పలిమెల మండలం పేరుకేనా?
జిల్లాలోనే మారుమూల ప్రాంతం పలిమెల మండలం. ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎనిమిదేళ్ల కిందట నూతన మండలంగా ఏర్పాటుచేశారు.
మండల కేంద్రంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల భవనం
జిల్లాలోనే మారుమూల ప్రాంతం పలిమెల మండలం. ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎనిమిదేళ్ల కిందట నూతన మండలంగా ఏర్పాటుచేశారు. కాని ప్రభుత్వ సేవలన్నీ పూర్వపు మండల కేంద్రమైన మహదేవ్పూర్ నుంచే నిర్వహిస్తున్నారు. కొత్త మండలం ఏర్పాటువల్ల స్థానికులకు ఇప్పటికీ ప్రయోజనాలు అంతంత మాత్రమే అందుతున్నాయి.
-ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, పలిమెల, న్యూస్టుడే
సిద్ధంగా సమీకృత భవనం.. మరో భవనానికి శంకుస్థాపన..
పలిమెలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఐదేళ్ల క్రితం సమీకృత కార్యాలయాల భవనం నిర్మించారు. ఇందులో తహసీల్దారు, మండల ప్రజా పరిషత్ బోర్డులు పెట్టారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు మాత్రమే అధికారులు వస్తారు. సుమారు రూ.65 లక్షల నిధులతో మరో సమీకృత కార్యాలయం మంజూరైంది. ఫిబ్రవరి నెలలో ఐటీ మంత్రి శ్రీధర్బాబు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మెరుగైన రవాణా సౌకర్యం..
పలిమెల మండలం ఏర్పాటైన కొత్తలో రవాణా సౌకర్యం ప్రమాదకరంగా ఉండేది. వాగులపై వంతెనలు లేక రాకపోకలు కష్టంగా ఉండేది. ప్రస్తుతం పెద్దంపేట, పంకెన, తీగలవాగులపై వంతెనలు పూర్తవటమేగాక, పలిమెల నుంచి మహాదేవ్పూర్ వరకు రెండు వరుసల రహదారి నిర్మించారు. హనుమకొండ నుంచి పలిమెలకు రాకపోకలు కొనసాగించేలా ఆర్టీసీ బస్సు సౌకర్యం సైతం అందుబాటులోకి వచ్చింది.
భద్రత ఇబ్బందులు తొలగినా..
గతంలో పలిమెలలో ఎలాంటి చరవాణి సిగ్నళ్లు సరిగా ఉండేవి కావు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్, ఓ ప్రైవేటు కంపెనీకి సంబంధించిన 5జీ సిగ్నళ్లు అందుబాటులోకి వచ్చాయి. కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఇంటర్నెట్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మారుమూల ప్రాంతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతాపరమైన ఇబ్బందులుంటాయని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలిమెలలో పోలీస్ స్టేషన్ ఏర్పాటై మూడు సంవత్సరాలుగా పోలీసు సేవలు అందిస్తున్నారు. అందువల్ల ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది స్పష్టం. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ప్రాంతం సైతం ఠాణా సమీపంలోనే గుర్తించినందున రక్షణపరంగా ఇబ్బందులుండవు.
కార్యాలయాలన్నీ అక్కడే..
2016లో పలిమెలను 8 గ్రామ పంచాయతీలతో నూతన మండలంగా ఏర్పాటైంది. మండలం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇప్పటికి 8 సంవత్సరాలు గడుస్తున్నా మండల కేంద్రానికి ఏ ఒక్క కార్యాలయం కూడా రాలేదు. మండలం ఏర్పాటైన కొత్తల్లో భవనాల కొరత, ఫోన్ సిగ్నల్, రవాణా సౌకర్యం, భద్రత, పోలీసు సేవలు అందుబాటులో లేవు. ఈకారణంగా పాత మండలమైన మహదేవపూర్లోనే తహసీల్దార్, మండల ప్రజాపరిషత్, వ్యవసాయ, విద్యావనరుల కేంద్రం తదితర కార్యాలయాలు ఏర్పాటుచేసి అక్కడినుంచే పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పలిమెలలో సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నా కార్యాలయాలను మాత్రం తరలించటం లేదు. దీంతో ప్రజలు ప్రతి చిన్న పనికీ 32 కి.మీ దూరంలో ఉన్న మహదేవపూర్కి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికంగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
బాడిష భాస్కర్, పలిమెల
పలిమెలకు సంబంధించిన కార్యాలయాలు మహదేవపూర్లో ఉండటంతో ఒక గంటలో అయ్యే పని రెండు రోజులు పడుతోంది. పలుమార్లు తిరగడం వల్ల అదనపు ఖర్చు, సమయం వృథా అవుతోంది. కలెక్టర్ స్పందించి కార్యాలయాలు పలిమెల తరలించేలా చర్యలు తీసుకోవాలి.
పత్రాల విషయంలో ఇబ్బందులు
చిలుముల సంతోష్, పంకెన గ్రామం
మండలంలో మీసేవ కేంద్రాలు ఉన్నప్పటికీ పత్రాలపై అధికారుల సంతకాల కోసం 32 కిలోమీటర్లు దూరంలోని మహదేవపూర్ వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో అధికారి లేకుంటే సాయంత్రం వరకు ఎదురుచూసి, మరుసటి రోజు వెళ్తున్నాం. కుల, ఆదాయ ధ్రువపత్రాల విషయంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
త్వరలోనే కార్యాలయాలు తరలిస్తాం
వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్
అన్ని కార్యాలయాలను పలిమెల మండలానికి తరలిస్తాం. రెండ్రోజుల్లోనే అక్కడికి మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం. మండల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యాలయాలు అందుబాటులోకి తెస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టరు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల