వసతిగృహం.. సమస్యలతో సతమతం
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.
వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రవేశాలు లేకపోవడంతో నల్లబెల్లిలోని ఎస్సీ వసతిగృహాన్ని మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మరమ్మతులకు నోచుకోకపోవడంతో.. భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మంగళవారం ‘న్యూస్టుడే బృందం’ నిర్వహించిన పరిశీలనలో చాలాచోట్ల సమస్యలే దర్శనమిచ్చాయి.
ఏటా వేసవి సెలవుల్లో వసతిగృహ భవనాల స్థితిగతులు, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, వంటగదులు, తలుపులు తదితరాలను పరిశీలించి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా.. ఈ ఏడాది సంబంధితశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదని స్పష్టమవుతోంది. జిల్లాలోని ఎస్సీ వసతిగృహాల మరమ్మతులకు ఈ ఏడాది ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ నిధి కేటాయించలేదని, జిల్లాలో నర్సంపేట, పర్వతగిరిలో మాత్రమే ప్రభుత్వ భవనాల్లో వసతిగృహాలు నడుస్తున్నాయని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల సమస్య లేదని ఆమె పేర్కొన్నారు.
శిథిల భవనంలో భయంగా..
- వరంగల్ నగర నడిబొడ్డున రంగంపేటలో ఎస్టీ బాలుర వసతిగృహం ఉంది. సుమారు 38-40 ఏళ్ల క్రితం నాటి భవనం పూర్తిగా పాడైంది. వానొస్తే వణుకే, విద్యార్థులు బిక్కు బిక్కుమనాల్సిందే.
- 30 మంది విద్యార్థులువిద్యార్థుల వసతిగృహం భవనం శిథిలావస్థకు చేరింది.
- తాత్కాలికంగా డెకోలంతో కిటికీలు, జాలీలు ఏర్పాటు చేశారు.
- విద్యుత్తు సరఫరా పైపులు పాడయ్యాయి. అదనంగా ఫ్యాన్లు కావాలి.
- మరుగుదొడ్లు, స్నానాల గదులు అధ్వానంగా ఉన్నాయి. కొన్నింటికి డోర్లు సరిగాలేవు.
రంగంపేట, న్యూస్టుడే
వంట సామగ్రి రావడం లేదు..
- వర్ధన్నపేట పట్టణ శివారులోని ఎస్టీ బాలుర వసతిగృహం
- 60 మంది విద్యార్థులు ఉన్నారు.
- ప్రభుత్వం నుంచి ఒక్క బియ్యం మాత్రమే వస్తున్నాయి. ఇతర వంట వస్తువులు, గుడ్లను సిబ్బంది ప్రైవేటు కిరాణ దుకాణం నుంచి ఉద్దెరకు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం సిద్ధం చేస్తున్నారు.
- గదులకు కిటికీలకు తలుపులు ఏర్పాటు చేశారు. కానీ దోమలు రాకుండా జాలీలు ఏర్పాటు చేయలేదు.
- వసతి గృహంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మూలనపడ్డాయి. ఫ్యాన్లు పనిచేస్తున్నాయి.
- విద్యార్థులు చేతులు, భోజనం చేసిన ప్లేట్లు శుభ్రం చేసుకునే ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్లు సగం మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రహరీ పూర్తిగా లేకపోవడంతో కర్రలు, ఇతర ముళ్లకొమ్మలు అడ్డుగా ఉంచారు.
వర్ధన్నపేట, న్యూస్టుడే
కొనసాగుతున్న పనులు..
నర్సంపేటలోని బీసీ బాలుర వసతిగృహంలో మొత్తం 100 మంది విద్యార్థులు ఉండగా 80 మంది హాజరయ్యారు. వసతిగృహానికి రూ.2 లక్షలు మంజూరు కావడంతో ఇంజినీరింగ్ అధికారులు మరుగుదొడ్లు, తాగునీటికి సంబంధించిన పనులు చేపట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గుత్తేదారు.. రంగులు వేయడం, విద్యుత్తు తీగలు, ఐదు కొత్త ఫ్యాన్లు, అన్ని గదుల్లో ట్యూబులైట్లు అమర్చారు. చిన్న మరమ్మతు పనులు చేస్తున్నారు. కిటికీలకు జాలీలు కొట్టించి ఊడిపోయిన తలుపులు పెట్టించాల్సి ఉంది. కొన్ని విద్యుత్తు మరమ్మతులు చేయాల్సి ఉంది.
నర్సంపేట, న్యూస్టుడే
మరమ్మతులకు ప్రత్యేక నిధులు..
- పుష్పలత, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి
జిల్లాలో 8 ప్రీమెట్రిక్, 8 పోస్ట్మెట్రిక్ బీసీ వసతిగృహాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది వసతిగృహాల్లో చేయించాల్సిన మరమ్మతులకు కమిషనరేట్ నుంచి ఎలాంటి నిధులు రాలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి ఒక్కో వసతిగృహానికి రూ.2 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు కొన్ని వసతిగృహాల్లో మరమ్మతులు పూర్తవ్వగా.. మిగిలిన పనులను త్వరలో పూర్తిచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ముందు మెరుపులు.. వెనుక మరకలు
-
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
-
పేట్రేగిపోతున్న మృగాళ్లు.. వావీ వరుసలు మరిచి దుర్మార్గాలు
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
-
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి