ఖాళీ ప్లాట్లు.. స్థానికులకు పాట్లు
నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారడంతో కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
హంటర్రోడ్ సంతోషిమాత కాలనీలో..
నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారడంతో కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి. అందమైన భవనాల నడుమ ఖాళీ ప్లాటు ఉంటే.. అందులో చెత్తాచెదారం వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత ఏర్పడుతోంది. దీంతో రోగాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్లను ఆదివారం ‘న్యూస్టుడే’ బృందం పరిశీలించింది.
కార్పొరేషన్, న్యూస్టుడే
రూ.5-10 వేల వరకు జరిమానా
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో 4 వేల పైచిలుకు ప్రైవేటు ఖాళీ స్థలాలున్నాయని గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగం సర్వే ద్వారా గుర్తించారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనల ప్రకారం ఖాళీ ప్లాట్లపై చర్యలు తీసుకునే అధికారం కమిషనర్కు ఉంది. ఖాళీ స్థలం యజమానిని గుర్తించి నోటీసు జారీ చేయాలి. వారం రోజుల్లో ప్లాటు శుభ్రం చేసుకోవాలని సూచించాలి. గడువు ముగిసినా.. స్పందించక పోతే మున్సిపల్ కార్మికులు, యంత్రాలతో స్థలాన్ని చదును చేయించాలి. యజమానికి రూ.5-10 వేల వరకు జరిమానా విధించాలి. అవసరమైతే స్థలాన్ని స్వాధీనం చేసుకొని గ్రేటర్ వరంగల్ పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలి. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం నోటీసులతో సరిపెడుతున్నారు.
ఎక్కువ ఖాళీ స్థలాలున్న ప్రాంతాలు..
హంటర్రోడ్, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్నగర్, సంతోషిమాత కాలనీ, గాయత్రినగర్, ఆటోనగర్, దేశాయిపేట, ఎల్బీనగర్, ఎనుమాముల సాయిగణేష్ కాలనీ, మధురానగర్, లేబర్ కాలనీ, రంగశాయిపేట తెలంగాణ కాలనీ, ఉర్సు, ఎస్ఆర్ఆర్తోట, శివనగర్, విద్యానగర్, నాగేంద్రనగర్, ఉర్సు, పాపయ్యపేట, రంగంపేట.
మినీ డంపింగ్యార్డులు..
కరీమాబాద్: 33వ డివిజన్ శాంతినగర్లోని ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో స్థానికులు చెత్తను ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. భవనాల పక్కనున్న ఖాళీ స్థలాలు మినీ డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. 33వ డివిజన్లో పదికిపైగా ఖాళీ స్థలాలు ఉండగా.. ప్రతిచోటా అదే పరిస్థితి.
పాముల బెడద..
రంగశాయిపేట: 41వ డివిజన్ పరిధిలోని శంభునిపేట విశ్వనాథ కాలనీలో నివాస గృహాల నడుమ ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. దోమలు, విష పురుగుల సంచారం ఎక్కువైంది. పాముల బెడద నెలకొంది. దీంతో స్థానికులు రాత్రివేళ బయటికి రావాలంటే జంకుతున్నారు.
దోమలకు నిలయం..
పోచమ్మమైదాన్: గ్రేటర్ వరంగల్ 13 డివిజన్లోని వాసవీకాలనీ, గణేష్నగర్, టీచర్స్కాలనీ 22వ డివిజన్లోని 80 అడుగుల రోడ్డు మార్గం, పోచమ్మమైదాన్ సమీపంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. 12వ డివిజన్ తుమ్మలకుంట ప్రాంతంలో నివాస గృహాల మధ్య మురుగు నిలిచి దోమలకు నిలయంగా మారింది.
అడుగడుగునా ఇక్కట్లే..
కీర్తినగర్కాలనీ(గీసుకొండ): గీసుకొండ మండలం 16వ డివిజన్ పరిధి కీర్తినగర్ కాలనీలో అడుగడుగునా ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. కీర్తినగర్ కాలనీలో 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం హౌజింగ్బోర్డును ఏర్పాటు చేసి 1450 ఇళ్లను నిర్మించింది. ఇందులో ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ ఇళ్లు ఉన్నాయి. ఈ కాలనీలో సుమారు 50 వరకు ప్రభుత్వ స్థలాలతో పాటు అంతకంటే ఎక్కువగానే ప్రైవేటు ఖాళీ స్థలాలున్నాయి. అందులో వర్షం నీరు నిల్వ ఉండి.. తుమ్మ చెట్లు, పిచ్చిమొక్కలు మొలిచాయి. అపరిశుభ్రతతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు.
వానాకాలంలో తీవ్ర ఇబ్బంది..
శ్రీదేవి, గృహిణి, సాయిగణేష్ కాలనీ
మా కాలనీలో పదుల సంఖ్యలో ఖాళీ స్థలాలున్నాయి. సంవత్సరాల తరబడి వృథాగా ఉంటున్నాయి. యజమానుల వివరాలు తెలియడం లేదు. వానాకాలం వచ్చిందంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు ఆగుతోంది. దోమల సమస్య ఎక్కువవుతోంది.
అధికారులు చర్యలు తీసుకోవాలి
ఎసబోయిన అశోక్, స్థానికుడు
ఖాళీ స్థలాల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నోటీసులు జారీ చేశామంటూ చేతులు దులుపుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలా చూడాలి.
నోటీసులు జారీ చేస్తాం:
డాక్టర్ రాజేష్, ముఖ్యఆరోగ్యాధికారి, గ్రేటర్ వరంగల్
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో డివిజన్ల వారీగా ప్రైవేటు ఖాళీ స్థలాల వివరాలు సేకరించాం. సంబËంధిత యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. స్పందించక పోతే భారీ జరిమానాలు విధిస్తాం. స్థలాలు స్వాధీనం చేసుకుంటామని ప్రచారం చేస్తాం. దోమల నివారణ చర్యలు చేపడతాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు