పురకు పట్టని కార్మికుల సంక్షేమం
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది.
మున్సిపల్ పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన వాహనాలకు నెంబరు ప్లేట్లు లేక..
జనగామ, న్యూస్టుడే: పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం వాహనాల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ, వాటికి రిజిస్ట్రేషన్, బీమా చేయించడంపై ఉండటం లేదు. వాహనాల వినియోగంలో పురపాలికలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నా రవాణ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో జరిగిన తప్పిదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఏటా రూ.4 కోట్ల వ్యయం
పట్టణ ప్రజా ఆరోగ్యం కోసం సేవలందించే పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని జనగామ పురపాలిక పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటింటి నుంచి చెత్తసేకరణ, యార్డుకు తరలింపునకు ఒక్కోటి రూ.లక్షల విలువైన వాహనాలను ఖరీదు చేశారు. 8 ట్రాక్టర్లు, 10 ఆటోలు, ఒక డంపర్ప్లేసర్, జేసీబీ, వైకుంఠరథం ఉన్నాయి. ఊడ్చే యంత్రంతో కూడిన మరో వాహనం కొనుగోలుకు ప్రతిపాదించారు. ఏటా వీటి నిర్వహణ, కార్మికుల వేతనాలు ఇతరత్రా అవసరాల పేరిట సుమారు రూ.4.5 కోట్లు ఖర్చవుతోంది. వాహనాల మరమ్మతు పేరిట జరిగే తంతుపై ఆరోపణలున్నాయి. వాహన ఖరీదు సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డుతో బయటకు వచ్చినా, నెల రోజులపాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్కు నోచక గుర్తింపు, బీమా లేని వాహనాలు ప్రమాదానికి గురైతే, ప్రమాదంలో ఎలాంటి పరిహారం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు.
వైకుంఠరథానిదీ అదే పరిస్థితి..
ఇలా ఉల్లంఘన
గతంలో ఖరీదు చేసిన ఆరు ట్రాక్టర్లలో ఒకటి మూలకు చేరింది. మరో రెండింటిని ట్యాంకర్లకు వాడుతున్నారు. ఏడాది క్రితం ఖరీదు చేసిన ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్, బీమా జరగలేదు. పాత ట్రాక్టర్లలో నాల్గింటికి బీమా లేదు. కాలం చెల్లిన బీఎస్-4 రకం ఆటోలను ఖరీదు చేసినప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించలేదు. దీంతో ఇప్పుడు వాటికి గుర్తింపు ఇవ్వడం కుదరదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వైఫల్యాలకు గత అధికారులే కారణమని ప్రస్తుత అధికారులు అంటున్నారు. వాహన బీమా, నిర్వహణ నిమిత్తం గత బడ్జెట్లో రూ.8 లక్షలు కేటాయించి చేతులు దులిపారు. ప్రగతి నిధులు రూ.32 లక్షలతో సుమారు రెండేళ్ల క్రితం జేసీబీ కొన్నారు. ఇప్పటికీ దానికి గుర్తింపు నెంబరు లేదు. రూ.16 లక్షలతో ఖరీదు చేసిన వైకుంఠరధానిదీ అదే దుస్థితి నెలకొంది.
వాహనాల రిజిస్ట్రేషన్, బీమా ప్రక్రియను పూర్తి చేసే ప్రక్రియ పుర పరిశీలనలో ఉంది.. ఈ విషయమై కార్మికులు ఇటీవలే కమిషనర్కు, కౌన్సిల్కు వినతి చేశారు.. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య విభాగం ఇన్ఛార్జి మధు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంకులు.. నిబంధనలు బేఖాతరు!
[ 05-07-2024]
వాహనం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ద్విచక్ర వాహనమైనా తప్పనిసరిగా ఉంటుంది. -
పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం
[ 05-07-2024]
కుమారుడి అకాల మృతితో.. అంతులేని దుఃఖంలో ఉన్నా.. అతడి నేత్రాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన మండల కేంద్రంలోని దేవిలాల్ తండాలో చోటుచేసుకుంది. -
అన్నదాతలకు భూ ఆరోగ్య కార్డులు!
[ 05-07-2024]
భూమిలోని పోషకాలను తెలుసుకొని దానికనుగుణంగా పంటలను సాగు చేసేలా రైతులను సమాయత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి మట్టి నమూనాలను సేకరించాలని ఆదేశించింది. -
‘ఆస్కార్’ గ్రంథాలయం ప్రారంభం
[ 05-07-2024]
‘ప్రపంచ వేదికపై తెలుగు పాట ఖ్యాతిని నిలబెడుతూ సగర్వంగా ఆస్కార్ అవార్డు అందుకొని.. దానికి సూచికగా పుట్టిన ఊరిలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మిస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి చంద్రబోస్ అని’ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. -
విజయ గాథల్ని అనుసరిద్దాం.. బడిని మార్చేద్దాం!
[ 05-07-2024]
‘రాష్ట్ర వ్యాప్తంగా మంచి పనితీరు కనబరచిన 55 పాఠశాలల విజయగాథలను ‘హర్బింగర్స్ ఆఫ్ ఛేంజ్’ (మార్పును ముందే సూచించే దూతలు) పేరిట ఇటీవల ప్రచురించారు. -
కొత్త చట్టాలతో.. సత్వర చర్యలు
[ 05-07-2024]
ఈ నెల(జులై) 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు నేర చట్టాలు జిల్లాలో అమలు కావడం ప్రారంభమైంది. -
మమ్మల్ని విడిచి వెళ్లావా నాన్నా..
[ 05-07-2024]
తండ్రి మరణించిన విషయం తెలియని చిన్నారులు నిద్రపోతున్నాడని మృతదేహం దగ్గర లేనాన్నా.. లేనాన్నా.. అని ఏడుస్తూ విలపిస్తుండటం చూసిన గ్రామస్థులు, బంధువులు కన్నీటి పర్యాంతమైన సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలో చోటుచేసుకుంది. -
బియ్యం.. ఇయ్యం!
[ 05-07-2024]
జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా ప్రభుత్వం సేకరిస్తోంది. ఆ ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇస్తోంది. -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
[ 05-07-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్య, ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) కె.దేవరాజం అన్నారు. -
పథకం పారితేనే పంట..
[ 05-07-2024]
వాగుల్లోని పోటెతుత్తున్న వరదనీటి ఆయకట్టు రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించేందుకు నిర్మించిన చిన్ననీటి ఎత్తిపోతల పథకాల్లో చాలా వరకు మూలకుచేరాయి. -
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా!
[ 05-07-2024]
అన్నదాతలు పండించిన వరి ధాన్యంను వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా ప్రభుత్వం సేకరిస్తోంది. ఆ ధాన్యాన్ని మర ఆడించేందుకు జిల్లాలో ఉన్న రైస్మిల్లులకు అప్పగిస్తోంది. -
నా చావుకు వారే కారణం..!
[ 05-07-2024]
పాత గొడవలు మనసులో పెట్టుకొని.. అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. -
గంజాయి మత్తులో మైనర్ల హల్చల్
[ 05-07-2024]
వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని కాశీకుంట ప్రాంతంలో బుధవారం రాత్రి గంజాయి మత్తులో మైనర్లు హల్చల్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!