విద్యార్థులకు ఉపకారం.. విజ్ఞాన్ మంథన్
నిత్యం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
న్యూస్టుడే, భూపాలపల్లి: నిత్యం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి జాతీయ ప్రఖ్యాత పరిశోధన సంస్థలను సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాల ఇంటర్న్షిప్, ఏడాది పాటు నగదు ప్రోత్సాహకాలను అందించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.. ప్రభుత్వ పరిధిలోని విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్) సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎమ్) ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్ కళాశాలలు 1,017 వరకు ఉండగా, ఇందులో 6 నుంచి ఇంటర్ వరకు 2.42 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.
దరఖాస్తులు ఎలా పంపించాలంటే..?
ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 రుసుం చెల్లించి, ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. సెప్టెంబరు 15 వరకు అవకాశం ఉంటుంది. నమోదు చేసుకున్న వారికి జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రకటించిన తేదీల్లో పరీక్షలు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలతో పాటు ఇతర దేశాల భాషల్లోనూ పాల్గొనవచ్చు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే వెబ్సైట్లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబరు 23, 27(వీలును బట్టి ఏదైనా తేదీల్లో) పరీక్ష ఉంటుంది. నవంబరు 15న ఫలితాలు విడుదల చేస్తారు. డిసెంబరు 8, 15, 22 తేదీల్లో ఒక రోజు రాష్ట్ర స్థాయి పోటీలుంటాయి. 2025 మే 17 లేదా 18 తేదీల్లో జాతీయ స్థాయి పరీక్ష ఉంటుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరమైనా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పరీక్ష విధానం ఇలా..
వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన వారికి వంద బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు చదివే సామాన్య, గణితం, పాఠ్యపుస్తకాల్లోని అంశాలు 50 శాతం, విజ్ఞానశాస్త్ర రంగంలో భారతదేశ కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలపై 20 శాతం మార్కులుంటాయి. ఇవి వీవీఎం వారు అందించే స్టడీ మెటీరియల్ ద్వారా ఇస్తారు. ఇక లాజిక్, రీజనింగ్ 10 శాతం ప్రశ్నలు వస్తాయి. వీటిని సమకాలీన అంశాలపై ఇస్తారు.
విజేతలకు ఉపకార వేతనం..
పాఠశాల స్థాయి పోటీల్లో 18 మంది చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి ఆన్లైన్ ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ధ్రువపత్రం, జ్ఞాపిక, రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున అందజేస్తారు. అలాగే భాస్కర స్కాలర్షిప్ పేరుతో ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
బి.స్వామి, జిల్లా సైన్స్ అధికారి, భూపాలపల్లి
పాఠ్యపుస్తకాలతో పాటు, సామాజిక అంశాలు, చరిత్రపై పట్టున్న విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిభా పోటీలు పూర్తిగా ఆన్లైన్లో ఉంటాయి. కంప్యూటర్, చరవాణి తెలిసిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాలల హెచ్ఎంలకు సమాచారాన్ని అందించి, ఎక్కువ మంది పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక వాట్సప్లోనూ పిర్యాదు చేయొచ్చు
[ 03-07-2024]
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) వచ్చాయి. -
ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!
[ 03-07-2024]
అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. -
దర్జాగా మట్టి దందా..
[ 03-07-2024]
చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. -
వసతిగృహం.. సమస్యలతో సతమతం
[ 03-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. -
‘కుడా’ తీరే వేరు!
[ 03-07-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. -
వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!
[ 03-07-2024]
సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం
[ 03-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. -
నాడు సక్రమం.. నేడు అక్రమం!
[ 03-07-2024]
హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం
[ 03-07-2024]
దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. -
పురకు పట్టని కార్మికుల సంక్షేమం
[ 03-07-2024]
పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
[ 03-07-2024]
పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!