నకిలీల గుట్టు రట్టు
ఆరుగాలం శ్రమించి పొలంలో చెమటోడ్చే రైతుకు నకిలీ విత్తనాలు కంటనీరు తెప్పిస్తున్నాయి. సరైన విత్తనాలు చేతికందితేనే కర్షకుని శ్రమకు ప్రతిఫలం ఉంటుంది.
విత్తన దుకాణాలపై విస్తృత తనిఖీలు
వేగం పెంచిన విజిలెన్స్ అధికారులు
చినమల్లంలో ధాన్యలక్ష్మి సీడ్స్ గోదాములో అధికారుల తనిఖీలు(పాత చిత్రం)
న్యూస్టుడే, ఏలూరు: ఆరుగాలం శ్రమించి పొలంలో చెమటోడ్చే రైతుకు నకిలీ విత్తనాలు కంటనీరు తెప్పిస్తున్నాయి. సరైన విత్తనాలు చేతికందితేనే కర్షకుని శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. నాసిరకం, నకిలీ విత్తనాల బారిన పడితే కష్టాలు, నష్టాలు మినహా ఏమీ మిగలవు. అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న వేళ... రైతులకు సరైన, మేలురకం విత్తనాలు అందించడంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో విత్తన దుకాణాలు, గోదాములపై విస్తృతంగా దాడులు చేస్తూ... నకి‘లీలల’ గట్టు విప్పుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు విత్తన దుకాణదారులు రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేని విత్తనాలు విక్రయిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. తెల్లహంస, పీఆర్ 126 రకం, ఇతర నాసిరకం కంపెనీలకు చెందిన విత్తన విక్రయాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు వాటిని విక్రయిస్తూ... కర్షకులను దెబ్బతీస్తున్నారు. కొన్ని మేలురకం విత్తనాల కొరత సృష్టించి... ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక మొత్తానికి విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన దుకాణ యజమానులపై విజిలెన్స్ అధికారులు నిత్యావసరాల చట్టం, సీడ్ కంట్రోల్ చట్టం 1983 కింద కేసులు నమోదు చేశారు.
నిబంధనలివీ...
- వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన, అన్ని రకాలుగా రైతులకు లాభం చేకూర్చే విత్తనాలను వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదం పొందాకే రైతులకు విక్రయించాలి.
- విత్తిన విత్తనాల్లో 80 శాతం మొలకెత్తేలా ఉండాలి.
- 12 నుంచి 14 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. అలాగైతేనే మొలకెత్తుతాయి
- రైతుల నుంచి కొనుగోలు చేసిన మేలు రకం విత్తనాలను ఆయా కంపెనీల బాధ్యులు సరిగా ఆరబెట్టాలి.
- విత్తనాలు నిల్వ ఉంచే గోదాములో పురుగు మందులు, ఎరువులు ఉంచరాదు.
- గోదాములో తేమ, ఊట ఉండకుండా చూడాలి.
- పెంటపాడు మండలం రాచర్లలోని శ్రీధన సీడ్స్ హోల్సేల్ విత్తన దుకాణ గోదాముపై గత నెల 28న విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లహంస కంపెనీ విత్తనాలు, పీఆర్ 126 రకం విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గోదాములో దాచిన రూ.4.75 లక్షల విలువైన 61 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
- పెనుగొండ మండలం చినమల్లంలోని శ్రీధాన్యలక్ష్మి సీడ్స్ దుకాణ గోదాములో గత నెల ఒకటిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనుమతుల్లేని విత్తన నిల్వలను గుర్తించారు. మొత్తం రూ.51.80 లక్షల విలువైన 2,590 క్వింటాళ్ల వరి విత్తనాలున్నట్లు గుర్తించారు. గోదాము యజమానిపై కేసు నమోదు చేశారు.
చర్యలు తీసుకుంటాం...
విత్తన కంపెనీలు, దుకాణదారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో చర్యలు తప్పవు. అనుమతుల్లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. బ్లాక్లో విత్తనాలు అమ్మినా నేరమే. విత్తన దుకాణాలపై గోదాములపై విస్తృతంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాం.
- కరణం కుమార్, విజిలెన్స్ జిల్లా ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి నిధులు ఊదేశారు!
[ 29-06-2024]
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. -
ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
[ 29-06-2024]
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు. -
అమ్మకు ఆవేదన
[ 29-06-2024]
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగర హోదా దిశగా అడుగులు!
[ 29-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
ప్రాంతీయ హా..సుపత్రి
[ 29-06-2024]
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. -
నిర్వహణ లేక.. నీరు పారక!
[ 29-06-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. -
పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
[ 29-06-2024]
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. -
నిఘా నేత్రం.. నామమాత్రం..!
[ 29-06-2024]
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. -
ఆన్లైన్ యాప్లతో రూ. లక్షల్లో నష్టపోయాం
[ 29-06-2024]
జీఎంఆర్ ఆన్లైన్ యాప్ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. -
సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్ సాధనాలు!
[ 29-06-2024]
నేడు ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. -
వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ
[ 29-06-2024]
ఖరీఫ్ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
-
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!