ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి.
కొత్త నేర చట్టాల ద్వారా విచారణ వేగవంతం
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా
ఈనాడు, వరంగల్, వరంగల్క్రైం, న్యూస్టుడే
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. వీటిపై కేసులు ఎలా నమోదు కానున్నాయి. వాట్సప్లో సైతం ఫిర్యాదు ఎలా చేయాలి? సందేహాలుంటే బాధితులు ఎవరిని సంప్రదించాలి? తదితర అంశాలపై వరంగల్ సీపీ అంబర్కిశోర్ఝా తో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.
కొత్త చట్టాలపై సిబ్బంది పూర్తి శిక్షణ పొందారా?
ఈ చట్టాలతో కేసులు నమోదు చెయ్యడంలో సిబ్బంది నూటికి నూరు శాతం శిక్షణ పొందారు. మొత్తంగా ఎనిమిది బృందాలకు తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ అందించారు. ఈ బృందాల్లోని వారిని ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్’ (టీవోటీ) గా వ్యవహరిస్తాం. వీరు కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో రోజుకు 30 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అలా మనకున్న 1800 సివిల్ సిబ్బందితో పాటు, ఎస్బీ, సీసీఆర్బీ, స్పెషల్ పార్టీలకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చాం. ఇప్పటికీ టెలీకాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి. మరేమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నాం.
నూతన చట్టంతో మహిళలకు, బాలలకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
గతంలో కంటే నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తారు. దీని వలన నిందితులకు వేగంగా శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే పిల్లల భద్రత కోసం తీసుకొచ్చిన పోక్సో లాంటి చట్టాలు అలాగే ఉంటాయి.
బాధితులకు ఏమైనా సందేహాలుంటే ఎలా నివృత్తి చేసుకోవాలి?
నూతన చట్టంతో ప్రజలకు పూర్తిగా రక్షణ ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేస్తే దానిని ప్రజలు పరిశీలించుకోవచ్చు. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ వివరాలు బాధితులు, నిందితులు పొందొచ్చు. ఏమైనా అనుమానాలు వస్తే ఠాణా స్థాయిలో స్పష్టత రాకపోతే ఏసీపీ, డీసీపీ, లేదా నా వద్దకు వచ్చినా సందేహాలను నివృత్తి చేసి పంపుతాం. ఈ చట్టాలపై మేం కూడా నిరంతరం అవగాహన పెంచుకుంటూనే ఉంటాం.
ఇక నుంచి సాంకేతిక ఆధారాలు కీలకంగా మారుతాయంటున్నారు. మరి బాధితులు వాట్సప్లో ఎలా ఫిర్యాదు చేయొచ్చు?
బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నెంబర్కు వాట్సప్ ద్వారా ఫిర్యాదుచేయొచ్చు. మా వాళ్లు కేసు నమోదు చేస్తారు. కాకపోతే ఫిర్యాదుదారులు మూడు రోజుల తర్వాత ప్రత్యక్షంగా కూడా వెళితే బాగుంటుంది. కేవలం వాట్సప్ ఫిర్యాదులపైనే ఆధారపడితే ఎవరు ఎవరిమీదైనా ఇష్టానుసారంగా ఫిర్యాదు చేసే ప్రమాదం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు వచ్చిన తర్వాత ఠాణాలోని రిజిస్టర్లో నమోదు చేస్తారు. అధికారి విచారించిన తర్వాత కోర్టు అనుమతి తీసుకొని కేసు నమోదు చేస్తారు. ఠాణాల్లో ఇక నుంచి నెంబర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
కొత్త చట్టాల వల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
ఈ రోజు ఒక హత్య కేసు నమోదైంది. పాత చట్టంలో అయితే అది ఐపీసీ 302 ఉండేది. ఇప్పుడు బీఎన్ఎస్ 103 క్లాజ్ వన్ కింద కేసు పెట్టాం. ఇదే కేసు తీసుకొంటే గతంలో ప్రత్యక్ష సాక్షులే కీలకంగా ఉండేది. ఇప్పుడు సాంకేతిక ఆధారాలు ప్రత్యక్ష సాక్షులకు సమానంగా న్యాయస్థానం పరిగణిస్తుంది. అంటే వీడియో ఆధారాల లాంటివి అన్నమాట. ఆధునిక యుగంలో సాంకేతిక ఆధారాలే కీలకం. దీని వల్ల తీర్పులు వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఈ చట్టాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇప్పటికే 37 ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను రూపొందించారు. వీటిపై మా సీనియర్ ఐపీఎస్ అధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. ఇక సైబర్ నేరాల విషయంలో ఐపీసీ కింద నమోదు చేసే వాటిలో మార్పు ఉంటుంది. ఐటీ చట్టం లాంటి వాటిని కూడా సైబర్లో ఉపయోగించేవాళ్లం. అవి అలాగే కొనసాగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.