6 నుంచి శ్రీభద్రకాళి శాకాంబరి మహోత్సవాలు
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీభద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు.
కరపత్రాలు విడుదల చేస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ప్రధానార్చకుడు శేషు, ఈవో శేషుభారతి తదితరులు
రంగంపేట, న్యూస్టుడే: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీభద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 6న ఉదయం ఉత్సవాలు ప్రారంభం, ఉదయం 10 గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుందన్నారు. బుధవారం దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడారు. రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధులు, రాజగోపురాలు తదితర అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రధానార్చకుడు శేషు మాట్లాడుతూ.. భారత దేశంలోని అన్ని ఆలయాల్లో వసంత, శరన్నవరాత్రులు విధిగా జరుపుతారని, నవరాత్ర చతుష్టయిం మన ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో మాత్రమే నిర్వహిస్తారన్నారు. 21న ఆషాఢ శుద్ధ పౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాలైనా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అలంకరిస్తారన్నారు. ఈవో శేషుభారతి మాట్లాడుతూ.. శాకాంబరి ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యూలైన్లు, తాగునీటి వసతి, ప్రసాదాల పంపిణీ ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. సమావేశంలో దేవస్థానం పర్యవేక్షకుడు విజయ్, కార్పొరేటర్లు, అర్చకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారులపై ప్రాణాంతక గుంతలు
[ 07-07-2024]
జాతీయ, రాష్ట్ర రహదారులపై గుంతలు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతున్నాయి. శుక్రవారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం గుంతే. -
వారం సమయం ఇస్తున్నా.. మార్పు కనిపించకపోతే మీ పని పడతా!
[ 07-07-2024]
వివిధ జిల్లాల నుంచి వచ్చే పేద రోగులకు ఎంజీఎం ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వైద్యులను ఆదేశించారు. -
శాకాంబరి మహోత్సవాలకు శ్రీకారం
[ 07-07-2024]
వేద మంత్రోచ్చరణాలు, భక్తుల జేజేలు, మంగళహారతులతో శ్రీభద్రకాళి అమ్మవారి సహస్ర కలశాభిషేకం నయనానందకారంగా జరిగింది. -
రూ.100 కోట్లతో భద్రకాళి ఆలయాభివృద్ధి
[ 07-07-2024]
భద్రకాళి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరామని, తొలి విడతలో రూ.30 కోట్లతో మాడవీధుల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. -
ముంపు తప్పేదెలా?
[ 07-07-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు సురేఖ, సీతక్క వరుస సమీక్షలతో వరంగల్ నగరాభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
సీఎం ఆదేశం.. డీఎంఈ ఆగమనం
[ 07-07-2024]
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. -
పదోన్నతులపై ఉపాధ్యాయుల విముఖత
[ 07-07-2024]
విద్యాశాఖలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు, వారికి ప్రాతినిథ్యం వహించే ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ