పేరుకు పశ్చిమం..విధులన్నీ ఏలూరులో
జిల్లాల పునర్విభజన తర్వాత ఆలస్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో చేరిన మండలం గణపవరం. 2022 నవంబరుకు ముందు ఏలూరు జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ మండలం ఉండేది.
ఉపాధ్యాయులకు తప్పని పాట్లు
పార్వతికి వినతి పత్రం ఇస్తున్న లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: జిల్లాల పునర్విభజన తర్వాత ఆలస్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో చేరిన మండలం గణపవరం. 2022 నవంబరుకు ముందు ఏలూరు జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ మండలం ఉండేది. పరిపాలన కేంద్రానికి సుదూరంలో ఉందని, ఇక్కడి ప్రజలకు భీమవరంతో సత్సంబంధాలుండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఆ ప్రాంత ప్రజల విజ్ఞప్తులతో భీమవరం రెవెన్యూ డివిజన్లోకి చేర్చుతూ రాజపత్రాన్ని విడుదల చేశారు. ఇది జరిగి 20 నెలలు పూర్తయింది. విద్యాశాఖ మాత్రం ఇంకా ఏలూరు డీఈవో పరిధిలోనే కొనసాగుతోంది. దీంతో వందలాది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.
సుదూరం వెళ్లాల్సిందే.. వైకాపా అయిదేళ్ల పాలనలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోధనేతర పనులతో సతమతమయ్యారు. మరుగుదొడ్లను పరిశీలించి ఫొటోలు యాప్ల్లో అప్లోడ్ చేయడం, మధ్యాహ్న భోజనం వివరాలు ఇలా రోజుకు 10కిపైగా యాప్ల్లో వివరాల అప్లోడ్తో ఇబ్బందులుపడ్డారు. ఆ నివేదికలను డీఈవో కార్యాలయంలో అందించాలి. లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలుండేవి. దీంతో గణపవరం నుంచి వ్యయప్రయాసలతో ఏలూరు వెళ్లారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం హయాంలో అలాంటి ఇబ్బందులు తొలగాలని కోరుతున్నారు.
ఎవరికి చెప్పాలో తెలియదు.. గణపవరం మండలంలో 48 ప్రాథమిక, 7 ఉన్నత, 15 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు 263 మంది ఉన్నారు. ఎన్నికల విధులకు నియమించిన ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. వివరాలు ఎవరికి చెప్పాలో తెలియలేదు. తాడేపల్లిగూడెం ఆర్.వో.కార్యాలయానికి వెళ్తే ఉంగుటూరు వెళ్లమనేవారని, అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు ఏలూరులో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో ఎండలో తిరిగామని పలువురు వాపోయారు. ఆరోగ్యం సహకరించకపోయినా విధులకు తప్పక హాజరయ్యామంటున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఉపాధ్యాయ సమావేశాలకు ఏలూరు వెళ్లాలి. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనకూ అక్కడికే వెళ్లాలి.
విజ్ఞప్తులు చేస్తున్నాం.. గణపవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ పరిధిలోకి చేర్చాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలోని బృందం పాఠశాల విద్య అదనపు సంచాలకులు పి.పార్వతికి గతంలో వినతి పత్రం ఇచ్చారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో తీసుకెళ్లాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పశ్చిమ విద్యాశాఖలో విలీనం చేయాలి’ అని మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి భవానీ ప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి నిధులు ఊదేశారు!
[ 29-06-2024]
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. -
ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
[ 29-06-2024]
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు. -
అమ్మకు ఆవేదన
[ 29-06-2024]
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగర హోదా దిశగా అడుగులు!
[ 29-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
ప్రాంతీయ హా..సుపత్రి
[ 29-06-2024]
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. -
నిర్వహణ లేక.. నీరు పారక!
[ 29-06-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. -
పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
[ 29-06-2024]
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. -
నిఘా నేత్రం.. నామమాత్రం..!
[ 29-06-2024]
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. -
ఆన్లైన్ యాప్లతో రూ. లక్షల్లో నష్టపోయాం
[ 29-06-2024]
జీఎంఆర్ ఆన్లైన్ యాప్ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. -
సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్ సాధనాలు!
[ 29-06-2024]
నేడు ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. -
వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ
[ 29-06-2024]
ఖరీఫ్ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.