మహిళా శక్తి.. స్వయం ఉపాధికి దీప్తి
గతనెల 29న హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్ ప్రాంతంలో కొత్తగా అయిదు క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రతిపాదనలు తయారు చేసింది
గతనెల 29న హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్ ప్రాంతంలో కొత్తగా అయిదు క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రతిపాదనలు తయారు చేసింది. తద్వారా మహిళలకు ఉపాధి లభించనుంది.
రంగంపేట, న్యూస్టుడే: వరంగల్ ఆర్టీసీ బస్టాండ్, ఎంజీఎం ఆసుపత్రి, కాకతీయ వైద్య కళాశాల, గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, రంగశాయిపేట నాయుడు పంపు కూడలిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద కొత్తగా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వీటి నిర్వహణ స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) అప్పగిస్తారు. ఇందులో మహిళలు సొంతంగా తయారు చేసిన పచ్చళ్లు, సర్వపిండి, పిండి పదార్థాలు, పండ్ల రసాలు, చాయ్ తదితరాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఎస్హెచ్జీలు తయారు చేసే వస్తువులతో స్టాల్ ఏర్పాటు చేస్తారు.
విక్రయాలకు వేదికగా..
గ్రేటర్ వరంగల్ పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పర్యవేక్షణలో 15,964 స్వయం సహాయక సంఘాలు, 1.67 లక్షల మహిళలు సభ్యులుగా ఉన్నారు. 13 పట్టణ సమాఖ్యలు, 529 స్లమ్ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. వీరికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు బ్యాంకు లీంకేజీ రుణాలు, పట్టణ స్వయం ఉపాధి పథకం, స్త్రీ నిధి పథకం, పీఎం స్వనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందుతున్నాయి. తద్వారా వేలాది మంది మహిళలు ఇళ్లలోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. పిండి వంటలు, పచ్చళ్లు, పండ్ల రసాలు తయారు చేయడం, వస్త్ర సంచులు, టైలరింగ్, కిరాణ దుకాణాలు, కంగన్ హాల్స్, బ్యూటీషియన్ కేంద్రాలు, చిరు వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అయితే తయారు చేసిన పదార్థాలు, వస్తువుల అమ్మకాల తగిన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకొచ్చింది.
ఇలా కాకుండా చూడాలి..?
గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో పదేళ్ల క్రితమే క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కాకతీయ-1 దివ్యాంగుల పట్టణ సమాఖ్యకు నిర్వహణ అప్పగించారు. నెలకు రూ.12 వేల అద్దె ఖరారు చేశారు. అద్దె తగ్గించాలని దివ్యాంగులు అర్జీ పెట్టుకున్నారు. దీనిపై బల్దియా అధికారులు తుది నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో గతేడాది నుంచి క్యాంటీన్ మూతబడింది. దీనిని తెరిచి ఎస్హెచ్జీలకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రారంభించే మహిళా శక్తి క్యాంటీన్లకు సైతం ఇలాంటి అవాంతరాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
అవకాశం ఇవ్వాలి: - కొలిపాక సంధ్యారాణి
మాది రంగశాయిపేట. మా పొదుపు సంఘంలో 10 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. లీంకేజీ, స్త్రీనిధి పథకం ద్వారా రుణాలు తీసుకున్నాం. అందరం కలిసి పిండి వంటలు తయారు చేస్తున్నాం. వీటిని విక్రయించేందుకు ఇబ్బందిగా ఉంది. మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి.
వ్యాపారం బాగానే ఉంది..: - బండారి శ్రీకళ, శంభునిపేట
మా పొదుపు సంఘంలో పది మంది సభ్యులున్నారు. బ్యాంకు లీంకేజీ రుణంతో స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. మొదట్లో ఇబ్బందిగా అనిపించింది. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. మేము తయారు చేసిన పిండి పదార్థాలు, పచ్చళ్లు ఇతర వస్తువులు విక్రయించడం ఇబ్బందిగా మారింది. వరంగల్ ప్రాంతంలో మహిళా శక్తి క్యాంటీన్ అవకాశం ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.