వ్యాధుల కాలం.. అప్రమత్తతే కీలకం
వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్రం నెలకొంటోంది. గుంతలు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నిలిచే నీరు మశకాలకు ఆవాసంగా మారుతున్నాయి.
వెంకటాపురం మండలం ఉప్పేడుగొల్లగూడెంలో నివాసాల మధ్య మురుగు
వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్టుడే: వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్రం నెలకొంటోంది. గుంతలు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నిలిచే నీరు మశకాలకు ఆవాసంగా మారుతున్నాయి. కీటక, నీటిజనిత వ్యాధులకు ఊతమిస్తున్నాయి. ముసురుకొస్తున్న వ్యాధుల ముప్పు అధికారుల్లో అప్రమత్తతను హెచ్చరిస్తుస్తోంది. వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా విభాగం సమన్వయంతో ముందడుగు వేస్తేనే ప్రమాదఘంటికలు తప్పనున్నాయి. ఈ నేపథ్యంలో మన్యంలో తరుణవ్యాధుల స్థితి, యంత్రాంగం సన్నద్ధతపై ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లా పరిధిలో 419 గ్రామాల్లో 3.52 లక్షల జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ములుగు జిల్లా ఆసుపత్రి, వెంకటాపురం, ఏటూరునాగారంలో సీహెచ్సీలు, 15 పీహెచ్సీలు జిల్లాలో ఉన్నాయి. అనుబంధంగా పల్లెస్థాయిలో 51 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, 38 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఓ వైపు కాగా.. వైద్యులు, సిబ్బంది కొరతతో గ్రామీణంలో సకాలంలో సేవలు అందని పరిస్థితి ఉంది. ఇది వ్యాధుల ముప్పెట దాడికి ప్రతీ ఏటా కారణమవుతోంది.
గొత్తికోయ గూడేలపై దృష్టి
వ్యాధులు వ్యాప్తి చెందటంపై వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలసల కారణంగానే దోమల వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా గొత్తికోయ గూడేలపై ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారించేలా ప్రణాళిక చేసింది. జిల్లాలో 60కి పైగా గొత్తికోయగూడేల్లో 6,426 మంది నివసిస్తున్నట్లు క్షేత్రస్థాయి సర్వే ద్వారా తేల్చారు. ఈ గూడాల్లో వ్యాధులపై చైతన్యం కలిగించడం, ఛత్తీస్గఢ్ నుంచి రాకపోకలు సాగిస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకునేలా చొరవ చూపుతున్నారు.
దోమతెరలు వచ్చేదెన్నడో..
దోమతెరల ఊసేలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభావిత పల్లెలకు అందాల్సిన తెరలు గ్రామాలకు చేరలేదు. రెండేళ్ల కిందట సరఫరా చేపట్టగా, ప్రస్తుత ఏడాదికి వైద్యశాఖ ఎదురుచూస్తోంది. జిల్లా వ్యాప్తంగా 34 వేల దోమతెరలు అవసరం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్లు వైద్యశాఖ చెబుతోంది. వానాకాలానికి ముందే రావాల్సిన ఈ సామగ్రి నేటీకీ అందకపోవడం గుబులు కలిగిస్తోంది. దోమల నివారణకు పిచికారి సైతం నెమ్మదిగానే సాగుతోంది.
చాపకింద నీరులా..
వ్యాధుల కాలం ఆరంభానికి ముందే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. కన్నాయిగూడెం, రొయ్యూరు, కొడిశాల, తాడ్వాయి, పస్రా, వాజేడు, పేరూరు, ఎదిర తదితర ఎనిమిది పీహెచ్సీల పరిధిలోని 15 ఆరోగ్య ఉప కేంద్రాలు మలేరియా ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేరాయి. ఈ పరిధిలోని 123 గ్రామాలు తీవ్ర ప్రభావిత పల్లెలుగా వైద్యశాఖ నిర్ధారించింది. దోమకాటు ప్రభావిత ప్రాంతాలతో పాటు ఇతర పల్లెల్లోనూ ఈ ఏడాది మే నాటికి 13 మలేరియా, 4 డెంగీ కేసులు నమోదయ్యాయి.
క్షేత్రస్థాయిలో శ్రమిస్తేనే..
అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తేనే కాలానుగుణ వ్యాధులను కట్టడి చేయొచ్చు. ఇందుకు ప్రభుత్వశాఖల్లో సమన్వయం అవసరం. గ్రామీణుల్లో వ్యాధులపై ఉన్న నిర్లిప్తత, అవగాహన రాహిత్యాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. ఫ్రైడే డ్రైడేతో పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. దోమలను నియంత్రించేందుకు ఫాగింగ్ యంత్రాల దుమ్ము దులపాల్సి ఉంది. పైపులైన్ల లీకేజీలు అరికట్టడం, పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపడితేనే మున్ముందు ముప్పు తప్పనుంది.
సమన్వయంతో ముందుకు
అల్లె అప్పయ్య, డీఎంహెచ్వో, ములుగు
సీజనల్ వ్యాధుల కట్టడికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది గొత్తికోయగూడేలపై ప్రత్యేక దృష్టి సారించాం. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం. దోమల నివారణకు చర్యలు ప్రారంభమయ్యాయి. దోమతెరలకు ప్రతిపాదనలు పంపించాం. వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక సేవలకు ప్రణాళిక చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
-
ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
-
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
-
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!