ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
న్యూస్టుడే, తాడ్వాయి(ములుగు జిల్లా)
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
ఎందుకు ప్రత్యేకం అంటే..
ఆదిమానవుల సమాధులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఆయా దేశాల్లో వేర్వేరు పేర్లు ఉన్నప్పటికీ వీటిని ప్రధానంగా డోల్మన్లుగా పిలుస్తారు. మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో కనిపిస్తాయి.. ఎక్కడైనా పదుల సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకే ప్రదేశంలో 200కు పైగా కనిపిస్తాయి. ఇవి క్రీ.పూ.2 వేల సంవత్సరాల కిందటిగా గుర్తించారు.
ఒకే సమాధిలో ఉన్న మూడు శవపేటికలు
తరలివస్తున్న పర్యాటకులు... పట్టించుకోని అధికారులు
ఐదేళ్లుగా దామెరవాయి సమాధులను వీక్షించేందుకు పర్యాటకులు సెలవు రోజుల్లో తరలివస్తున్నారు. వారికి పర్యాటకశాఖ సౌకర్యాలు కల్పించడం లేదు. రూ.48 లక్షలతో విశ్రాంతి భవనం నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దామెరవాయికి చెందిన బింకారి కార్తీక్ అనే యువకుడు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పర్యాటకులకు గైడ్లా సేవలందిస్తున్నారు.
ధ్వంసమైన చోట..
రక్షణ చర్యలు శూన్యం..
సమాధుల రక్షణకు ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎండ, వానకు కొన్ని పగిలిపోతుండగా, కొన్ని చెదలు పట్టి పుట్టలుగా మారుతున్నాయి. కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. మరికొందరు ఇళ్ల నిర్మాణాలకు సమాధుల బండరాళ్లను పగులగొడుతున్నారు.
వాటికి నెంబర్లు వేసి నడక బాట ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
శవపేటిక లేకుండా ఉన్న సమాధిని చూపిస్తున్న కార్తీక్
ఇలా చేరుకోవచ్చు..
ఆదిమానవుల సమాధుల వద్దకు వెళ్లేందుకు సులువైన రవాణా మార్గాలున్నాయి. హనుమకొండ నుంచి సరిగ్గా 107 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హనుమకొండ బస్టాండ్ నుంచి ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం, గుంటూరు వెళ్లేందుకు ప్రతి 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉంటుంది. ఈ బస్సులో వచ్చి తాడ్వాయిలో దిగి అక్కడి నుంచి 13 కి.మీ. దూరంలోని కాటాపురం గ్రామానికి వెళ్లాలి. కాటాపురం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని దామెరవాయికి వెళ్లేందుకు ఆటోలు సిద్ధంగా ఉంటాయి. సమాధుల సమీపం వరకు ఆటోలు, కార్లు వెళ్లేందుకు పర్యాటకశాఖ మట్టి రోడ్డు నిర్మించింది.
శవపేటికలో లభించిన ఎముకలు
కొత్త విషయాలు కనుకొన్న స్థానికులు..
ఈ సమాధులను ప్రజలు రాకాసి గుహలుగా పిలుస్తారు. పూర్వ కాలంలో రాక్షసులు నివాసం ఉండేవారని చెప్పుకొంటారు. 4 అడుగుల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ గుహల గోడలు, కప్పులపైన 10 నుంచి 20 టన్నుల బరువున్న పెద్ద బండరాళ్లను పేర్చారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారనే సందేహాలను ఇటీవల స్థానిక యువకులు నివృత్తి చేశారు. స్థానిక యువకుడు బింకారి కార్తీక్, మరికొందరు ఈ నిర్మాణాలకు 100 నుంచి 500 మీటర్ల దూరంలో ఓ గుట్ట నుంచి బండరాళ్లను వేరు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. వాటిని వేరు చేసేందుకు ఇనుము, లేదా రాతి పనిముట్లకు పదును పెట్టుకొనే రాళ్లను సైతం కనుగొన్నారు.
ఇనుప పనిముట్లకు పదును పెట్టేందుకు ఉపయోగించిన బండ
సమాధులను నిర్మించేందుకు గుట్టపైన బండలు పగులగొట్టినట్లు కనిపిస్తున్న గుర్తులు
త్వరలో సౌకర్యాలు కల్పిస్తాం
- శివాజీ, జిల్లా పర్యాటక అధికారి
సమాధుల సందర్శనకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. విశ్రాంతి భవన నిర్మాణం చివరి దశలో ఉంది. విద్యుత్తు, తాగునీటి వసతి కల్పించి విశ్రాంతి భవనాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. గైడ్ను నియమించాల్సిన అవసరాన్ని ఉన్నతాధికారుల దృషికి తీసుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.