కొండలా పెరుగుతున్న ఫెర్రీ బకాయి
నరసాపురం మాధవాయిపాలెం ఫెర్రీ రేవుకు సంబంధించి నిర్వాహకుడు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి.
రూ.52,57,648 లక్షలకు చేరిన మొత్తం
రేవు నిర్వాహకుడిపై క్రిమినల్ చర్యలకు రంగం
నరసాపురం గ్రామీణ, న్యూస్టుడే: నరసాపురం మాధవాయిపాలెం ఫెర్రీ రేవుకు సంబంధించి నిర్వాహకుడు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం - కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మధ్య గోదావరిపై పంటు నడిపేందుకు 2023-24 సంవత్సరానికి సంబంధించి నరసాపురానికి చెందిన సీహెచ్ఎస్వీ రెడ్డప్ప ధవేజీ రూ.3.61 కోట్లకు పాట పాడుకున్నారు. ఈ రేవు పాట గడువు ఏప్రిల్ 1తో ముగిసింది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జడ్పీ అధికారులు ఫెర్రీ రేవు పాట నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి రేవు పాట నిర్వహించే వరకు రోజు వారీగా రూ.1,02,904 చెల్లించే పద్ధతిలో రెడ్డప్ప ధవేజీని కొనసాగించేలా సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో కొన్ని నెలలపాటు రోజు వారీ చెల్లింపులు సక్రమంగానే నడిచినా తర్వాత గాడి తప్పింది. దీంతో ఈ నెల 26 నాటికి మండల పరిషత్కు రూ.52,57,648 లక్షల సొమ్ము బకాయి పడ్డారు.
ముందు నుంచే కొంత.. నరసాపురం మండల పరిషత్ అధికారులు ఈ పరిస్థితిని సంయుక్త కార్యాచరణ కమిటీ, జడ్పీ సీఈవో (ఏలూరు) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంయుక్త కార్యాచరణ కమిటీ కమిటీ ఈ నెల 15న సమావేశమై రేవు నిర్వహణ బకాయి సొమ్ములు మండల పరిషత్తు చెల్లించాలని రెడ్డప్ప ధవేజీకి సూచించింది. ఈ మేరకు అప్పటికే బకాయి ఉన్న సొమ్ము రూ.35 లక్షలు త్వరలో చెల్లిస్తానని, మిగిలిన సొమ్మును త్వరలో చెల్లించడంతోపాటు రోజు వారీ నిర్దేశించిన సొమ్మును ఏ రోజుకు ఆ రోజుకు చెల్లిస్తానని కమిటీకి హామీ ఇచ్చారు. అయితే నిర్వాహకుడు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకపోవడంతో 26-06-24 నాటికి బకాయి మొత్తం రూ.52,57,648 చేరిందని ఎంపీడీవో రమణారావు పేర్కొన్నారు. బకాయి సొమ్ము చెల్లించాలని ధవేజీకి ఇప్పటికే అనేక సార్లు నోటీసులు జారీ చేశామని తెలిపారు. రేవు నిర్వాహకుడు మార్గదర్శకాలకు బిన్నంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు అతడిపై క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి నిధులు ఊదేశారు!
[ 29-06-2024]
పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. -
ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!
[ 29-06-2024]
ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు. -
అమ్మకు ఆవేదన
[ 29-06-2024]
కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నగర హోదా దిశగా అడుగులు!
[ 29-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
ప్రాంతీయ హా..సుపత్రి
[ 29-06-2024]
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. -
నిర్వహణ లేక.. నీరు పారక!
[ 29-06-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. -
పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం
[ 29-06-2024]
రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. -
నిఘా నేత్రం.. నామమాత్రం..!
[ 29-06-2024]
తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. -
ఆన్లైన్ యాప్లతో రూ. లక్షల్లో నష్టపోయాం
[ 29-06-2024]
జీఎంఆర్ ఆన్లైన్ యాప్ను నమ్మి తామంతా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ పలువురు బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. -
సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్ సాధనాలు!
[ 29-06-2024]
నేడు ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. -
వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ
[ 29-06-2024]
ఖరీఫ్ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
-
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్