కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు.
జిల్లా పోలీసు అధికారి శబరీష్
ములుగు టౌన్, ములుగు, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ)తో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..
న్యూస్టుడే: పాత, కొత్త చట్టాలకు తేడా ఏమిటి?
ఎస్పీ: పాత చట్టాలనేవి బ్రిటీష్ కాలం నాటివి. ఫిర్యాదుదారులకు వెసులుబాటు కల్పించే విధంగా కొత్త చట్టాలను రూపొందించారు. నేరాలను ఆడియో, వీడియో, మొబైల్లో రికార్డు చేయడమనేది గతంలో ఉండేదికాదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. గతంలో ఎఫ్ఐఆర్ నమోదుకు తప్పనిసరిగా పోలీసు స్టేషన్కు రావాల్సిందే. ఇప్పుడు రానవసరం లేదు. గతంలో ఎక్కడ సంఘటన జరిగితే అక్కడే ఎఫ్ఐఆర్ చేసేవారు ..ఇప్పుడు ఎక్కడైనా నమోదు చేయొచ్చు.
కొత్తగా వచ్చిన చట్టాలతో ఉపయోగం?
సమయం ఆదాతో పాటు జాప్యం లేకుండా కేసు ముందుకు సాగే అవకాశం ఉంది. కేసు నమోదు నుంచి మొదలుకొని ఛార్జిషీటు దాఖలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక వంటి వాటి కోసం సమయం కేటాయించారు. దాంతో పాటు కోర్టు కూడా నిర్దేశించిన సమయంలోనే కేసు విచారణ పూర్తి చేయాలి. ఇలా ప్రతి అంశానికి సమయం ఉంది. వేగంగా తీర్పిచ్చే విధంగా రూపొందించారు. అత్యాచారం కేసులో గతంలో మెడికల్ రిపోర్టు రావడంలో జాప్యం జరిగేది. కొత్త చట్టాల ప్రకారం వారం రోజుల్లోనే రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఠాణాలో ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు కాకపోతే ఉన్నతాధికారి వద్దకు వెళ్తారు. అక్కడ కూడా నమోదవ్వకపోతే కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. కోర్టు నేరుగా కేసు ఎందుకు నమోదే చేయలేదని వివరణ అడుగుతుంది. దీంతో తప్పుడు కేసులు నమోదు కాకుండా ఉండే అవకాశాలున్నాయి. కొత్త చట్టాలతో పూర్తి విచారణ తర్వాత కేసు నమోదు చేసేందుకు అవకాశం కలిగింది.
ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి మార్పులు, చేర్పులున్నాయా?
ఎస్టీ, ఎస్టీ చట్టానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు పొందుపర్చలేదు. కేసు నమోదు, విచారణ తదితర అంశాలు యథావిధిగానే ఉంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం లేదు.
విచారణ అధికారికి వెసులుబాటు కలిగిందా?
ఏదైనా కేసులో దర్యాప్తు చేసిన అధికారి కోర్టుకు సాక్ష్యం ఇచ్చేందుకు హాజరు కావాల్సి ఉంటుంది. పని ఒత్తిడిలో కొన్ని వాయిదాల వరకు కోర్టుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కొత్త చట్టం ప్రకారం వర్చువల్ పద్ధతిలో వీడియో ద్వారా సాక్ష్యం ఇచ్చే అవకాశం కలిగింది.
సమన్ల జారీకి ఏం రూపొందించారు?
గతంలో కోర్టు నుంచి జారీ చేసిన సమన్లను కక్షిదారుల ఇంటికెళ్లి ఇచ్చేవారు. ఇప్పుడు సంక్షిప్త సందేశం ద్వారా అందించే అవకాశాలున్నాయి. గతంలో సాక్షి తప్పనిసరిగా ఎక్కడున్నా స్టేషన్కు లేదంటే సంఘటన జరిగిన ప్రదేశానికి రావాల్సి ఉండేది. ఇప్పుడు సాక్ష్యాల సేకరణలో భాగంగా సాక్షి అందుబాటులో లేకపోతే వీడియో కాల్ ద్వారా సాక్ష్యాన్ని నమోదు చేయొచ్చు.
నేరస్థులపై ఎలా ప్రభావం చూపుతుంది?
నేరస్థులపై ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. పూర్తి విచారణ తర్వాత ఒకసారి కేసు నమోదైతే శిక్ష పడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. కేసు నమోదులో పూర్తి వివరాలు సేకరిస్తారు. చట్టం దుర్వినియోగం కాదు. ఇది ఉపయోగకరమైంది. నేరస్థులు తప్పించుకోలేరు.
ఎలా అవగాహన కల్పిస్తారు?
పోలీసుస్టేషన్ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తాం. ఫిర్యాదు పద్ధతిపై సవివరంగా వివరిస్తాం. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఆడియో, వీడియో ఎలక్ట్రానిక్ పరికరాలు, వాయిస్ రికార్డింగ్ సాక్ష్యాలు మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తాం.
ప్రజలకు మీరిచ్చే సూచనలు?
కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఎవరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి. ప్రశాంత జీవనానికి ప్రజలందరూ సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.