బకాయిల ఊబిలో సింగరేణి
భూపాలపల్లి సింగరేణి డివిజన్లో కార్మికుల, అధికారుల క్వార్టర్లు, భవనాలను అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కొందరు నెలవారీగా అద్దె చెల్లించటం లేదు. సకాలంలో సింగరేణికి అద్దె చెల్లించకపోవడంతో విద్యుత్తు బిల్లులు, తాగునీరు.
సింగరేణి వీటీసీ భవనంలో ఏర్పాటైన పోలీసు భరోసా కేంద్రం
న్యూస్టుడే, భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి డివిజన్లో కార్మికుల, అధికారుల క్వార్టర్లు, భవనాలను అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కొందరు నెలవారీగా అద్దె చెల్లించటం లేదు. సకాలంలో సింగరేణికి అద్దె చెల్లించకపోవడంతో విద్యుత్తు బిల్లులు, తాగునీరు. తదితర నిర్వహణ ఖర్చుల భారం పెరుగుతోంది. భూపాలపల్లి ఏరియాలోని క్వార్టర్లు, భవనాల్లో నివాసం ఉంటున్న రెవెన్యూ, ఫారెస్టు, పోలీసు, తదితర శాఖల అధికారులే కాకుండా పలువురు ప్రజా ప్రతినిధులు చెల్లించాల్సిన ఇంటి అద్దె బకాయిలు రూ.2.15 కోట్ల వరకు ఉన్నాయి. కార్మికులు క్వార్టర్లు సకాలంలో ఖాళీ చేయకుంటే, వారి వేతనాల నుంచి అద్దె డబ్బులు రికవరీ చేస్తారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు సకాలంలో క్వార్టర్లు ఖాళీ చేయకుంటే, వారికి వచ్చే డబ్బులను నిలుపుదల చేస్తారు. సింగరేణి అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు తీసుకున్న క్వార్టర్లకు, భవనాలకు ఎందుకు అద్దె వసూలు చేయటం లేదని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు వందల సంఖ్యలో సింగరేణి కార్మికులు క్వార్టర్ల సౌకర్యం లేక అద్దె ఇళ్లలో రూ.వేలకు వేలు ఇంటి అద్దె చెల్లిస్తున్నారు. మరికొందరు నివాస గృహాలు లేక చుట్టుపక్కల గ్రామాల్లో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లా ఆవిర్భావం నుంచే..
భూపాలపల్లి జిల్లా ఆవిర్భావం నుంచే సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు వెచ్చిన సింగరేణి అధికారులకు, కార్మికులకు నివాస గృహాలు వివిధ శాఖల అధికారులకు, ఇతర సిబ్బందికి కేటాయించారు. ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయానికి కూడా మంజూరునగర్ ప్రాంతంలో నిర్మించిన ఓ అతిథి గృహాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు పది ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొనసాగాయి. గతేడాది నవంబరు మాసంలో సింగరేణి అతిథి గృహంలో కొనసాగిన కలెక్టర్ కార్యాలయం మంజూరునగర్ ప్రాంతంలోని వంద పడకుల ఆసుపత్రి సమీపంలో నిర్మించిన కొత్త సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోకి మార్చారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇందులోకే వచ్చాయి. ఇక్కడి వరకు మంచిగానే ఉంది. 2017 నుంచి ఇప్పటివరకు సింగరేణి సంస్థకు చెల్లించాల్సి అద్దె చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం నిర్మించిన దాదాపు 135 క్వార్టర్లు, భవనాలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు అద్దెకిచ్చారు. వీటిలో నివాసం ఉంటున్న కొందరు అద్దె బకాయిలు ఎందుకు చెల్లించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు ఇక్కడ అద్దెకు ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన అధికారులు చెల్లించటం లేదు. బదిలీపై వెళ్లిన అధికారులు, సిబ్బంది కుటుంబీకులు సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్నా అద్దె అడిగితే క్వార్టర్ తమ పేరుతో లేదని సమాధానం చెబుతున్నారు.
బకాయిల వసూళ్లకు ఒత్తిడి పెంచుతున్నాం
సయ్యద్ హబీబ్ హుస్సేన్, జీఎం, భూపాలపల్లి
సింగరేణికి సంబంధించిన క్వార్టర్లు, భవనాల్లో నివాసం ఉంటున్న పలు శాఖల అధికారులు చెల్లించాల్సిన అద్దె బకాయిల వసూళ్లపై ఒత్తిడి పెంచుతున్నాం. ఇటీవల వీటి విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కొంత మంది నివాసం ఉంటున్న ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తే, బకాయిలు చెల్లించారు. ఇప్పటికే మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ఖాళీగా ఉన్న 300 క్వార్టర్లను త్వరలో అర్హులైన కార్మికులకు అప్పగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ