నాడు సక్రమం.. నేడు అక్రమం!
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
బల్దియా, రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు
ఈనాడు, వరంగల్, కార్పొరేషన్, న్యూస్టుడే
బాలసముద్రంలోని భారాస హనుమకొండ జిల్లా కార్యాలయం
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు నిబంధనలు అమలు పరచాలి. భారాస ప్రభుత్వం హయాంలో అప్పటి జనగామ కలెక్టర్ శ్రీదేవసేన నిక్కచ్చిగా వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకమ్మ కుంట స్థలాన్ని ఆక్రమించగా ఆమె పెద్ద పోరాటమే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేది లేదని ఓ కలెక్టర్గా తన విధులు సక్రమంగా నిర్వర్తించారు. కొందరు అధికారులు మాత్రం ప్రజాప్రతినిధులు ఎలా చెబితే అలా తలూపుతూ నిబంధనలు తుంగలో తొక్కడం గమనార్హం. హనుమకొండ నగర నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఎకరం భూమిని నాడు అధికారులు కేటాయించారు. నిర్మాణ అనుమతి పొందకుండా భవన నిర్మాణం చేస్తుంటే మహానగరపాలక సంస్థ ప్రేక్షకపాత్ర వహించింది. ఇప్పుడేమో నిర్మాణం అక్రమమని.. ఇందుకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. సర్వే నెంబరు 1066లోని ఎకరం భూమిని 2018లో రెవెన్యూ శాఖ దీనికి కేటాయించింది. గజానికి రూ.100 ధర ఖరారు చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.కోట్లు విలువ చేసే భూమిని దారాధత్తం చేశారు. రెవెన్యూ అధికారులు అప్పటి పాలకులు చెప్పినట్టు తలలూపి నిబంధనలు అతిక్రమించి భూ కేటాయింపు చేశారు.. మరోవైపు గ్రేటర్ వరంగల్ అధికారులూ దీని నిర్మాణాన్ని అడ్డుకోలేదు. ఇప్పుడేమో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు ఇచ్చారు..
పశ్చిమ ఎమ్మెల్యే ఫిర్యాదుతో..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఫిర్యాదుతో 2018లో కేటాయించిన ఎకరం భూమి కేటాయింపును రద్దు చేయాలని గతనెల 1న అప్పటి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.. హనుమకొండ ఆర్డీవోకు ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ ఆర్డీవో లేఖ ఆధారంగా గ్రేటర్ వరంగల్ కాజీపేట సర్కిల్ కార్యాలయం ఉపకమిషనర్ గతనెల 25వ తేదీతో భారాస కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. స్థలానికి సంబంధించిన దస్తావేజులు, భవన నిర్మాణ అనుమతి ప్రొసీడింగ్ కాపీ, ప్లాన్ సమర్పించాలని, లేని పక్షంలో 2019 తెలంగాణ కొత్త పురపాలక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంకులు.. నిబంధనలు బేఖాతరు!
[ 05-07-2024]
వాహనం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ద్విచక్ర వాహనమైనా తప్పనిసరిగా ఉంటుంది. -
పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం
[ 05-07-2024]
కుమారుడి అకాల మృతితో.. అంతులేని దుఃఖంలో ఉన్నా.. అతడి నేత్రాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన మండల కేంద్రంలోని దేవిలాల్ తండాలో చోటుచేసుకుంది. -
అన్నదాతలకు భూ ఆరోగ్య కార్డులు!
[ 05-07-2024]
భూమిలోని పోషకాలను తెలుసుకొని దానికనుగుణంగా పంటలను సాగు చేసేలా రైతులను సమాయత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి మట్టి నమూనాలను సేకరించాలని ఆదేశించింది. -
‘ఆస్కార్’ గ్రంథాలయం ప్రారంభం
[ 05-07-2024]
‘ప్రపంచ వేదికపై తెలుగు పాట ఖ్యాతిని నిలబెడుతూ సగర్వంగా ఆస్కార్ అవార్డు అందుకొని.. దానికి సూచికగా పుట్టిన ఊరిలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మిస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి చంద్రబోస్ అని’ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. -
విజయ గాథల్ని అనుసరిద్దాం.. బడిని మార్చేద్దాం!
[ 05-07-2024]
‘రాష్ట్ర వ్యాప్తంగా మంచి పనితీరు కనబరచిన 55 పాఠశాలల విజయగాథలను ‘హర్బింగర్స్ ఆఫ్ ఛేంజ్’ (మార్పును ముందే సూచించే దూతలు) పేరిట ఇటీవల ప్రచురించారు. -
కొత్త చట్టాలతో.. సత్వర చర్యలు
[ 05-07-2024]
ఈ నెల(జులై) 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు నేర చట్టాలు జిల్లాలో అమలు కావడం ప్రారంభమైంది. -
మమ్మల్ని విడిచి వెళ్లావా నాన్నా..
[ 05-07-2024]
తండ్రి మరణించిన విషయం తెలియని చిన్నారులు నిద్రపోతున్నాడని మృతదేహం దగ్గర లేనాన్నా.. లేనాన్నా.. అని ఏడుస్తూ విలపిస్తుండటం చూసిన గ్రామస్థులు, బంధువులు కన్నీటి పర్యాంతమైన సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలో చోటుచేసుకుంది. -
బియ్యం.. ఇయ్యం!
[ 05-07-2024]
జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా ప్రభుత్వం సేకరిస్తోంది. ఆ ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇస్తోంది. -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
[ 05-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్య, ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) కె.దేవరాజం అన్నారు. -
పథకం పారితేనే పంట..
[ 05-07-2024]
వాగుల్లోని పోటెతుత్తున్న వరదనీటి ఆయకట్టు రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించేందుకు నిర్మించిన చిన్ననీటి ఎత్తిపోతల పథకాల్లో చాలా వరకు మూలకుచేరాయి. -
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా!
[ 05-07-2024]
అన్నదాతలు పండించిన వరి ధాన్యంను వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా ప్రభుత్వం సేకరిస్తోంది. ఆ ధాన్యాన్ని మర ఆడించేందుకు జిల్లాలో ఉన్న రైస్మిల్లులకు అప్పగిస్తోంది. -
నా చావుకు వారే కారణం..!
[ 05-07-2024]
పాత గొడవలు మనసులో పెట్టుకొని.. అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. -
గంజాయి మత్తులో మైనర్ల హల్చల్
[ 05-07-2024]
వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని కాశీకుంట ప్రాంతంలో బుధవారం రాత్రి గంజాయి మత్తులో మైనర్లు హల్చల్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్