫలితాలొచ్చాక వారి ఆశలు తలకిందులయ్యాయి, ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడా అధికారులు కొత్తగా భజనలు ప్రారంభించారు. ప్రస్తుత ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఓ అధికారి గతంలో అధికారంలో ఉన్న పార్టీకి విధేయుడిగా వ్యవహరించారు. వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ అమాత్యుని అండదండలుండటంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలుండేవి కాదు. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే పెద్దాయన్ని కలిసి రండంటూ ఉచిత సలహాలిస్తూ స్వామి భక్తిచాటుకున్నవాళ్లలో కొందరు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్లి వినయం ప్రదర్శిస్తున్నారు.
- పారిశ్రామిక కేంద్రం తణుకు నియోజకవర్గంలో కొందరు అధికారుల తీరు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి విస్మయం కలిగిస్తోంది. గతంలో అక్కడి అమాత్యుని కనుసన్నల్లో పనిచేసి ఇప్పుడు మీరెలా అంటే..అలా అంటున్నారు. ఇదే నియోజకవర్గంలోని ఓ ఆలయ అధికారైతే గత కొన్నేళ్లుగా ఏ ప్రజాప్రతినిధి గెలిస్తే ఆ ప్రజాప్రతినిధి పేరిట పూజలు చేయించి ప్రసాదాలు ఇచ్చి మచ్చిక చేసుకోవడంలో మంచి దిట్ట. ఇక్కడ పోలీసు అధికారుల్లో కొందరు మళ్లీ అవకాశం అంటూ వెంపర్లాడుతున్నారు. గతంలో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి పనిచేసిన అధికారులు పోస్టుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.
- నరసాపురం నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏదైనా సమస్యపై, కేసులు విషయమై ఆ అధికారుల దగ్గరకు వెళ్తే పట్టించుకునేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధికి అధికారులు ఇద్దరూ అంగరక్షకులుగా వ్యవహరించారు. కంటికి రెప్పలా కాపాడేవారని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు సీను మార్చారు. ఆ నియోజకవర్గంలో కీలకమైన రెవెన్యూ విభాగంలోని అధికారులు కూడా అలాగే కొనసాగారు. లక్ష్మీకటాక్షం ఉండే పోస్టులను వదిలి వెళ్లలేక ఆ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు ముమ్మరం చేశారు.
సొమ్ములు పంచుకున్నారు..సిఫార్సులంటున్నారు
సాధారణ ఎన్నికల సమయంలో యథేచ్ఛగా నగదు పంపిణీ జరిగింది. వాలంటీర్లకు, రాజకీయంగా కొద్దిపాటి పరపతి ఉన్న చోటా నాయకులకు కూడా వైకాపా నాయకులు నేరుగా ముట్టజెప్పారు. ఓటర్లకు రాత్రివేళల్లో నగదు పంపిణీ చేయడం గతంలో జరిగిన ఎన్నికల్లో చూశాం. ఈసారి పట్టపగలు ఇచ్చారు. ఆ సమయంలో పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలంటూ వివిధ పోలీస్స్టేషన్లకు నగదును అందించారు. ఉండి, ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో కొన్ని స్టేషన్లకు అప్పటి అధికార వైకాపా మద్దతుదారులు ఇచ్చిన నగదును ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచుకున్నారు. ఇప్పుడేమో వాళ్లంతా మళ్లీ అదే స్టేషన్లో అవకాశం కల్పించాలంటూ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను వేడుకొంటున్నారు.
- జిల్లా కేంద్రమైన భీమవరం పురపాలక సంఘం, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్తు, పోలీసు ఇలా ప్రముఖమైన శాఖల్లో పోస్టుల కోసం ఆ ప్రజాప్రతినిధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన అధికారులను ఆ ప్రజాప్రతినిధి చిరునవ్వుతో పలకరిస్తూ చూద్దాంలే అంటూ పంపించేస్తున్నారు.
- పాలకొల్లు నియోజకవర్గంలోని ఓ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న అధికారి మొన్నటి వరకు అక్కడి ప్రజాప్రతినిధి చిత్రం లేకుండానే భారీఫ్లెక్సీలు కట్టారు. అయినా ఆ ప్రజాప్రతినిధి ఏమీ అనేవారు కాదు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది. మళ్లీ ఆయనే ఎన్నికయ్యారు, పైగా అమాత్యులయ్యారు. దెబ్బతో ఆ అధికారి రూటే మార్చేశారు. మంత్రిగారి చిత్రంతో భారీ బ్యానర్లు కట్టేసి ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. పురపాలక సంఘంలో ఓ అధికారి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ల అంటకాగుతూ కొన్నేళ్లుగా అక్కడే విధుల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అవకాశం కోసం అమాత్యుని చుట్టూ వెంపర్లాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి నిధులు ఊదేశారు!
[ 29-06-2024]
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. -
ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
[ 29-06-2024]
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు. -
అమ్మకు ఆవేదన
[ 29-06-2024]
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగర హోదా దిశగా అడుగులు!
[ 29-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
ప్రాంతీయ హా..సుపత్రి
[ 29-06-2024]
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. -
నిర్వహణ లేక.. నీరు పారక!
[ 29-06-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. -
పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
[ 29-06-2024]
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. -
నిఘా నేత్రం.. నామమాత్రం..!
[ 29-06-2024]
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. -
ఆన్లైన్ యాప్లతో రూ. లక్షల్లో నష్టపోయాం
[ 29-06-2024]
జీఎంఆర్ ఆన్లైన్ యాప్ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. -
సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్ సాధనాలు!
[ 29-06-2024]
నేడు ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. -
వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ
[ 29-06-2024]
ఖరీఫ్ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.