దర్జాగా మట్టి దందా..
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.
ఇటుక బట్టీలకు, స్థిరాస్తి వ్యాపారాలకు తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు
ఐనవోలు (హనుమకొండ), న్యూస్టుడే
ఐనవోలు మండలం వెంకటాపూర్లోని ఊర చెరువులో రాత్రి వేళలో మట్టి తరలింపు
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.
నల్లమట్టిని ఒక్కో టిప్పర్నకు రూ.16 వేలు, మొరం రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. అధిక లోడుతో టిప్పర్లలో మట్టి తరలిస్తుండటంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
ఐనవోలు మండలంలోని వెంకటాపూర్లో 2 వేల మెట్రిక్ టన్నుల మట్టి తరలింపునకు మైనింగ్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. గుత్తేదారు పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీతో మట్టిని తోడేస్తున్నారు. ప్రతి రోజు 20 గంటలు జేసీబీ యంత్రాన్ని నడిపించి 2 వేల మెట్రిక్ టన్నులను రెండు రోజుల్లోనే పూర్తి చేశారు. వే బిల్లులు లేకుండా టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్లో 20 మెట్రిక్ టన్నులు తరలించవచ్చు. రోజుకు 15 టిప్పర్ల ద్వారా 200 ట్రిప్పులను తరలిస్తున్నారు. గత 15 రోజులుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆత్మకూరులోని ఊర చెరువులో, కొత్తగట్టు చెరువు, ఊరుగొండ చెరువుల్లోనూ ఇదే పరిస్థితి..
ముల్కలగూడెం ఊరచెరువులో మట్టి తోడటంతో 15 అడుగులపైగా లోతుగా ఏర్పడిన గోతులు
నిబంధనలు ఇక్కడ పనిచేయవు..
ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా గ్రానైట్, కంకర క్వారీల మాదిరిగానే గనులశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. హెక్టారుకు రూ.50 వేలు గనులశాఖకు డిపాజిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం రూ.50 వేలు తపాలశాఖకు చెల్లించి అనుమతి తీసుకోవాలి. క్యూబిక్ మీటరు మొరానికి రూ.40 చొప్పున చెల్లించాలి. రెండు శాతం ఆదాయపన్ను, ఒక శాతం కార్మికశాఖకు పన్ను చెల్లించాలి.
ఇళ్ల నిర్మాణాల అనుమతి కోసం మొరం, ఇటుక బట్టీలకు నల్లమట్టి కోసం స్థానిక తహసీల్దారు నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో లేదా నెల రోజులకు పైగా తవ్వకాలు జరపాలంటే జిల్లా పాలనాధికారి నుంచి అనుమతి పొందాలి. భూగర్భశాఖ, కాలుష్య నియంత్రణ, డీఎఫ్వో, ఆర్డీవో, తహసీల్దార్లు సంబంధిత స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం పాలనాధికారికి నివేదిక అందజేస్తారు. అనంతరం మీసేవ కేంద్రాల ద్వారా గనులు భూగర్భశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు భూముల్లో అయితే సంబంధిత పట్టాదారు ఆమోదం పొందాలి.
ఇవేమి లేకుండా కొంతమంది అధికారుల చేతి వాటంతో అరకొర అనుమతులతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
తిమ్మాపూర్ మీదుగా ఇటుక బట్టీలకు టిప్పర్లలో తరలిస్తున్న నల్లమట్టి
కరిగిపోతున్న కొండపర్తి గుట్టలు
కొండపర్తి, తరాలపల్లి, వనమాలకనపర్తి శివారులోని గుట్టల్లో 10 క్వారీలు లీజు ద్వారా అనుమతులు తీసుకొని 15 ఏళ్లుగా మొరం తరలిస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా అధికారులు అటువైపునకు వెళ్లి కొలతల ప్రకారం తవ్వకాలు జరుగుతున్నాయా లేదా పరిశీలించలేదు. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో మొరం వరంగల్, హనుమకొండ నగరానికి తరలిస్తున్నారు. ఈ టిప్పర్లు వేబిల్లు లేకుండానే నడుస్తుంటాయి..
ఎక్కడెక్కడ ఎక్కువ అంటే..
- ఐనవోలు మండలంలోని వెంకటాపూర్, కొండపర్తి, ముల్కలగూడెం, పంథిని, పున్నేలు
- ఆత్మకూరు మండలంలోని ఊరుగొండ, కొత్తగట్టు, హసన్పర్తిలోని జయగిరి, ముచ్చెర్ల, మడిపెల్లి
- దామెర, పరకాల, నడికూడ మండలాల్లోని చెరువులు
ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం..
సాంబశివరావు ఏడీ గనులశాఖ
చెరువు, కుంటలు, పట్టాభూముల్లో అనుమతులు లేకుండా మట్టి తీస్తే ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ఎన్వోసీతోనే రాయల్టీ కట్ట¨ంచుకొని చెరువుల్లో మట్టి తీసేందుకు అనుమతులు ఇస్తున్నాం. అనుమతులు పొందిన గుత్తేదారు అధిక మొత్తంలో మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.