నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.
జిల్లా పోలీస్ అధికారి కిరణ్ ఖరే
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.
ప్రశ్న: నూతన నేర చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించారా?
ఎస్పీ: నూతన నేర చట్టాలపై ముందుగా నలుగురు ఎస్సైలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించాం. ఆ తర్వాత వారితో వివిధ స్థాయిల 506 మంది పోలీస్ సిబ్బందిని 14 బృందాలుగా విభజించి శిక్షణ ఇచ్చాం. వారికి కొత్త చట్టాలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందజేశాం.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన శిక్షలు ఎలా ఉండనున్నాయి?
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై కఠిన శిక్షలున్నాయి. ప్రత్యేక అధ్యయనాన్ని చేర్చారు. 66, 64, 65, 80, 85, 86, తదితర సెక్షన్లను పొందుపర్చారు. చిన్నారులపై సామూహిక లైంగిక దాడి కేసుల్లో జీవిత ఖైదు, మరణ శిక్ష లాంటి కొత్త నిబంధనలు చేర్చారు.
బాధితులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
బాధితులు ఠాణా పరిధిలోకి రాకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో వాట్సప్, మెయిల్, వెబ్సైట్ ద్వారా పంపొచ్చు. ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోగా ఠాణాకు వచ్చి ఫిర్యాదుపై సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఘటన జరిగిన వద్ద కాకుండా బాధితులు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత ఠాణాకు ఫిర్యాదును బదిలీ చేస్తారు. విచారణ పురోగతి సమాచారం కూడా బాధితులకు అందిస్తారు. విచారణ వేగవంతంగా పూర్తవుతుంది.
ప్రజలకు చట్టాలపై ఎలాంటి సందేశం ఇస్తారు?
ప్రజల కోసమే చట్టాలు పనిచేస్తాయి. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా రూపొందించారు. స్వాతంత్య్రానికి పూర్వం తయారు చేసిన చట్టాలను నవీకరించారు. వీటిపై అవగాహన కలిగి ఉండాలి. ఏవైనా సందేహాలుంటే పోలీస్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
ఈ నెల 1కి ముందు జరిగిన నేరాలు, ఘటనలకు సంబంధించిన కేసులను ఏ చట్టాల పరిధిలో విచారణ జరుపుతారు?
జూన్ 30 వరకు నమోదైన కేసులను పాత చట్టాల ప్రకారమే విచారణ జరుపుతాం. జులై 1 నుంచి నమోదైనవి మాత్రం కొత్త చట్టం ప్రకారం విచారణ, శిక్షలు ఉంటాయి.
కొత్త చట్టాలపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించనున్నారు?
ఇప్పటికే పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. శిక్షకులు, పోలీస్ సిబ్బందితో కొత్త చట్టాలపై గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. ప్రజలకు సందేహాలుంటే పోలీస్ వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాగే ఠాణాల్లోనూ తెలుసుకోవచ్చు.
కొత్త చట్టాల ద్వారా పోలీసులకు అనుకూలించే అంశాలేవి? కొత్త, పాత చట్టాలకు కొన్ని వ్యత్యాసాలను తెలుపుతారా?
కొత్త చట్టం ద్వారా పోలీస్ అధికారాలు బలోపేతం అయ్యేవి ఉన్నాయి. 7 సంవత్సరాల లోపు శిక్షపడే నేరాలకు రిమాండ్ అధికారం పోలీసులకు ఉండేది కాదు. ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆ నేరాలకు పోలీసులు రిమాండ్ తీసుకునే అవకాశం ఉంది. నేర విచారణలో నిందితుడిని పోలిస్ రిమాండ్ను 15 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. దీనివల్ల కేసుల్లో పురోగతి వేగంగా ఉంటుంది. నేర ఘటన వివరాలను పంచనామా రూపంలో రాత పూర్వకంగా ఉండేది. దాని ఆధారంగానే విచారణ సాగేది. ఇప్పుడు ఘటనా స్థలిని వీడియోలో నిక్షిప్తం చేయాలి. సాక్ష్యంగా ఇవి ఉపయోగపడతాయి. తనిఖీల సమయంలోనూ వీడియోలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిందితులకు సమన్లను ఆన్లైన్లో పంపే అవకాశం ఉంది. జైలు, ఆసుపత్రి, ఇతర ప్రాంతాల నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివరాలను వెల్లడించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం.. ఆకర్ష వ్యూహం
[ 06-07-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులో జెండా ఎగరేసింది. త్వరలో పంచాయతీ, స్థానిక సంస్థలు, పుర ఎన్నికలు రానున్నాయి. వీటిల్లోనూ సత్తా చాటేందుకు, మరింత బలపడేందుకు పార్టీ అధిష్ఠానం ఆకర్ష వ్యూహంతో ముందుకెళ్తోంది.. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి వివిధ స్థాయిల నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. -
వర్షం నీరు ఒడిసి పడదాం..
[ 06-07-2024]
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. రెండు, మూడు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం నీళ్లన్నీ నాలాల ద్వారా వృథాగా పోతున్నాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఉన్న నగరంలో వర్షం నీరు భూగర్భంలోకి ఇంకే పరిస్థితి లేదు. -
561 మంది విద్యార్థులు.. నలుగురే ఉపాధ్యాయులు
[ 06-07-2024]
వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న బడిలో 561 మంది పిల్లలుండగా.. నలుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. -
మూగజీవాలపై ప్రేమానురాగం.. కావొద్దు ప్రాణాంతకం
[ 06-07-2024]
ఇవి హనుమకొండలోని కాకాజీకాలనీలో ఓ వ్యాపారి అమ్ముతున్న కుందేళ్లు, పిచ్చుకలు. పలువురు జంతు ప్రేమికులు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు వివిధ జాతుల కుక్క పిల్లలు, పిల్లులు ఇక్కడ విక్రయిస్తున్నారు. -
అటకెక్కిన అల్పాహారం
[ 06-07-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే, చదువుపై ఆసక్తి తగ్గుతుందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం గతేడాది అక్టోబరు 24 నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. -
అసలేం జరిగింది..!
[ 06-07-2024]
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మృతి చెందిన ఇద్దరు యువకుల ఘటనపై అధికారులు శుక్రవారం రామన్నగూడెంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు, తొర్రూరు సీఐ సంజీవ విచారణ ప్రారంభించారు. -
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం!
[ 06-07-2024]
జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా వెళ్లొచ్చని అనుకుంటారు. వరంగల్-ఖమ్మం 563వ జాతీయ రహదారి అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. అక్కడక్కడ ఉన్న గుంతలపై ప్రయాణం చేయడానికి జంకుతున్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యమే లక్ష్యం
[ 06-07-2024]
వానాకాలం సీజన్ గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి ఎల్.లక్ష్మీరమాకాంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
యథేచ్ఛగా ఇసుక దందా..!
[ 06-07-2024]
జిల్లాల్లోని ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచులను ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. -
పౌర సేవ.. సాంకేతిక తోవ!
[ 06-07-2024]
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సంబంధిత.. ధ్రువపత్రాల కోసం.. మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడం పరిపాటి.. అయితే, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. -
శిథిల భవనాలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
[ 06-07-2024]
వర్షాకాలంలో అంటు వ్యాధుల ముప్పు, వరదల తాకిడి ఒక ఎత్తు కాగా, కాలం చెల్లిన గృహాలు, భవనాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు హెచ్చు. జనగామ జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు విస్తారంగా వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. -
జిల్లా సచివాలయం.. సమస్యలతో తల్లడిల్లుతోంది
[ 06-07-2024]
ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత దగ్గర చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలను(కలెక్టరేట్) నిర్మించింది. ఇందులో భాగంగా మన జిల్లాలోనూ రెండేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించబడింది. -
రహదారులపై అక్రమ నిర్మాణాలు
[ 06-07-2024]
నర్సంపేటలో కొందరు అంతర్గత రహదారులను ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నగర దారి.. నరకం
[ 06-07-2024]
వరంగల్ ప్రాంతంలోని రహదారులు గుంతల మయంగా మారాయి. వరంగల్ తూర్పులో 12 స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రమాదకరంగా ఉన్నాయి. -
ఎస్సైని వేధింపులకు గురి చేసిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు
[ 06-07-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత నెల 30న చేసిన ఆత్మహత్యాయత్నం ఘటనపై అక్కడి సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు శుక్రవారం నమోదైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ముందు మెరుపులు.. వెనుక మరకలు
-
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
-
పేట్రేగిపోతున్న మృగాళ్లు.. వావీ వరుసలు మరిచి దుర్మార్గాలు
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
-
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి