నిర్మాణం పూర్తయినా.. నిరుపయోగం
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, యోగా సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న యోగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేయడానికి ఆరోగ్య స్వస్థత కేంద్రాలను(హెల్త్ వెల్నెస్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు.
దేవరుప్పుల మండలం పెద్దమడూరులో..
జనగామ టౌన్, న్యూస్టుడే: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, యోగా సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న యోగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేయడానికి ఆరోగ్య స్వస్థత కేంద్రాలను(హెల్త్ వెల్నెస్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. జనగామ జిల్లాకు కూడా రూ.54 లక్షల వ్యయంతో 9 సెంటర్లు మంజూరు చేయగా, ఏడాదిన్నర క్రితమే 8 కేంద్రాల నిర్మాణం పూర్తి చేయగా, జనగామ పట్టణంలో మాత్రం భూసేకరణ సమస్యతో నిర్మాణం జరగలేదు. పూర్తయిన చోట నిర్వీర్యం చేస్తున్నారు.
ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు
జిల్లాలో మొత్తం 9 ఆరోగ్య స్వస్థత కేంద్రాలను ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. జిల్లాలోని పెద్దమడూరు, చెన్నూరు, పెంబర్తి, పడమటికేశ్వాపూర్, తాటికొండ, ఛాగల్, అశ్వరావుపల్లి, నవాబ్పేట గ్రామాల్లో ఆరోగ్య స్వస్థత కేంద్రాల నిర్మాణం పూర్తి చేశారు. జనగామ పట్టణంలో తొలుత కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లభించలేదు. ఇటీవలే పట్టణంలోని ధర్మకంచలో ఉన్న అర్బన్ పీహెచ్సీలో వెనుక వైపు అందుబాటులో ఉన్న ఖాళీ నిర్ణయించారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఇతర గ్రామాల్లో పూర్తయిన ఎనిమిది కేంద్రాలు ఏడాదిన్నరగా నిరుపయోగంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఆయా కేంద్రాల్లో యోగా శిక్షకుల నియామకం పూర్తి కాలేదు. తొలుత ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని యోచించినా, వారికి ఇతర పని ఒత్తిడి వల్ల ఆలోచనను విరమించుకున్నారు. దీనికి ఆయా గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులనే ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. యోగాలో డిప్లొమాతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో శిక్షకుల ఎంపిక జరుగనుంది.
గర్భిణులకు ఎంతో ఉపయోగం..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులపై వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు కాన్పు కంటే ముందు వారికి అవసరమైన యోగాసనాలను నేర్పించాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సాధారణ కాన్పులు అయ్యే వీలుంటుందని ఆయుష్ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే అన్ని వయసులు, వర్గాల ప్రజలు కూడా సాధన చేయడానికి ఈ కేంద్రాలు ఉపయోగించుకునే వీలుంటుందని చెపుతున్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్న ఆరోగ్య స్వస్థత కేంద్రాలను ప్రారంభించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలు అందుబాటులోకి వచ్చినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం..
ధర్మరాజు, ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్.
జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఆరోగ్య స్వస్థత కేంద్రాలను త్వరలో ప్రారంభించడానికి చర్యలు చేపడతాం. శిక్షకులు లేని విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో నియామకం ఉంటుంది, తర్వాత ప్రారంభం ఉంటుంది. ప్రారంభిస్తే గర్భిణులతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునే వీలుంటుంది.
జిల్లాలో మంజూరైన ఆరోగ్య స్వస్థత కేంద్రాలు : 09
నిర్మాణం పూర్తయినవి : 08
ఒక్కో కేంద్రానికి మంజూరైన నిధులు : రూ.6 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి