దర్జాగా భూ కబ్జా..
ప్రభుత్వ భూములు, చెరువులను అక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఫిర్యాదులపై చర్యలు శూన్యం
భూపాలపల్లి, న్యూస్టుడే: ప్రభుత్వ భూములు, చెరువులను అక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి సాగు చేస్తున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని జంగేడు శివారు తిప్పిరెడ్డికుంట అభివృద్ధి పనులకు 1994లో నీటిపారుదల శాఖ అధికారులు 62 ఎకరాల భూమి సేకరించి సదరు రైతులకు నష్టపరిహారం చెల్లించారు. అప్పట్లో రూ.70 లక్షలతో చెరువు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ చెరువు కింద 260 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతుంది. ఈ మేరకు చెరువు మత్తడి ప్రాంతంలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సర్వే నెంబరు 920, 921 లో ఉన్న ఆరు ఎకరాల భూమిపై కొంత మంది దళారుల కన్ను పడింది. ఈ భూమి అక్రమణకు గురవుతుందని జంగేడు గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్కు గతంలో ఫిర్యాదు చేశారు. 6 ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులు తప్పుడు సర్వేనంబర్ల పేరుతో ఒకరు 1.20, మరో వ్యక్తి 1.21 ఎకరాలు పట్టా చేసుకొని 2022లో పట్టాదారు పాసు పుస్తకాలను సైతం తీసుకున్నట్లు తెలిసింది. మూడు ఎకరాలను అక్రమ పట్టా చేసుకుని, మరో మూడు ఎకరాల చెరువు భూమిని సాగు చేస్తున్న విషయం అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎకరానికి రూ.15 లక్షల ధర పలుకుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విలువైన చెరువు భూములను రక్షించాలని పలు గ్రామాల ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఆక్రమణలు ఇలా..
- భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని మంజూరునగర్ జాతీయ రహదారికి అతిసమీపంలో ఉన్న చెరువు భూములను కొందరు వ్యాపారులు అక్రమంగా పట్టాలు చేసుకొని అమాయకులకు నివాస స్థలాలకు విక్రయిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో అక్రమణలను గుర్తించి భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. ఈ చెరువు కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది.
- మంజూర్నగర్ ప్రాంతంలోని తుమ్మల చెరువు భూములు సుమారు మూడు ఎకరాల వరకు అన్యాక్రాంతమయ్యాయి. వీటిని కొందరు దళారులు అక్రమంగా పట్టాలు చేసుకున్నట్లు తెలిసింది. రెండు ఎకరాల భూమి విలువ రూ.2 కోట్లకు పై మాటే.
- గణపురం మండలం చెల్పూరు శివారు, కేటీకే 8వ గని ప్రధాన రోడ్డు సమీపంలో ఉన్న ఎర్రచెరువు భూమి రెండు ఎకరాలకు పైగా ఓ వ్యక్తి అక్రమించి చుట్టూ గోడ నిర్మించారు.
- మహబూబ్పల్లి సమీపంలోని సోమన్నకుంట భూములు రెండు ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయి. మరో రెండు ఎకరాలు శ్మశానవాటిక కోసం కేటాయించగా ఓ వ్యక్తి అక్రమించుకొని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం
- ప్రసాద్, నీటిపారుదల శాఖ డీఈ
మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమణకు గురైన చెరువు భూములపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మూడు చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేశాం. అవసరమైతే భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.