వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు.
వెంకటాపురం, న్యూస్టుడే: సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 1,528 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఆయా వసతి గృహాలను మంగళవారం ‘న్యూస్టుడే’ బృందం పరిశీలించగా పలు సమస్యలు వెలుగుచూశాయి.
మరమ్మతుల్లో నిర్లక్ష్యం
అత్యవసర మరమ్మతులకు ఒక్కొ హాస్టల్కు రూ.20 వేలు మంజూరు చేశారు. విద్యుత్తు లైట్లు, ఫ్యాన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం, పరిసరాల పరిశుభ్రతకు ఈ నిధులను వెచ్చించాలని ప్రణాళిక చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణకు నియమించినా మరమ్మతుల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఒకటి రెండు చోట్ల మినహా అంతటా అసంపూర్తిగానే ఉన్నాయి. బీసీ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి ఒక్క చోట రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నిధులు అవసరమని, ఎస్సీ హాస్టల్లో రూ.లక్ష నిధులు సమకూర్చాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి.
అధికారులు ఏమంటున్నారంటే..
గిరిజన సంక్షేమ శాఖచే వసతి గృహాల్లో సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయని ఐటీడీఏ డీడీ పోచం అన్నారు. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వసతి గృహాల్లోని మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఇతర సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సీహెచ్ రవీందర్రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు నిధుల మంజూరుకు ఎదురుచూస్తున్నామని ఆ శాఖ జిల్లా అధికారి లక్ష్మణ్నాయక్ వివరించారు.
ధ్వంసమైన ప్రధాన మార్గం
వసతిగృహం: బీసీ బాలుర వసతి గృహం, వెంకటాపురం
విద్యార్థుల సంఖ్య: 22 మంది
వసతుల సౌకర్యం: పిచ్చిమొక్కలతో పరిసరాలు అస్తవ్యస్థంగా ఉన్నాయి.
కిటికీలకు తలుపులు, జాలీలు, ఫ్యాన్లు, దీపాలు: జాలీలు ఏర్పాటు చేయాలి. గదుల్లో లైట్లు, ఫ్యాన్లు అమర్చాలి.
మరుగుదొడ్లు, మూత్రశాలలు: మరుగుదొడ్లకు వెళ్లే మార్గం అధ్వాన్నంగా ఉంది.
జాలీలులేని కిటికీలు.. ఇరుకు గదులు
- ఎస్సీ బాలుర వసతి గృహం, వాజేడు
- 76 మంది
- ఇరుకైన మూడు గదుల్లోనే ఉండాల్సివస్తోంది. వసతి అసౌకర్యంగా ఉంది.
- తుప్పు పట్టిన ఇనుప తలుపులు. జాలీలు లేవు. లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి.
- మరమ్మతులు చేయాల్సి ఉంది.
న్యూస్టుడే, వాజేడు
అధ్వానంగా మరుగుదొడ్లు
ములుగు పట్టణంలో ఎస్టీ వసతి గృహంలో 80 మంది, ఎస్సీ హాస్టల్లో ఐదుగురు, బీసీలో ఆరుగురు ఉన్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలు రెండు ఒకే క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. ఎస్టీ హాస్టల్లో గదులకు సరిగా తలుపులు లేవు. ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో నీటి శుద్ధీరణ యంత్రం పాడైపోయింది. కొన్ని మరుగుదొడ్లలో చెట్లు మొలిచాయి
న్యూస్టుడే, ములుగు టౌన్
శిథిలావస్థలో గదులు
- గిరిజన బాలుర వసతిగృహం, పస్రా
- 67 మంది
- భవనం శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పెచ్చులూడుతున్నాయి.
- జాలీలు, తలుపులు లేవు. ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు ఉన్నాయి.
- మరుగుదొడ్లు, స్నానపు గదులు అస్తవ్యస్థంగా ఉన్నాయి.
న్యూస్టుడే, గోవిందరావుపేట
అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం
- బీసీ బాలుర వసతి గృహం, ఏటూరునాగారం
- 35 మంది
- ప్రహరీ పూర్తిస్థాయిలో లేదు. కిచెన్ షెడ్డు సరిగా లేక వంట చేయడం ఇబ్బందిగా ఉంది.
- తుప్పు పడుతున్నాయి. జాలీలు లేవు. లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి.
- తలుపులు సరిగా లేవు. మూడేళ్ల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఇంతవరకు పూర్తికాలేదు.
న్యూస్టుడే, ఏటూరునాగారం
నిరుపయోగంగా బోరు
- ఎస్టీ బాలుర హాస్టల్, తిమ్మంపేట, మంగపేట
- 75 మంది
- నీటి వసతి లేదు. హాస్టల్లో ఉన్న బోరు మరమ్మతుకు గురైంది.
- తలుపులు, జాలీలు, లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి.
- సరిగానే ఉన్నాయి.
న్యూస్టుడే, మంగపేట
జిల్లా గణాంకాలు ఇలా
ఎస్టీ 8 776
ఎస్సీ 6 300
బీసీ 6 450
- శాఖ
- వసతి గృహాలు
- విద్యార్థుల సంఖ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.