Andhra News: ప్రేమ పేరుతో వల.. యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు.
తేజస్విని ఆచూకీ లభ్యంతో ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - పటమట
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. అతను ఇదే విధంగా రెండేళ్ల కిందట విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటూ ఓ యువతిని ట్రాప్ చేశాడు. ఆ యువతిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి, అంజాద్తో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అంజాద్ యువతులకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగేవాడని తెలిసింది.
గత ఏడాది అక్టోబర్లో మిస్సింగ్ కేసు నమోదు
తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని ట్రాప్ చేశాడు. కొంతకాలం సన్నిహితంగా మెలిగిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లారు. వెళ్లేటప్పుడు అంజాద్.. ఇంటి నుంచి కొంత నగదు తీసుకెళ్లినట్లు తెలిసింది. మరుసటి రోజు సాయంత్రానికి కూడా తేజస్విని భీమవరం రాకపోయేసరికి.. కంగారు పడిన ఆమె తల్లి విజయవాడ వచ్చి.. మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డబ్బుల్లేక ఫోన్లు, చెవి కమ్మలు అమ్మేసి..
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతీ, యువకుల ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు హోటల్కు చేరుకునేసరికి అక్కడి నుంచి వీరు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆచూకీ అక్కడి సీసీ కెమెరాల్లోనూ లభించలేదు. అనంతరం డబ్బులకు ఇబ్బంది రావడంతో హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18 వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.
తొలుత హైదరాబాద్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో కేరళకు వెళ్లి పది రోజులు ఉన్నారు. అక్కడా ఇల్లు దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చారు. అక్కడ తేజస్విని తన చెవి కమ్మలు, బంగారు వస్తువులను రూ.15 వేలకు అమ్మేసింది. అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లారు. కొంతకాలం తర్వాత మళ్లీ ముంబయికి..అక్కడి నుంచి పుణె, దిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి డబ్బులు అయిపోవడంతో.. రైలెక్కి జమ్మూ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో పనికి కుదిరాడు అంజాద్. హోటల్ యాజమాని కేటాయించిన గదిలో వీరిద్దరూ ఉంటున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో తేజస్విని, అంజాద్లు పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది.
సోదరికి ఇన్స్టాలో మెసేజ్తో..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశంతో కదిలిన నగర పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు. వీరు వాడుతున్న ఫోన్ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ నుంచి వెళ్లినప్పటి నుంచి యువతిని ఇతరులతో మాట్లాడేందుకు అంగీకరించేవాడు కాదు. కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత కూడా ఫోన్ ఇవ్వలేదు. అంజాద్ లేని సమయంలో అతని ఫోన్ నుంచి తన అక్కకు ఇన్స్ట్రాగ్రాంలో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు.. సోమవారం సాయంత్రం విజయవాడ పోలీసులకు చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె అక్క ఫోన్ నుంచి తేజస్వినితో చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వారు ఎక్కడ ఉన్నారో.. స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇన్స్టాగ్రాం ద్వారా ప్రస్తుత లొకేషన్ పంపించమని అడిగారు. దీంతో కరెంట్ లొకేషన్ను యువతి పంపింది. అది వేరే దేశానిది చూపించడంతో పోలీసులు నిరుత్సాహానికి గురయ్యారు. అమెజాన్ ద్వారా ఇటీవల.. ఫొటోఫ్రేమ్ను బుక్ చేశారు. ఆ పార్శిల్ పెట్టెపై ఉన్న చిరునామాను ఫొటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. ఆ చిరునామాను వెంటనే జమ్మూ పోలీసులకు పంపించారు. వారు పరిశీలించి.. అది జమ్మూలోని గాంధీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రాంతంగా గుర్తించారు. వెంటనే బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి.. వారిని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కథ సుఖాంతం అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టిసీమ పరవళ్లు
[ 04-07-2024]
కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. -
చెరువు.. కనుమరుగు!
[ 04-07-2024]
తణుకు పురపాలక సంఘ పరిధిలో మత్స్యశాఖ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిరుపయోగంగా మారాయి -
రీసర్వే చిక్కు.. దక్కని భూహక్కు!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాక చేపట్టిన రీసర్వే ద్వారా అంతకాదు ఇంతకాదన్న పాలకులు చివరికి చేతులెత్తేసి రైతులను అష్టకష్టాల పాల్జేశారు. మొదట్లో స్థానిక గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిపేస్తామని గొప్పలు చెప్పి చతికిలపడ్డారు -
వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యలతో బడులు వెలవెల
[ 04-07-2024]
ఇది యలమంచిలి మండల కేంద్రం శివారు గొలేపరచెరువు ప్రాథమిక పాఠశాల. గతంలో 15 మంది వరకు విద్యార్థులుండగా..ఈ ఏడాది ఒక్కరే మిగిలారు. -
నిర్మాణ రంగానికి ఊపిరొచ్చింది
[ 04-07-2024]
కూటమి సర్కారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చ జెండా ఊపింది. తాజా నిర్ణయంతో గత అయిదేళ్లు వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడనుంది -
ఐక్యంగా పోరాడదాం ఆక్వాను రక్షిద్దాం!
[ 04-07-2024]
వేల కోట్ల విదేశీ మారకం తెచ్చి పెడుతున్న ఆక్వా రంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో రైతులంతా ఐక్యంగా పనిచేసి సమస్యలను సాధించుకుందామని జైభారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. -
నిలిచిన బిల్లులు..ఆగిన నిర్మాణం!
[ 04-07-2024]
అత్తిలిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బాలారిష్టాలు తప్పడంలేదు. అత్తిలి మండలం చుట్టుపక్కల 35 గ్రామాల ఇంటర్ విద్యార్థులకు అత్తిలి శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రభుత్వ జూనియర్ కళాశాలే ఆధారం. -
నిధులు మళ్లించడంతో పనులు చేయలేకపోయాం!
[ 04-07-2024]
వైకాపా పాలనలో 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులు పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, మళ్లింపు
[ 04-07-2024]
విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు -
వైకాపాకు అనుకూలంగా రెవెన్యూ సిబ్బంది ఎలా పనిచేశారు?
[ 04-07-2024]
ఆగిరిపల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఆర్అండ్బీ రహదారిని ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసుకున్న నివాసాలకు గత ప్రభుత్వంలో వైకాపాకు అనుకూలమైన వారికి మాత్రమే అప్పటి తహసీల్దారు ఎం.ఉదయ భాస్కరరావు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు -
అడుగడుగునా ట్రాఫిక్ చక్రబంధం
[ 04-07-2024]
పెరుగుతున్న వాహనాలు.. అందుకు అనుగుణంగా లేని సౌకర్యాలు.. దశాబ్దాల కిందట రూపకల్పన చేసిన ప్రణాళిక.. విస్తరణకు నోచుకోని రోడ్లు.. వెరసి నగరాలు, పట్టణాల్లో నిత్యం ట్రాఫిక్ చక్రబంధంతో జనం సతమతమవుతున్నారు. -
వేలేరుపాడుకు జ్వరమొచ్చింది
[ 04-07-2024]
విలీన మండలం వేలేరుపాడు విష జ్వరాలతో అల్లాడుతోంది. కొయిదా, వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాల్లో మూలుగుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
-
అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు
-
‘నీట్ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
-
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?