చెరువులకు మంచి రోజులెప్పుడు?
ఏలూరు జిల్లాలో మూడొంతుల భాగం మెట్ట మండలాలే. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ. సాగునీటికి చెరువులే ఆధారం. విలువైన ఆ జలవనరులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
నిర్వహణను గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం
ఆక్రమణలతో తగ్గిన విస్తీర్ణం
తరుగుతున్న సాగు..
అడుగంటుతున్న భూగర్భ జలాలు
కబ్జా చెరలో కొయ్యలగూడెం అంకాల చెరువు
జల వనరుల శాఖ అప్ల్యాండ్ కొయ్యలగూడెం సబ్డివిజన్ పరిధిలోని బందకట్టు జలాశయం కాలువలన్నీ దాదాపు పాడయ్యాయి. సైఫన్లు శిథిలయ్యాయి. దిగువన చెరువులకు చేరాల్సిన వరద మధ్యలోనే వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొయ్యలగూడెం మండలంలో అంకాల, వడిసెలవాని, రాజు చెరువులు ఆక్రమణల బారిన పడటంతో వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.
కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, టి.నరసాపురం, ఉంగుటూరు, న్యూస్టుడే: ఏలూరు జిల్లాలో మూడొంతుల భాగం మెట్ట మండలాలే. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ. సాగునీటికి చెరువులే ఆధారం. విలువైన ఆ జలవనరులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆయకట్టు అభివృద్ధికి, నీటి పారుదల నిర్మాణాల కనీస మరమ్మతులకు పైసా విదల్చ లేదు. ఫలితంగా పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమణల బారిన పడ్డాయి. విస్తీర్ణం తగ్గి సాగునీరు అందక ఆయకట్టు రైతులు విలవిల్లాడుతున్నారు.
మక్కినవారిగూడెం జిమ్మి చెరువుకు పడిన గండి
తూములు దెబ్బతిన్నాయని.. చెరువు తూములు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వ హయాంలో మొరపెట్టుకోగా.. ఎవరూ పట్టించుకోలేదు. మూడు మరమ్మతులకు ఇటీవల మండల పరిషత్తు నిధులు రూ.4 లక్షలు మంజూరయ్యాయి. దీంతో అధికారులు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. వచ్చేనెల ఒకటిన టెండరు తెరుస్తామని అధికారులు చెప్పడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలే పేడ్రాల కాలువ ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, పాపికొండల్లో ఏ మాత్రం వర్షం పడినా చెరువు నిండిపోతుందని, వేసవి కాలంలో చేపట్టాల్సిన తూముల పనులు ఇప్పుడు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశించినా..
ఉంగుటూరు మండలం అక్కుపల్లిగోకవరంలో 58.38 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీని ద్వారా 60.70 హెక్టార్ల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. చెరువు విస్తీర్ణంలో సుమారు 19 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నల్లమాడు రెవెన్యూ పరిధి గొల్లగూడెంలో 35.92 ఎకరాల విస్తీర్ణంలో ధర్మ చెరువు ఉôది. సుమారు 32 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇందులో 8.10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. గతంలో ప్రభుత్వ, అసైన్డు, శ్మశాన, చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యర్రమిల్లిపాడు, బాదంపూడిలోని రెండు చెరువుల్లో ఆక్రమణలు తొలగించి మమ అనిపించారు.
ఆక్రమణలు తొలగించడం లేదు
‘చెరువు మొత్తం ఆక్రమణకు గురైంది. ఈతగండి తూము సమీపం వరకు పంటల సాగు చేస్తున్నారు. అదేమంటే మాకు పట్టాలున్నాయని ఆక్రమణదారులు చెబుతున్నారు. ఈ విషయమై అనేక సార్లు రైతులంతా కలిసి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదు’ అని కృష్ణారావుపేటకు చెందిన రైతు పాశాల రవి తెలిపారు.
ప్రపంచ బ్యాంకు నిధులిచ్చినా..
గొలుసు కట్టు చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసినా పోలవరం పంచాయతీ కొత్తూరు చెరువుకు ఖర్చు చేయలేని పరిస్థితి. సుమారు 200 ఎకరాల గర్భం ఆక్రమణల ఫలితంగా వంద ఎకరాలకు పరిమితమైంది. దీని కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏ మాత్రం చినుకు పడినా పేడ్రాల వాగు ద్వారా నీరు చెరువులోకి వచ్చి చేరుతుంది. సంవత్సరం అంతా ఎంతో కొంత నీరు వస్తూనే ఉంటుంది. వర్షాలు కురవకపోయినా పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీరు సరఫరా చేసేలా తెదేపా ప్రభుత్వ హయాంలో రెగ్యులేటర్ నిర్మించారు. నీటి ఎద్దడి తలెత్తినప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటిని చెరువులోకి మళ్లించి రైతులు సాగు చేసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి నిధులు ఊదేశారు!
[ 29-06-2024]
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. -
ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
[ 29-06-2024]
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు. -
అమ్మకు ఆవేదన
[ 29-06-2024]
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగర హోదా దిశగా అడుగులు!
[ 29-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
ప్రాంతీయ హా..సుపత్రి
[ 29-06-2024]
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. -
నిర్వహణ లేక.. నీరు పారక!
[ 29-06-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. -
పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
[ 29-06-2024]
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. -
నిఘా నేత్రం.. నామమాత్రం..!
[ 29-06-2024]
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. -
ఆన్లైన్ యాప్లతో రూ. లక్షల్లో నష్టపోయాం
[ 29-06-2024]
జీఎంఆర్ ఆన్లైన్ యాప్ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. -
సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్ సాధనాలు!
[ 29-06-2024]
నేడు ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. -
వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ
[ 29-06-2024]
ఖరీఫ్ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
-
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు
-
ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు