logo

ప్రియుడి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం

ప్రియుడి వేధింపులు భరించలేక మనోవేదనతో ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మరిపెడ మండలం డీఎస్‌ఆర్‌ జెండాలతండా పరిధిలోని ఆముదాలగడ్డ తండాలో బుధవారం చోటు చేసుకుంది

Updated : 04 Jul 2024 06:15 IST

అనూష (పాతచిత్రం) 

మరిపెడ, న్యూస్‌టుడే: ప్రియుడి వేధింపులు భరించలేక మనోవేదనతో ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మరిపెడ మండలం డీఎస్‌ఆర్‌ జెండాలతండా పరిధిలోని ఆముదాలగడ్డ తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై తహెర్‌బాబా, స్థానికులు పేర్కొన్న వివరాల ప్రకారం తండాకు చెందిన బాదావత్‌ అనూష (20) డిగ్రీ మధ్యలోనే ఆపివేసి కుటుంబసభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన వివాహితుడైన భూక్యా సురేష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. సురేష్‌కు భార్య పిల్లలు ఉండటంతో అనూష కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు వీరి వివాహానికి అంగీకరించలేదు. కొంతకాలంగా సురేష్‌ అనూషను తనతో కలిసి జీవించాలని వేధిస్తున్నాడు. మనోవేదనకు గురైన అనూష బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తండ్రి కోట్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తనను ప్రేమ పేరిట నమ్మించి భూక్యా సురేష్‌ మోసం చేశాడని, తన చావుకు సురేష్‌ కారణమని అనూష సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని